హైదరాబాద్: రైతు రుణమాఫీపై ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ సీవీఆర్ రాజేంద్రన్ శుక్రవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజమైన లబ్ధిదారులకే రుణమాఫీ వర్తిస్తుందని రాజేంద్రన్ అన్నారు. కుటుంబానికి ఒక్క లోన్ మాత్రమే మాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు.
అర్హులు కానివారు తీసుకున్న లోన్లకు మాఫీ ఉండదని రాజేంద్రన్ స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలకు రుణాల మాఫీ అనేది ప్రభుత్వం చేస్తున్న సహాయం మాత్రమే ఆంధ్రా బ్యాంక్ ఛైర్మన్ సి.వి.ఆర్ రాజేంద్రన్ మీడియాకు వెల్లడించారు.