సైనిక పాఠశాల సమావేశానికి హాజరైన వైస్ అడ్మిరల్ | east navy force vice admiral sathish sony attends to korukonda sainik school | Sakshi
Sakshi News home page

సైనిక పాఠశాల సమావేశానికి హాజరైన వైస్ అడ్మిరల్

Feb 11 2015 10:58 PM | Updated on Sep 2 2017 9:09 PM

విజయనగరం పట్టణంలోని కోరుకొండ సైనిక పాఠశాల 122వ పాలక మండలి సమావేశానికి తూర్పు నావికా దళ వైస్ అడ్మిరల్ సతీశ్ సోని బుధవారం హాజరయ్యారు.

విజయనగరం రూరల్: విజయనగరం పట్టణంలోని కోరుకొండ సైనిక పాఠశాల 122వ పాలక మండలి సమావేశానికి తూర్పు నావికా దళ వైస్ అడ్మిరల్ సతీశ్ సోని బుధవారం హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సైనిక పాఠశాల ఛైర్మన్ హోదాలో ఈ సమావేశానికి సతీశ్ హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడాలన్నారు. రక్షణ రంగంలో విద్యార్థులు చేరేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఎన్‌డీఏ లక్ష్యంగా చేసుకుని అందుకు తగ్గ కృషి చేయాలని వైస్ అడ్మిరల్ సతీశ్ సోని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement