- ముడి సరుకు పంపిణీని నిలిపేసిన పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ
- పనిలేక వలసపోతున్న చేనేత కార్మికులు
- ఆదుకునేవారే కరువయ్యారంటూ ఆవేదన
సంతకవిటి: చేనేత బతుకులు చితికిపోతున్నాయి. మొన్నటి వరకు దర్జాగా బతికినవారు నేడు పనులు లేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నారు. మరికొందరు పొట్టచేతపట్టుకుని వలసపోతున్నారు. దీనికి సంతకవిటి మండలంలోని సురవరం, మందరాడ, మామిడిపల్లి, కాకరాపల్లి, మండాకురిటి తదితర గ్రామాల్లోని వందలాది చేనేత కార్మిక కుటుంబాల జీవనకష్టాలే సజీవసాక్ష్యం. ఈ గ్రామాల్లోని చేనేత కార్మికులు పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంస్థలో సభ్యులుగా ఉండేవారు. దీంతో సంస్థ ముడిసరుకును అందజేస్తే వాటిని మగ్గాలపై నూలువడికి తిరిగి సరఫరా చేసేవారు.
దీంతో మహిళలకు కూడా చేతినిండా పని ఉండేది. సీజన్తో సంబంధం లేకుండా పనిదొరికేది. ఇంటిదగ్గరే ఉంటూ రోజుకు రూ.60 నుంచి రూ.70వరకు ఆదాయం పొందేవారు. పురుషులు వస్త్రాలను నేసి డబ్బులు సంపాదించేవారు. దీంతో జీవనం సాఫీగా సాగిపోయేది. ఏడాదిగా ఆంధ్రాఫైన్ కార్మికాభివృద్ధి సంస్థ వీరి బాగోగులను పక్కనపెట్టింది. ముడిసరుకైన పత్తిని ఇవ్వడం నిలుపుదలచేసింది. ఫలితంగా వీరికి పనిలేక రోడ్డున పడ్డారు. ఈ గ్రామాల్లోని సుమారు 300 కుటుం బాల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది గుంటూరు, చీరాల ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. మరికొంత మంది తమ కుటుంబ సభ్యులను విడిచిపెట్టి విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
చేనేత కార్మికులు పనిలేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యార ని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు అందజేయడం లేదని, అర్హులకు కొత్తగా పింఛన్లు కూడా మంజూరు చేయడంలేదంటూ వాపోతున్నారు.
ముడిసరుకు లభించడంలేదు...
గతంలో జిల్లాలో పత్తి విరివిగా లభించేంది. చౌకగా కొనుగోలుచేసి సురవరంలోని చేనేత కార్మికులుకు అందించేవాళ్లం. వారు వాటిని ఒడికి నూలు తయారుచేసి మాకు ఇచ్చేవారు. గతేడాది నుంచి పంటలు పండక పత్తి దొరకడం లేదు. అందుకే ముడిసరుకు అందించలేకపోతున్నాం.
- కె.సుధాకర్, పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ సంస్థ ప్రతినిధి
ఇబ్బందులు పడుతున్నాం...
ముడిసరుకు ఇవ్వకపోవడంతో మాకు పనులులేవు. ఉపాధిపనులు కూడా వేసవిలో తూతూ మంత్రంగా ఉంటున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోతున్నాయి. బతకడం కష్టంగా మారింది.
- దువ్వాకుల సుశీల, చేనేతకార్మికరాలు, సురవరం
వలసలే గతి..
స్థానికంగా పనిలేక గ్రామంలో పురుషులంతా పట్టణాలకు వలసబాటపడుతున్నారు.అక్కడ కష్టంగా ఉండడంతో మహిళలను తీసుకెళ్లడంలేదు. మేం ఇంటివద్దే ఉంటున్నాం.
-ఎ.వరలక్ష్మి, చేనేత కార్మికరాలు, సురవరం
చితికిపోతున్న చేనేత బతుకులు
Published Fri, Aug 21 2015 1:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement