రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి | couple dies in road accident in guntur district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Feb 14 2017 5:49 PM | Updated on Jul 10 2019 7:55 PM

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

మేడికొండూరు మండలం పేరేచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు.

మేడికొండూరు(గుంటూరు జిల్లా):
మేడికొండూరు మండలం పేరేచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు కింద పడి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు గుంటూరు రూరల్‌ మండలం నల్లపాడు  గ్రామానికి చెందిన గేరా బాలస్వామి(49), తమసమ్మ(43)గా గుర్తించారు.

సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును గుంటూరు నుంచి సత్తెనపల్లి వైపు లారీ క్రాస్‌ చేయబోయింది.  అదే సమయంలో స్కూటీపై వస్తున్న దంపతులు రెండు వాహనాల మధ్య చిక్కుకుని లారీకి తగిలి ఆర్టీసీ బస్సు కింద పడిపోయారు. రెండు చక్రాలు మీద నుంచి వెళ్లడం తో సంఘటనాస్థలంలోనే మరణించారు. పాటిపల్లి గ్రామంలో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement