ఎండల తీవ్రతపై డేంజర్ బెల్స్ | Hot weather stifles life in Two Telugu states | Sakshi
Sakshi News home page

ఎండల తీవ్రతపై డేంజర్ బెల్స్

May 25 2015 3:18 PM | Updated on Sep 3 2017 2:40 AM

ఎండల తీవ్రతపై డేంజర్ బెల్స్

ఎండల తీవ్రతపై డేంజర్ బెల్స్

ఎండల తీవ్రతపై విశాఖ వాతావరణ కేంద్రం డేంజర్ బెల్స్ మోగించింది.

విశాఖపట్నం : ఎండల తీవ్రతపై విశాఖ వాతావరణ కేంద్రం డేంజర్ బెల్స్ మోగించింది. ఇప్పటికే భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. తాజా నివేదికలో ఎండ తీవ్రత మరింత పెరగనుందని పేర్కొంది. మరో రెండు రోజులపాటు తీవ్రమైన ఎండకు వడగాలులు కూడా తోడవుతాయని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకి రాకూడదని హెచ్చరించింది. ఒకటి, రెండు చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement