కలెక్టరేట్ ఆవరణలో గాంధీజీ విగ్రహావిష్కరణ | gandhi statu in collectorate precinct | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ఆవరణలో గాంధీజీ విగ్రహావిష్కరణ

May 31 2014 3:43 AM | Updated on Mar 21 2019 9:05 PM

కలెక్టరేట్ ఆవరణలో గాంధీజీ విగ్రహావిష్కరణ - Sakshi

కలెక్టరేట్ ఆవరణలో గాంధీజీ విగ్రహావిష్కరణ

కలెక్టరేట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు

 సాక్షి, కాకినాడ: కలెక్టరేట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు.  అదే రీతిలో కలెక్టరేట్ మెయిన్‌గేటు సమీపంలో గతంలో కలెక్టరేట్ శత వార్షికోత్సవాల గుర్తుగా ఆవిష్కరించి పక్కకు తొలగించిన పైలాన్‌ను పునఃప్రతిష్ఠ చేయించి దానిని సైతం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకున్న ప్రాశస్త్యానికి సజీవగుర్తు కలెక్టరేట్ అన్నారు. అలాంటి చరిత్రాత్మక స్థలంలో మహాత్ముడి విగ్రహం నెలకొల్పడం మన బాధ్యతను గుర్తెరగడమేనన్నారు.

ఆ నీటితో ఇబ్బందుల్లేవు
కాకినాడ నగరంలో ఆకుపచ్చ రంగులో వస్తున్న మంచినీటి వల్ల ఎటువంటి అనారోగ్యమూ సంభవించదని కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. ఆవిష్కరణల అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆ నీటి నాణ్యతలో లోపం లేదన్నారు. మరి రెండు రోజుల్లో సాధారణ మంచి నీళ్లు వస్తాయన్నారు. జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఏజేసీ డి.మార్కండేయులు, జిల్లా రెవెన్యూ అధికారి బి.యాదగిరి, జేఏసీ నాయకులు పితాని త్రినాథరావు, బూరిగ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement