
జగదీష్పై పెరుగుతున్న వ్యతిరేకత
టీడీ పీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్పై రాన్రాను వ్యతిరేకత పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అన్నీ జగదీషేనంటూ వెంట తిరిగిన తమ్ముళ్లు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతతో
పార్వతీపురం: టీడీ పీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్పై రాన్రాను వ్యతిరేకత పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అన్నీ జగదీషేనంటూ వెంట తిరిగిన తమ్ముళ్లు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతతో ఆయనపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నుంచి నిన్న మొన్నటి కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక వరకు జరిగిన పరిణామాల పట్ల తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో ద్వారపురెడ్డి జగదీష్ తన రాజకీయ చతురత తో 12 వార్డులను గెలుచుకుని, ఇండిపెం డెంట్ల మద్దతుతో మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని తన సతీమణి శ్రీదేవికి కట్టబెట్టారు. తాను ఎమ్మెల్సీ రేసులో లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి తనకే వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకు డు, ఆది నుంచి పార్టీ జెండాను భుజాన వేసుకొని తిరిగిన బార్నాల సీతారం ఆశపడ్డారు.
అయితే అనూహ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన బెలగాం జయప్రకాష్కు వైస్ చైర్మ న్ కట్టబెట్టారు. అప్పటి నుంచి బార్నాల వర్గం జగదీష్ పట్ల వ్యతిరేకత కనబరు స్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కో- ఆప్షన్ పదవిని టీడీపీలో ఆది నుంచి ఉం టున్న మరియదాసు, సీనియర్ నాయకు డు బోడ పోలారావు, కోరాడ సతీష్, పట్టా చిన్నంనాయుడు, తదితరులు ఆశించారు. ఒకానొక సమయంలో ఓ నాయకుడు తనకు కో-ఆప్షన్ పదవి వచ్చిం దని స్వీట్లు కూడా పంచిపెట్టారు. అదేదీ జరగకుండా ఊహించని రీతిలో జగన్నాథపురానికి చెందిన రాగోలు మంగమ్మకు కో-ఆప్షన్ కట్టబెట్టారు. దీం తో జగదీష్ను వ్యతిరేకించేవారు ఎక్కువయ్యారు. ఇదిలా ఉండగా త్వరలో భర్తీ చేయనున్న ఏఎంసీ చైర్మన్ పదవికి కూడా రూ.20 లక్షలకు బేరసారాలు జరిగాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే జగదీష్ వ్యతిరేక వర్గం బలపడే అవకాశాలు లేకపోలేదు.
ఇదిలా ఉండగా మున్సిపాలిటీలో కొత్తగా పాలకవర్గం పగ్గాలు చేపట్టింది మొదలు చైర్పర్శన్ పర్యట నలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు నెలలు గా పట్టణ ప్రజలు తాగునీటి కి ముఖం వాచిపోతున్నారు. దీంతోపాటు వరహా లగెడ్డ గట్టుపై బడ్డీల తొలగింపు, పట్టణ ప్రజలకు కనీస మౌలిక వసతులు అం దించకపోవడంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఇండిపెండెంట్ల మద్ధతుతో చైర్పర్సన్ పదవి దక్కించుకున్న ద్వారపురెడ్డికి ఆ పదవిని సైతం దూరం చేసే పనిలో వ్యతిరేకవర్గం పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేసే పనిలో ఉన్నట్లు భోగట్టా. ఏది ఏమైనా జగదీష్ తమ పట్ల రేగుతున్న వ్యతిరేకతను చక్కదిద్దుకోకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.