చిత్తూరు జిల్లాలోని పలు తండాల్లోని పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.
చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని పలు తండాల్లోని పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. వి.కోట మండలం నాయకనేరి, రామాపురం తండాల్లోని పంట పొలాలపై ఏనుగులు గురువారం తెల్లవారుజామున దాడి చేశాయి. ఈ దాడిలో చెరుకు, అరటి, వరి పంటలు ధ్వంసమైనాయి. దాంతో భారీగా నష్టం వచ్చింది. ఏనుగుల దాడితో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.