ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Andhra Pradesh Assembly Sessions 2020 Starts From June 16 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 16వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. మార్చిలో ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టినందున ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడ్డాక బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశమై.. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? తదితర అంశాలను ఖరారు చేయనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top