
సాక్షి, నిడమర్రు : నిడమర్రు గ్రామంలో తండ్రి కర్మకాండలు కూతుళ్లు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన యుజ్రోతి సూర్యారావు (73) మంగళవారం మృతి చెందారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. కుమారులు లేకపోవడంతో కూతుళ్లే కొడుకులుగా మారి తండ్రి సూర్యారావు మృతదేహాన్ని కర్మభూమికి తరలించగా పెద్ద కుమార్తె రమణమ్మ తలకొరివిపెట్టింది. మిగిలిన నలుగురు కుమార్తెలు ధనలక్ష్మి, అనంతలక్ష్మి, కృష్ణకుమారి, వరలక్ష్మి పాడెమోసుకుంటూ కర్మభూమికి తీసుకువెళ్లారు. సూర్యారావు బతికుండగానే తన మరణానంతరం కర్మకాండలు కూతుళ్లు చేయాలనే కోరిక మేరకు ఇలా చేశారు.