భారీ వర్షాల కారణంగా ఆయూష్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఈ నెల 30, 31వ తేదీలలో నిర్వహించనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా ఆయూష్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఈ నెల 30, 31వ తేదీలలో నిర్వహించనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయుర్వేద, హోమియో, నేచురోపతి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ అసలు అయితే ఈ నెల 26, 27న తేదీలలో జరగవలసి ఉంది.
ఈశాన్య రుతుపవనాలు, పశ్చిమ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అంతేకాకుండా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో రవాణ వ్యవస్త పూర్తిగా చిన్నభిన్నమైంది. ఈ నేపథ్యంలో ఆయుష్ కౌన్సిలింగ్ వాయిదా వేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ శుక్రవారం నిర్ణయించింది.