=బరియకల్లో టైఫాయిడ్ జోరు
=మూడుకు చేరిన మృతుల సంఖ్య
=మరో 8 మంది పరిస్థితి విషమం గ్రామాన్ని సందర్శించిన
= వైద్య అధికారి నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు
డుంబ్రిగుడ, న్యూస్లైన్ : విషజ్వరం విజృంభించడంతో ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మండలంలోని కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొర్రాయి పంచాయతీ పరిధిలోని బరియకాల్ ఆదిమజాతి గిరిజన తెగ (పీటీజీ)కు చెందిన గ్రామంలో భయంకరమైన విషజ్వరం ఫలితంగా ఐదు రోజుల్లో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. బుధవారం కిల్లో పూజారి (50) అనే గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు.
అనారోగ్యానికి గురై మంచం పట్టిన మరో ఎనిమిది మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చికిత్సకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బరియకాల్ గ్రామంలో విషజ్వరం ఉధృతంగా వ్యాపిస్తున్నా వైద్య సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దాంతో రోజు తప్పించి రోజు ఒక్కో గిరిజనుడు వంతున మరణిస్తున్నారు. మరెందరో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.
ప్రబలిన టైఫాయిడ్
బరియకాల్లో వ్యాధుల బారిన పడ్డ గిరిజనులకు రక్తపరీక్షలు జరపగా, ఇది టైఫాయిడ్గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు వైద్యాధికారి స్వప్నకుమారి చెప్పారు. ‘పీడిస్తున్న జ్వరాలు’ అనే శీర్షికతో ఈనెల 22న ‘సాక్షి’లో వెలువడ్డ వార్తకు స్పందించిన ఆమె బుధవారం డుంబ్రిగుడ మండల కేంద్రానికి వచ్చారు. గ్రామంలో ముగ్గురు మృతి చెంది అనేక మంది మంచం పట్టిన నేపథ్యంలో ఆమె బరియకల్లో పర్యటించారు. టైఫాయిడ్ చె లరేగి ముగ్గురు మృతి చెందినా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె మండిపడ్డారు.
వైద్యసిబ్బందిపై కఠిన చర్యలు
టైఫాయిడ్ తీవ్ర స్థాయిలో వ్యాపించడానికి నీటి కాలుష్యం కారణమవుతుందని, అపరిశుభ్రత వల్ల కూడా విషజ్వరం వ్యాపిస్తుందని స్వప్నకుమారి చెప్పారు. గ్రామంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సకాలంలో చికిత్స అందించడంలో విఫలమయ్యారని చెప్పారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, దీనిని కొనసాగిస్తామని తెలిపారు. బాధితులను వైద్య చిత్సల కోసం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం ఆమె డుంబ్రిగుడ పీహెచ్సీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది విధి నిర్వహణ తీరును గమనించిన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట కిల్లోగుడ వైద్య అధికారి రవికుమార్,హెల్త్ సూపర్వైజర్ బి.లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.
ఊటగెడ్డ జలాలు కారణం?
బరియకాల్ చేరువలోని ఊట గెడ్డ నీటినే గిరిజనులు తాగుతున్నారు. విషజ్వరం వ్యాపించడానికి ఈ కలుషిత జలాలు కారణమై ఉండవచ్చన్న అభిప్రాయం వినవస్తోంది.
విరుచుకుపడ్డ విష జ్వరం
Published Thu, Oct 24 2013 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement