పీలేరు మండలం ఎర్రగుండ్లపల్లిలో భార్యాభర్తల మధ్య తగాదాల కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
చిత్తూరు: పీలేరు మండలం ఎర్రగుండ్లపల్లిలో భార్యాభర్తల మధ్య తగాదాల కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ కుమారుడు మృతికి పోలీసులే కారణమని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.
స్థానికుల కథనం ప్రకారం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దానిని అవమానంగా భావించిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.