=ఓటర్ల నమోదుకు గడువు
=నేడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్వీకరణ
=బీఎల్ఓల వద్ద దరఖాస్తులు
విశాఖపట్నం, న్యూస్లైన్ : ప్రజల చేతిలో పాశుపతాస్త్రం ఓటు హక్కు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండేవారంతా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకునేవారికి వచ్చే ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు కలర్ ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు అందజేయనున్నారు.
కొత్త ఓటర్ల నమోదుతోపాటు, చిరునామాలో మార్పులు, నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు బదిలీ, ఓటరు గుర్తింపు కార్డులో తప్పుల సవరణకు నిర్ణీత దరఖాస్తు నింపి, అవసరమైన పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. జీవీఎంసీ పరిధిలోని 72 వార్డు కార్యాలయాల్లో ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంచారు. ఓటరు గుర్తింపు కార్డు ఉండి, జాబితాలో పేరు గల్లంతయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు గుర్తించిన డూప్లికేట్ కార్డులను తొలగిస్తామని అధికారులు తెలిపారు.
నేడు ప్రత్యేక డ్రైవ్
ఓటర్ల నమోదు, తప్పుల సవరణకు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 16న తుది జాబితా ప్రకటిస్తారు. ఈ జాబితా ఆధారంగానే 2014 సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఆదివారం (15న) అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల నమోదు జరుగుతుంది. ఇంటర్నెట్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నవారు ప్రింటవుట్పై సంతకాలు చేసి, అవసరమైన పత్రాలు, ఫొటో జతచేసి దరఖాస్తులు అందజేయాలి.
దేనికి ఏ దరఖాస్తు
కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఫారం-6, జాబితా నుంచి పేరు తొలగించాలనుకుంటే ఫారం-7, జాబితాలో తప్పుల సవరణకు ఫారం-8, అదే నియోజకవర్గం పరిధిలో నివాసం మారినపుడు ఫారం-8ఏ అందజేయాల్సి ఉంటుంది. వివరాలకు 1950 నంబర్కు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటలలోపు సంప్రదించవచ్చు.
నియోజకవర్గం మారితే..
అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాసం మారితే సంబంధిత సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓటర్ గుర్తింపు కార్డు అందజేసి, ఓటు రద్దు చేసుకోవాలి. తరువాత మారిన నియోజకవర్గంలో కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో ఫొటో, నివాస ధృవీకరణపత్రం, వయసు ధృవీకరణపత్రం జతచేయాలి. ఇంటింటి సర్వేలో భాగంగా అద్దె ఇంట్లో ఉన్న వారు ఇల్లు మారితే వారి పేర్లను ఓటర్ల జాబితాలోంచి బీఎల్ఓలు తొలగించా రు. వీరు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.
మరో మూడు రోజులే..
Published Sun, Dec 15 2013 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!
ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర ఫిదా
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement