నరసరావుపేట వెస్ట్
పట్టణంలోని వన్నూరుకుంట పార్క్ సమీపంలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు నిర్వహించిన జన్మభూమి-మాఊరు పదకొండో వార్డు సభ రసాభసాగా మారింది. సభకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాగానే జై కోడెల అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా.. ప్రతిగా జై గోపిరెడ్డి, జై జగన్ అంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ షేక్ మున్నీపై పథకం ప్రకారం టీడీపీకి చెందిన మహిళలు దాడిచేసి ఆమెను కిందపడేశారు.
ఇరువర్గాలను అదుపు చేసేందుకు సీఐ ఎం.వి.సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీ సులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. సభ సజావుగా జరిగేందుకు అవకాశం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ డి.శ్రీనివాసరావు, డీఈ సీతారామారావులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. జన్మభూమి కార్యక్రమం లో భాగంగా వన్నూరుకుంట పార్కు వద్ద ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ డి.శ్రీనివాసరావు అధ్యక్షతన సభను నిర్వహించేందుకు సమాయుత్తమయ్యారు. సభకు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని చూడగానే అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున జై కోడెల అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు.
అందుకు ప్రతిగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా జై జగన్, జై గోపిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వచ్చేందుకు యత్నించగా సీఐలు ఎం.వి.సుబ్బారావు, బి.కోటేశ్వరరావు, ఎస్ఐ లోకనాథ్ తమ సిబ్బందితో ఇరువర్గాల మధ్య నిలబడి శాంతింపచేసేందుకు యత్నించారు. ఈలోగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్ షేక్.మున్నిపై టీడీపీకి చెందిన ఐదుగురు మహిళలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోపోద్రికులయ్యారు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన పోలీసులు స్వల్పంగా ఇరువర్గాలపై లాఠీచార్జి చేశారు.
పరిస్థితి చేజారిపోవడంతో వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ డీఈ సీతారామారావు ప్రకటించారు. అనంతరం తన వద్దకు వచ్చిన కమిషనర్ డి.శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా మీరు వ్యవహరిస్తే సాయంత్రం 12వ వార్డులో జరిగే సభ కూడా జరపలేరన్నారు. ఈ సంఘటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, జెడ్పీటీసీ నూరుల్అక్తాబ్, వైఎస్సార్ సీపీ కన్వీనర్లు ఎస్ఏ హనీఫ్, కొమ్మనబోయిన శంకరయాదవ్, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, పట్టణ అధికార ప్రతినిధి బాపతు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు మాగులూరి రమణారెడ్డి, మాడిశెట్టి మోహనరావు, పాలపర్తి వెంకటేశ్వరరావు, మాజీ వైస్ చైర్మన్ షేక్ సైదావలి పాల్గొన్నారు.
పేటలో జన్మభూమి రసాభాస
Published Sat, Oct 11 2014 12:20 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement