కరువు కోరల్లో ‘అనంత’ రైతులు | Farmers face Problem due to drought in anantapur district, says mla chevireddy | Sakshi
Sakshi News home page

కరువు కోరల్లో ‘అనంత’ రైతులు

Mar 21 2017 1:37 PM | Updated on Oct 1 2018 2:09 PM

రాష్ట్రంలో కరువుతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి: రాష్ట్రంలో కరువుతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని చెప్పారు. మిగిలిన 12 జిల్లాల్లోనూ అనేక మండలాల్లో పంటలు వేయలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు శూన్యమని చెవిరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కరువు రక్కసి బారిన పడిన రైతులను ఆదుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement