నంద్యాల ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు
మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల
భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు
కర్నూలు(అగ్రికల్చర్): మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణకు భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు సోమవారం కలెక్టర్ సత్యనారాయణను ఆయన చాంబర్లో కలిశారు. ఓటర్లు ప్రలోభాలకు, ఆందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ స్పందిస్తూ.. నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు.
ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురికాకుండా.. స్వేచ్ఛగా ఓటు వేయాలని నంద్యాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఓటర్లలో చైతన్యం పెంచేందుకు గానూ ఎన్నికల నిఘా వేదిక రూపొందించిన వాల్పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.