విశాఖ నగరంలోని మద్దిలిపాలెం బస్ డిపో వద్దనున్న హోర్డింగ్ ఎక్కి ఓ వ్యక్తి శనివారం హల్ చల్ చేస్తున్నాడు.
హోర్డింగ్ ఎక్కి వ్యక్తి హల్చల్
Mar 5 2016 1:19 PM | Updated on Sep 19 2019 2:50 PM
మద్దిలిపాలెం : విశాఖ నగరంలోని మద్దిలిపాలెం బస్ డిపో వద్దనున్న హోర్డింగ్ ఎక్కి ఓ వ్యక్తి శనివారం హల్ చల్ చేస్తున్నాడు. పై నుంచి దూకేస్తానంటూ బెదిరిస్తున్నాడు. సదరు వ్యక్తి నగరంలోని అరినోవా ప్రాంతానికి చెందిన రాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్స్ ను తెప్పించి రాజును కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement


