
అరసవల్లి సూర్యదేవాలయం
అరసవల్లిలోని అతిపురాతన సూర్య దేవాలయంలో డిసెంబర్ 18 నుంచి 30 వరకు మహసౌరయాగం నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం: అరసవల్లిలోని అతిపురాతన సూర్య దేవాలయంలో డిసెంబర్ 18 నుంచి 30 వరకు మహసౌరయాగం నిర్వహించనున్నారు. భారీ ఎత్తున నిర్వహించతలపెట్టిన ఈ యాగంలో దేశవ్యాప్తంగా ఉన్న అర్చక పండితులంతా పాల్గొననున్నారు.
శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్ర వర్మ నిర్మినట్లు ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తోంది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలను తాకడం ఇక్కడి ప్రత్యేకత.
ఈ ఏడాది ఉగాది (11-04-2013) రోజున భారత తపాలా శాఖ అరసవల్లి సూర్య దేవాలయం , శ్రీకూర్మంలోని కూర్మనాధ స్వామి ఆలయం బొమ్మలతో తపాల బిళ్లలను విడుదల చేసింది.