షుగర్‌ ఫ్యాక్టరీల పరిస్థితిపై అధ్యయన కమిటీ: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

షుగర్‌ ఫ్యాక్టరీల పరిస్థితిపై అధ్యయన కమిటీ: చంద్రబాబు

Published Tue, Sep 9 2014 3:19 PM

షుగర్‌ ఫ్యాక్టరీల పరిస్థితిపై అధ్యయన కమిటీ: చంద్రబాబు

హైదరాబాద్: షుగర్‌ ఫ్యాక్టరీల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సహకార షుగర్‌ ఫ్యాక్టరీల పరిస్థితిపై అధ్యయనానికి కమిటీ నియమించాలని ఈ సమీక్షలో చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 
 
ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులు, సాంకేతిక నిపుణులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ఓ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు. రానున్న 45 రోజుల్లోగా షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితిపై కమిటీ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Advertisement
Advertisement