ఓటు అడగలేదని పోలింగ్‌ బహిష్కరణ | People Boycott Polling Due to the Candidates not Asking Their Vote | Sakshi
Sakshi News home page

ఓటు అడగలేదని పోలింగ్‌ బహిష్కరణ

Apr 12 2019 1:24 PM | Updated on Apr 12 2019 1:25 PM

People Boycott Polling Due to the Candidates not Asking Their Vote - Sakshi

విజయనగర్‌ కాలనీలో ఓటింగ్‌కు వెళ్లకుండా ధర్నా చేస్తున్న మహిళలు

మదనపల్లె :  పేదలు నివసించే ప్రాంతమని వివక్ష చూపుతూ, కనీసం ఓటు అడిగేందుకు రాకపోవడంతో మూకుమ్మడిగా అందరూ కలిసి ఓట్లు వేసేందుకు వెళ్లమని పోలింగ్‌ను బహిష్కరించిన సంఘటన పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో జరిగింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్థానిక విజయనగర్‌ కాలనీ సిమెంట్‌ రోడ్డు ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మహిళలు ఓటు వేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2, 3 వార్డుల పరిధిలో తమ కాలనీ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు అడిగేందుకు తమ వార్డులకు రాలేదన్నారు. నాయకులు వస్తే వారికి తమ సమస్యలను చెప్పి, గెలిచిన తర్వాత పరిష్కరించమని అడుగుదామనుకుంటే ఎవరూ అటువైపు చూడకపోవడంతో మా ఓట్లు వారికి అవసరం లేదనుకున్నారేమోనని ఓటుకు వెళ్లడం మానుకున్నామని చెప్పారు.  
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement