రన్‌వేపై ఊగిపోయిన విమానం

AirIndia flight lands on second attempt - Sakshi

విశాఖ ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఉధృతమైన గాలి

మళ్లీ ఎగిరిన విమానం.. గంటసేపు గాల్లో చక్కర్లు

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతున్న ఎయిర్‌ ఇండియా విమానం గాలి ఉధృతికి ఊగిపోయింది. దీంతో విమానంలో ఉన్న ప్రజాప్రతినిధులు సహా ప్రయాణికులు అంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి విశాఖకు బుధవారం సాయంత్రం 4.30కి రావాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం 5.30 గంటలకు వచ్చింది. విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో భారీస్థాయిలో గాలి వీచడంతో మహిళా పైలెట్‌ విమానాన్ని దించకుండా టెకాఫ్‌ తీసుకున్నారు. గంటకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టించి ఎట్టకేలకు సురక్షితంగా విశాఖ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. దీంతో విమానంలో ఉన్న రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్‌ గణబాబు, ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, మరో 60 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top