కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Aug 2 2015 12:19 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది.

రావులపాలెం (తూర్పుగోదావరి) : కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. పొడగట్లపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(42) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పెంటయ్య ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత మద్యం సేవించడం కోసం మద్యం దుకాణానికి వెళ్లి అక్కడే పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement