నందిగామ : పట్టణంలోని బంగారు ఆభరణాల దుకాణంలో కొన్ని నెలల క్రితం జరిగిన చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.7.50 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ పోలీసుస్టేషన్లో డీఎస్పీ చిన్నహుస్సేన్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఫిబ్రవరిలో నంది గామ ప్రభుత్వాస్పత్రి ఎదురుగా శ్రీనివాస సిల్వర్ అండ్ గోల్డ్ ప్యాలెస్ పేరుతో ఉన్న నగల దుకాణం వెనుక వైపు షట్టర్ పగలగొట్టి లోనికి చొరబడిన దుండగులు సుమారు రూ.30 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు, రూ.3.75 లక్షల నగదును చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన షేక్ అబ్దుల్, అబ్దుల్ బారిక్, ఉపేంద్రషాను ఈ కేసులో నిందితులని, వారికి బషిరుద్దీన్ గ్యాంగ్ లీడర్గా వ్యవహరించాడని గుర్తించారు.
మరి కొందరికి కూడా ఈ చోరీలో సంబంధం ఉందని అనుమాని స్తున్నారు. షేక్ అబ్దుల్, అబ్దుల్ బారిక్, ఉపేంద్రషా సోమవారం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద 300 గ్రాముల బంగారం ఆభరణాలు, ఐదున్నర కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.50 లక్షలు ఉంటుంది. చోరీ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీ సులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను మీడియా ముందు ఉంచారు. స్టేషన్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు, ఎస్ఐలు ఏసుబాబు, తులసిరామకృష్ణ, ఏఎస్ఐ రామారావు పాల్గొన్నారు.
ఆరు నెలలకు ముగ్గురి అరెస్టు
ఆభరణాల చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులకు ఆరు నెలల సమయం పట్టింది. ఈ దుకాణంలో రూ.30 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురైతే కేవలం రూ.7.50 లక్షల విలువ చేసే ఆభరణాలను మాత్రమే రికవరీ చేయగలిగారు. నందిగామ పోలీసులకు నేరస్తులను గుర్తించేందుకే ఆరు నెలలు సమయం పట్టింది. మొత్తం మీద ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పోలీసులు కొంత మేర రికవరీచేశారు. ఇక ఇటీవల కాలంలో నందిగామ పట్టణంలో జరిగిన అనేక చిన్నచిన్న చోరీల కేసుల్లో విచారణ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉంది.
ఆభరణాల చోరీ కేసు నిందితుల అరెస్టు
Published Tue, Aug 26 2014 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్నను మళ్లీ సీఎం చేద్దాం
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
4 రోజులు సిట్ కస్టడీ
కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
హడలెత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు
పంటల బీమా వర్తించలేదని రైతుల నిరసన
లాభం చూపెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
హోసూరు వార్తలు..
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement