అన్నదాత బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అన్నదాత బలవన్మరణం

Nov 5 2015 5:58 PM | Updated on Nov 6 2018 7:56 PM

పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చే దారి కానరాక ఓ రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు.

చింతకొమ్మదిన్నె (వైఎస్సార్ జిల్లా) : పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చే దారి కానరాక ఓ రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం లింగారెడ్డిపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి(37)కి ఐదెకరాల పొలం ఉంది. పొలంలో ఈ ఏడాది పసుపు, వేరుశెనగ సాగు చేశాడు. వర్షాభావంతో నీటి ఎద్దడి ఏర్పడింది.

దీంతో వేసిన రెండు బోర్లు కూడా వృథా అయ్యాయి. పంటల పరిస్థితి బాగోలేకపోవటంతోపాటు రూ.12 లక్షల అప్పులు తీరేదెలాగని మధన పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. పొలానికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement