రైతుల ధర్నాలో నాయకుడికి గుండెపోటు | Farmers stage dharna against Land Acquisition | Sakshi
Sakshi News home page

రైతుల ధర్నాలో నాయకుడికి గుండెపోటు

Aug 23 2015 11:49 AM | Updated on Jun 4 2019 5:04 PM

ప్రకాశం బ్యారేజీ వద్ద దీక్ష చేస్తున్న రైతు సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.

తాడేపల్లి (గుంటూరు జిల్లా) : ప్రకాశం బ్యారేజీ వద్ద దీక్ష చేస్తున్న రైతు సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో ఒత్తిడికి లోనైన రైతు సంఘం నాయకుడు గంగాధర్‌రావు గుండెపోటుకు గురయ్యారు. రాజధాని ప్రాంతంలో భూములను కోల్పోతున్న రైతులు అఖిలపక్ష సీపీఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లి మండలం సీతాపురంలో ప్రకాశం బ్యారేజీ వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

కాగా దీక్షా స్థలానికి చేరిన పోలీసులు రైతులను బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లారీల్లో ఎక్కించారు. ఈ క్రమంలో బ్యారేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులను మంగళగిరి తరలిస్తుండగా గంగాధర్‌రావుకు గుండెపోటు రావడంతో గుంటూరు తరలించారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement