పట్టాల మధ్య పడుకున్నాడు.. పైనుంచి రైలు వెళ్లింది

Man Sleeps Between Railway Track in Ananthapuram - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం రైల్వే స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. అటువైపు ఉన్న ఫాట్‌ఫామ్‌పైకి వెళ్లేందుకు.. ఆగి ఉన్న గూడ్స్‌ రైలు కింద నుంచి వెళ్లేందుకు ఓ ప్రయాణీకుడు ప్రయత్నించాడు. ఇంతలో గూడ్స్‌ రైలు కదలడంతో.. పట్టాలపైనే ఉండిపోయాడు. గూడ్స్‌ రైలు వెళ్లిపోయిన తర్వాత అమ్మయ్య అంటూ పట్టాలపైనుంచి లేచి ఫ్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాడు. దాంతో గూడ్స్‌ రైలు వెళ్లేదాకా ఊపిరి బిగబట్టి చూసిన మిగతా ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది.. ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top