అభివృద్దిపై బహిరంగ చర్చకు వస్తారా..?

Konda Rajiv Gandhi Fires On MLA Vasupalli Ganesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ దక్షిణ నియోజక వర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు వస్తారా అంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌కు వైఎస్సార్సీపీ యువజన విభాగం అద్యక్షులు కొండా రాజీవ్ గాంధీ సవాలు విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించే ముందు మీరు ఆత్మ విమర్శ చేసుకోండని మండిపడ్డారు. ఎమ్మెల్యే లను కొనుగోలు చేసిన పార్టీ టీడీపీ అని, దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు కాలుష్యంతో బాధ పడుతుంటే మీరు పశ్చిమ నియోజకవర్గంలో నివాసం వుంటారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top