సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్ | Sakshi
Sakshi News home page

సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్

Published Tue, Apr 8 2014 2:55 PM

సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్ - Sakshi

చిత్తూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలోనే షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మంగళవారం శ్రీనివాసులు ఆ పార్టీలో చేరారు.

చంద్రబాబును నమ్మి పూర్తిగా నష్టపోయామని శ్రీనివాసులు విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని అన్నారు. రాష్ట్రానికి జగన్ నాయకత్వం చాలా అవసరమని , రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ అధికారంలోకి రావాలని శ్రీనివాసులు చెప్పారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement