వ్యవసాయం చేసే కుటుంబాల్లో ఎదిగిన కొడుకు తల్లిదండ్రులకు ఎంత అండో.. కాడెద్దులు కూడా అంతే... పశువుల వయస్సు పెరిగి వ్యవసాయానికి పనికిరాక పోయినా అమ్మడానికి రైతులు ఒప్పుకోరు... రైతులకు, పశువులకు అంత అనుబంధం ఉంటుంది... అలాంటి వారికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చింది. ఇలాంటి సమయంలో సాగు సంగతి దేవుడెరుగు. కనీసం పశువుల కడుపు నిండే పరిస్థితి కూడా లేదు... దీంతో మూగ జీవాల బాధ చూడలేక మరో గత్యంతరం లేక కళేబరాలకు అమ్ముకుంటున్నారు.
చిన్నమండెం: జిల్లాలోని పలు మండలాల నుంచి నెల రోజులుగా వందల సంఖ్యలో పశువులను కళేబరాలకు తరలిస్తున్నారు. ఏ సంతలో చూసినా ఇదే దృశ్యం కనిపిస్తోంది. పశువులకు మేత కూడా లేకపోవడంతో సంత జరిగే ప్రాంతాలలో దిగాలుగా పశువులను అమ్మేదుకు వచ్చిన అన్నదాతలే కనిపిస్తున్నారు. ప్రతి నిత్యం రాయచోటి-బెంగ ళూరు ప్రధాన రహదారిలో, కడప-చిత్తూరు జాతీయ రహదారిలో పశువులతో వెళ్తున్న లారీలు కనిపిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చినుకు కూడా రాలకపోవడంతో చెరువుల్లో నీరు లేక పంటలు సాగు చేసే అవకాశం లేకుండా పోయింది.
కనీసం పశువులకు కావాల్సిన మేత కూడా దొరకక పోవడంతో వాటిని బతికించుకునే అవకాశాలు లేవని, అందుకే అమ్ముకుంటున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కనీసం పాలు ఇచ్చే పాడి పశువులకైనా ప్రభుత్వం పశుగ్రాసం పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. గతంలో వరిగడ్డి కట్ట ఒక్కొక్కటి రూ.5-6లకు దొరుకుతుంటే, ప్రస్తుతం అది రెండింతలు అయ్యింది. దీంతో పాటు ట్రాక్టర్ వేరుశనగ కట్టె కొనాలంటే రూ.15 వేలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మేత భారం మోయలేక అమ్ముకుంటున్నారు. దీంతో పాడి పశువులు, సేద్యం చేసే పశువులు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. పశువుల మాంసానికి పలు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉండటం అందుకు ఒక కారణంగా తెలుస్తోంది. అయితే పశువులను అక్రమంగా తరలించటం చట్ట వ్యతిరేకమని చట్టాలు చెబుతున్నాయి.
కాడెద్దులను మేపాలంటే భారంగా ఉంది: బుడ్డా వెంకట్రమణ, చాకిబండ కస్పా, రైతు కరువు వచ్చేసింది. పశువుల మేత దొరకడం లేదు. పంటలు సాగు అవ్వలేదు. కాడెద్దులు మేపాలంటే భారంగా ఉంది. గతంలో అడవులకు పశువులను తీసుకెళ్లి మేపే వాళ్లం. పంట పొలాల చుట్టూ పశువులకు కావాల్సిన మేత ఉండేది. కానీ ఇప్పుడు లేదు. మేత కొనాల్సిన పరిస్థితి వచ్చింది. నెలకు పశువుల మేతకు సుమారు 4-5వేల రూపాయలు అవుతోంది. దీంతో చుట్టు పక్కల చాలా ఊర్లలో పశువులను అమ్ముకున్నారు. నెల రోజుల వరకు వర్షాలు పడకుంటే మేము కూడా పశువులను అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అయినా ఆదుకుని, పశుగ్రాసం పంపిణీ చేయిస్తే బాగుంటుంది.
కరువు కాటు.. కాడెద్దులూ భారమే!
Published Tue, Aug 4 2015 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement