ఈ నెల 24 నుంచే డీఎస్సీ పరీక్షలు | AP DSC Exam Will Start On 24th December | Sakshi
Sakshi News home page

Dec 22 2018 9:00 PM | Updated on Mar 28 2019 5:27 PM

AP DSC Exam Will Start On 24th December - Sakshi

సాక్షి, విజయవాడ : డిసెంబర్‌ 24 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తొలి విడ‌త‌లో స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. రెండో విడత జనవరి 18 నుంచి ఎస్‌జీటీ పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. తొలి విడత పరీక్షలకు 2,43,185 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. డీఎస్సీ కోసం 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement