తూర్పు గోదావరి... మీ ఓటు చెక్‌ చేసుకోండిలా..

Election Commission Started Voter Awareness Campaign In East Godhavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

  • 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
  • www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీపేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
  • కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూం ల్యాండ్‌లైన్‌ నెం : 0884–2371950, 0884–2371951
  • కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి : డీటీ సరస్వతి, టోల్‌ ఫ్రీ నెం. 1800 425 3077
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు.
  • మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.
  • ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఓటు నమోదుకు అవకాశం ఉంది.అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. 

-ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top