పరీక్ష హాలులో ప్రసవం | a women delivered in exam hall | Sakshi
Sakshi News home page

పరీక్ష హాలులో ప్రసవం

May 11 2015 11:10 PM | Updated on Mar 28 2019 5:27 PM

పరీక్ష కేంద్రంలోనే ఓ డీఎస్సీ అభ్యర్థిని ప్రసవించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

విజయనగరం: పరీక్ష కేంద్రంలోనే ఓ డీఎస్సీ అభ్యర్థిని ప్రసవించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిండు గర్భిణి గొటివాడకు చెందిన సుగుణ పరీక్షకు హాజరైంది. ఆమెది కురుపాం మండలం గొటివాడ గ్రామం. మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్ష రాసేందుకు హాజరైంది.

అయితే, పరీక్ష ప్రారంభమైన గంటకే నొప్పులు రావడంతో అధికారులు 108కు సమాచారం ఇచ్చారు. 108 రాకపోవడంతో పరీక్ష హాలులోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రైవేట్ అంబులెన్స్లో తల్లీ కొడుకులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించే లోపే శిశువు ఆస్పత్రిలో కన్నుమూసింది.

Advertisement
 
Advertisement
Advertisement