ఓటు ద్వారానే.. భవిష్యత్ నిర్ణయం | By the vote .. Future decision | Sakshi
Sakshi News home page

ఓటు ద్వారానే.. భవిష్యత్ నిర్ణయం

Jan 26 2014 4:29 AM | Updated on Aug 29 2018 4:16 PM

ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని కలెక్టర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన జడ్జి అనంతపద్మనాభస్వామితో కలిసి పాల్గొన్నారు.

నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, జిల్లా ప్రధాన జడ్జి అనంత పద్మనాభస్వామిలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్ నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు.
 
 నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని కలెక్టర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన జడ్జి అనంతపద్మనాభస్వామితో కలిసి పాల్గొన్నారు. సమావేశానికి ముం దు ఎన్జీ కళాశాల నుంచి క్లాక్‌టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాం గ నిర్మాతలు ఆశించిన ప్రయోజనాన్ని నెరవేర్చేందుకు యువత కృషి చేయాలని కోరారు. జేసీ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కోసం మంచి ఆలోచన, ఉత్తమ వ్యక్తిత్వం, సేవా భావం గల వారిని ఎన్నుకోవాలని సూచించారు. డీఎస్పీ రాంమోహన్‌రావు మాట్లాడుతూ అధికార బదిలీకి కీలక ఆయుధం ఓటు హక్కు అని అన్నారు. విద్యావేత్త చినవెంకట్‌రెడ్డి మాట్లాడు తూ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన స్వప్నకు రెండేళ్ల పాటు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఆర్‌ఓ అంజయ్య, ఆర్‌డీఓ జహీర్, తహసీల్దార్ కృష్ణారెడ్డి, స్పెషల్ కలెక్టర్ ప్రసాద్‌రావు, గోలి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్, సిద్ధార్థపూలే, మహేందర్‌రెడ్డి, రంగారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులతో జేసీ ప్రతిజ్ఞ చేయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement