ఏసీబీ వలలో సీఐ వెంకటరెడ్డి


హైదరాబాద్: అవినీతి జళగలు రోజూ ఏదో మూల పట్టుబడుతూనే ఉన్నారు. ఎంతో బాధ్యాతాయుతంగా ఉండాల్సిన ఆఫీసర్లే చిన్నా చితకా లంచాలకు కక్కుర్తిపడి సమాజంలో చీడ పురుగుల్లా మారుతున్నారు. తాజాగా ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నగరంలోని వనస్థలిపురం పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీఐ వెంకటరెడ్డి ఓ వ్యక్తిని నుంచి రూ.25 వేలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సీఐ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top