రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ వాయిదా | accuses in rishiteswari case bail postponed | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ వాయిదా

Aug 26 2015 10:27 PM | Updated on Sep 3 2017 8:10 AM

రిషితేశ్వరి కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.

గుంటూరు లీగల్: రిషితేశ్వరి కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతికేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ వాదనలు వినేందుకు న్యాయమూర్తి జి.గోపీచంద్ గురువారానికి వాయిదా వేశారు. ఏపీపీ రామచంద్రరావు వాదనలు వినిపించేందుకు సమయం కావాలని అడగడంతో న్యాయమూర్తి గోపీచంద్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement