దారుణంగా హత్య చేసి పొలాల్లో పడేసి.. | brutal murder in ysr district | Sakshi
Sakshi News home page

దారుణంగా హత్య చేసి పొలాల్లో పడేసి..

May 12 2015 4:00 PM | Updated on Sep 3 2017 1:54 AM

వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం గోపవరం గ్రామంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు.

చెన్నూరు : వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం గోపవరం గ్రామంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. సుమారు 32 ఏళ్ల వయసున్న వ్యక్తిని గొంతు నులిమి, తలపై రాడ్‌తో మోది హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని చూసిన రైతులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement