బాధ్యతలు స్వీకరించిన ఆర్టీజీఎస్‌ సీఈవో ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం

IPS Officer N Balasubramaniam Take Charges As RTGS CEO - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ టైం గవర్నెన్స్‌ నూతన (ఆర్టీజీఎస్‌) సీఈవోగా ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని ఆర్టీజీ స్టేట్ క‌మాండ్ సెంటర్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీజీఎస్‌ సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’కు సాంకేతిక తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు. ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ఆర్టీజీఎస్‌ను ముందుకు తీసుకెళ్ల‌తామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top