ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. 15 మందికి గాయాలు


పెద్దకదుబూర్(కర్నూలు): ఎదరురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో 15 మందికి గాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పెద్దకదుబూర్ మండలం హిస్సార మురవరి- కంబాలదిన్నె రహదారిపై ఆదివారం జరిగింది. 


కోస్గీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోస్గీ నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న సమయంలో మురవని శివారులో ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్ష తగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top