అనంతపురం...ఓటరు లిస్టులో పేరు ఉందా..
సాక్షి, అనంతపురం : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
- 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
- www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఏడాది జనవరి 11న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను పోలింగ్ కేంద్రం పరిధిలోని బీఎల్ఓలు, తహసీల్దారు, ఆర్డీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. అందులో ఓటు ఉందా లేదా అని వివరాలను పరిశీలించుకోవచ్చు.
- ఓటు లేనట్లయితే అక్కడే ఫారం–6 పూరించి ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెబుతారు. ఓటు లేనట్లయితే అక్కడే ఫారం–6 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు.
- నామినేషన్ గడువు ముగిసే చివరి రోజు వరకూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అప్పటి వరకు నమోదైన వాటిలో అర్హులకు ఓటు హక్కు కల్పిస్తారు. ఓటరుగా నమోదైన వారి పేర్లను తుది ఓటర్ల జాబితాకు అనుబంధ జాబితాలో చేరుస్తారు.
-ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం