అతివేగం ప్రాణం తీసింది | man died in road accident | Sakshi
Sakshi News home page

అతివేగం ప్రాణం తీసింది

Apr 3 2015 6:00 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న బైక్ ముందు ప్రయాణిస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

గుంటూరు : వేగంగా వెళ్తున్న బైక్ ముందు ప్రయాణిస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రొంపిచర్ల మండలం విరాటం గ్రామానికి చెందిన అచ్చి వెంకటేశ్వర్లు, రాఘవులు అనే ఇద్దరు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వెళ్తూ ముందు ప్రయాణిస్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీ కొన్నారు. దీంతో బైక్ వెనుక నుంచి టిప్పర్ వాహనంలో ఇరుక్కుపోవడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాఘవులుని మెరుగైన వైద్యం కోసం చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement