టీడీపీ నేతపై కేసు నమోదు | atrocity case file on municipal vice chairman in guntur district | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతపై కేసు నమోదు

Jan 14 2016 9:49 AM | Updated on Oct 16 2018 6:35 PM

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్కూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సత్తెనపల్లి: మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్కూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తన వైఎన్ షాపు పక్కన నాగేశ్వరరావు ఇటీవల దేవుడి బొమ్మ ఏర్పాటు చేశారు. దానిని ఓ వర్గం వారు తొలగించారు. వారికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొడుతుండటంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నడుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement