బయట తిరిగితే స్ప్రే చేస్తారు.. జాగ్రత్త
అనంతపురం, గుడిబండ: కరోనా వైరస్ నియంత్రణకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నా.. ప్రజలు బయట తిరుగుతుండటంతో ఎస్ఐ మస్తాన్ బుధవారం వినూత్నంగా ఆలోచించారు. ఓ స్ప్రేయర్ను కొనుగోలు చేసి బయట తిరుగుతున్న ప్రజలపై శానిటైజర్ను స్ప్రే చేశారు. గుడిబండ పోలీసుల వినూత్న సేవను స్థానికులు అభినందించారు.