అమ్మను నాయనే చంపేశాడు | Dad only killed my mother | Sakshi
Sakshi News home page

అమ్మను నాయనే చంపేశాడు

May 18 2015 3:12 AM | Updated on Apr 3 2019 8:07 PM

అమ్మను నాయనే చంపేశాడని ఏడేళ్ల కుమారుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఏడేళ్ల కుమారుడు వాంగ్మూలం
 
చిల్లకూరు : అమ్మను నాయనే చంపేశాడని ఏడేళ్ల కుమారుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మండలంలోని బల్లవోలులో శనివారం అనుమానాస్పద స్థితిలో రత్తమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి ముత్యాలయ్య అమ్మను కిరోసిన్ పోసి కాల్చినట్లు ఆ బాలుడు ఆదివారం పోలీసులకు వివరించాడు. రత్తమ్మ మృతదేహాన్ని డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. సంఘటన వివరాలను తెలుసుకునేందుకు గ్రామంలో విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రత్యక్షంగా చూసిన మృతురాలి కుమారుడు ముక్తానంద జరిగిన సంఘటన వివరాలను వివరించాడు. ఈ మేరకు సీఐ శ్రీనివాసులరెడ్డి కేసు నమోదు చేశారు. రత్నమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలి భర్త ముత్యాలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement