‘కమిషన్‌ కోరిన సమాచారాన్ని కళాశాలలు ఇవ్వాలి’ | Higher Education Commission Secretary Rajashekar Checks College Fees In AP | Sakshi
Sakshi News home page

‘కమిషన్‌ కోరిన సమాచారాన్ని కళాశాలలు ఇవ్వాలి’

Nov 14 2019 8:03 PM | Updated on Nov 14 2019 8:56 PM

Higher Education Commission Secretary Rajashekar Checks College Fees In AP - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తాడేపల్లి: ఈ నెల 21వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని ఉన్నత విద్యా కమిషన్‌ సెక్రటరీ ఎన్‌. రాజశేఖర్‌ విద్యాసంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలల్లోని ఫీజులను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్‌, ఫార్మా, ఏంసీఏ, ఎంబీఏ కాలేజీలన్నింటికీ నోటీసులు పంపించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతి కాలేజీ యాజమాన్యం కమిషన్‌ కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, గతంలో ఫీజుల నిర్థారణపై ఆరోపణులు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని కాలేజీలకు భారీగా ఫీజుల పెంచారని, మరికొన్ని కాలేజీలకు తక్కువ ఫీజుల పేట్టారని అన్నారు. కాలేజీల్లో సదుపాయాల తనిఖీకి కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నామని, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబర్‌ నాటికి కొత్త ఫీజులను నిర్ణయించి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని  ఆయన వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement