breaking news
-
పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన టీడీపీ గ్యాంగ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ నేతల నాయకులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సుబ్బారాయుడుని హత్య చేశారు. కాగా, పోలీసులు కళ్ల ఎదుటే ఈ దారుణం జరగడం గమనార్హం.వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ నేతలు సుబ్బారాయుడు ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో సుబ్బారాయుడుపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. దీంతో, సుబ్బారాయుడు మృతిచెందాడు.మరోవైపు.. సుబ్బారాయుడిపై దాడిని ఆయన భార్య బాలసుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడులు చేశారు. దీంతో, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వారి ఇంట్లోని వస్తువులను, సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే, ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పనివచేశారనే అక్కస్సుతోనే టీడీపీ నేతలు.. సుబ్బారాయుడిని హత్య చేశారు. నంద్యాల: YSRCP నేత హత్య సుబ్బరాయుడి కేసులో బయటపడ్డ పోలీసుల వైఫల్యం. రాత్రి 12:59 నిమిషాలకు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన YSRCP నేత నారపురెడ్డి ఫోన్1:02 నిమిషాలకు ఎస్పీకి మరోసారి ఫోన్ చేసిన నారపురెడ్డి. పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వేడుకోలు.గ్రామంలో తమను హత్య చేయడానికి @JaiTDP… pic.twitter.com/hrGGg9DMYn— YSR Congress Party (@YSRCParty) August 4, 2024 బాధితురాలు బాల సుబ్బమ్మ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి అనుచరులు నా భర్తను హత్య చేశారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తారా? అంటూ హత్యకు పాల్పడ్డారు. అడ్డుకున్న నాపై కత్తులతో దాడి చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.అయితే, టీడీపీ నేతలు దాడి చేస్తారని ముందుగానే ఎస్పీకి సమాచారం ఇచ్చారు వైఎస్సార్సీపీ నేత నారపురెడ్డి. కేవలం ఇద్దరు కానిస్టేబుల్స్ను మాత్రమే అధికారులు అక్కడికి పంపించారు. కాగా, టీడీపీ నేతలు మొదట నారపురెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ, నారపురెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలోనే సుబ్బారాయుడు నివాసం ఉండటంతో వారిపై దాడికి తెగబడ్డారు. ఇక, దాడిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బలగాలను పంపకపోవడం వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిపై ఎస్పీకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య జరిగిన ఘటనా స్థలాన్ని ఆదివారం ఉదయం ఎస్పీ పరిశీలించారు. ఇది చదవండి: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది: వైఎస్ జగన్ -
పచ్చ గూండాల అరాచకం.. అర్ధరాత్రి కర్రలతో దాడి
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్డీఆర్ జిల్లాలో టీడీపీ గుండాలు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడితో సహా మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని జగయ్యపేట ఆసుపత్రికి తరలించారు.కాగా, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని నవాబుపేటలో టీడీపీ గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వైఎస్సార్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు (@ బుల్లబ్బాయ్) సహా మరో ఐదుగురు దాడికి పాల్పడ్డారు. టిఫిన్ చేసేందుకు హోటల్ వద్దకు వెళ్లిన గింజుపల్లి శ్రీనివాసరావుపై ఒక్కసారిగా దాడి చేశారు. వారి వెంట తెచ్చుకున్న కర్రలతో శ్రీనివాసరావును తీవ్రంగా గాయపరిచారు.ఈ ఘటన సందర్భంగా హోటల్ వద్ద ఉన్న పలువురు టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ఆగకుండా కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు. అంతటితో ఆగకుండా శ్రీనివాసరావు కారును కూడా ధ్వంసం చేశారు. అనంతరం, స్థానికులు గాయపడిన వారిని జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావును మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించిన తెలుస్తోంది. అయితే, 2009లో శ్రీనివాసరావు తండ్రి వీరయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు ఉన్నారు. -
టీడీపీ నేతల వేధింపులు తాళలేక ‘అంగన్వాడీ’ ఆత్మహత్యాయత్నం
రాయచోటి: తెలుగుదేశం పార్టీ నాయకులు, ఓ విలేకరి (సాక్షి, ఈనాడు కాదు) వేధింపులు భరించలేక అంగన్వాడీ కార్యకర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, భర్త వీరభద్ర కథనం మేరకు.. దుద్యాల పంచాయతీ పెద్దజంగంపల్లికు చెందిన అంగన్వాడీ కార్యకర్త జె. నాగరత్నకు గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు మంజూరైంది. ఆమె భర్త వీరభద్ర వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడనే నెపంతో.. తమ ఇంటిని కూల్చివేస్తామని భార్యాభర్తలను టీడీపీ నేతలు, సదరు విలేకరి వేధింపులకు గురి చేస్తూండేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ కుటుంబంపై జరుగుతున్న ఘటనలకు బతుకు మీద విరక్తి చెందడంతో పురుగుల మందు తాగిందని భర్త వీరభద్ర కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంగన్వాడీల నిరసన.. అంగన్వాడీ వర్కర్ నాగరత్నమ్మకు మద్దతుగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట అంగన్వాడీలు నిరసన ప్రదర్శన చేశారు. సీఐటీయూ నేతలు రామాంజనేయులు, శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి, సీపీఎం , సీపీఐ నాయకులు , ఐసీడీఎస్ పీడీ శశికళ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న టీడీపీ నాయకులు, ఓ పత్రిక విలేకరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తాళ్లతో బంధించి దళిత యువకుడిపై దాడికాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఘటన ప్రేమ పేరుతో అల్లరి చేశాడని యువకుడిపై యువతి ఫిర్యాదుసామర్లకోట: ప్రేమిస్తున్నానని చెప్పిన ఓ దళిత యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీబీ దేవం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. సామర్లకోట సీఐ ఆర్.అంకబాబు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన దళిత యువకుడు చాపల అజయ్ కుమార్.. అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమె ఇంట్లోకి వెళ్లి అల్లరి చేశాడు. దీనిపై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని ప్రేమిస్తున్నానని చెప్పిన నేరానికి ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడి చేతులు కట్టి, చిత్రహింసలకు గురి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడని దళిత సంఘాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కాగా, దళిత యువకుడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ డిమాండ్ చేశారు. అజయ్, ఆ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఈ నెల 1న ఇద్దరూ కలసి బయటకు వెళ్లారని, రాత్రి సమయంలో ఆ యువతిని అజయ్ కుమార్ ఇంటి వద్ద క్షేమంగా దింపాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలు పెడుతున్నారనే విషయం తెలిసి, అజయ్ శనివారం ఆమె ఇంటికి వెళ్లాడని దీంతో యువతి కుటుంబీకులు అతడిని తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. బందీగా ఉన్న అజయ్ కుమార్ను పోలీసులు విడిపించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. -
ఎన్టీఆర్ జిల్లా: వేధింపులపై ఎదురుతిరిగారని దాడి చేశారు
ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండలం కంభంపాడులో 10వ తరగతి బాలికలను వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వేధించారు. ఎదురుతిరిగినందుకు బాలికపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజులుగా ట్యూషన్కు వెళ్లి వస్తున్న సమయంలో కొంతమంది యువకులు వెకిలిచేష్టలతో బాలికను వేధిస్తున్నారు. వారు ఎదురుతిరిగినందుకు బాలికలపై దాడి చేశారు. ఇంట్లో వాళ్లకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. యువకుల వేధింపులు తాళలేక బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. యువకులను బాలికల తల్లిదండ్రులు ప్రశ్నించినగా వారిపై కూడా దాడి తెగపడ్డారు. దీంతో ఆ అకతాయి యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రాళ్లు రువ్వి.. కట్టెలతో కొట్టి..
ఆలూరు రూరల్/ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్లులో దినసరి కూరగాయల మార్కెట్ వేలాల్లో శుక్రవారం సాయంత్రం టీడీపీ నాయకులు వంద మందికి పైగా పథకం ప్రకారం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వి, కట్టెలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆస్పరి సీఐ, ఎస్ఐ, వైఎస్సార్సీపీకి చెందిన పది మంది గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. గ్రామ పంచాయతీ పరి«ధిలోని కూరగాయల మార్కెట్కు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి రోజు సాయంత్రం రైతులు కూరగాయలను తెచ్చి బహిరంగ వేలం నిర్వహిస్తారు. వేలం పాడి కూరగాయలు తీసుకుని విక్రయించుకునేందుకు వ్యాపారస్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కూరగాయల మార్కెట్ వేలాల నిర్వహణను వైఎస్సార్సీపీకి చెందిన గిత్త నల్లన్న దక్కించుకుని రోజూ రైతులు తెచ్చిన కూరగాయలకు కమీషన్ తీసుకుని వేలాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు వీరేష్ 19 సంచుల్లో (ఒక సంచి 25 కేజీలు) తెచ్చిన కూరగాయలను విక్రయించడానికి వేలానికి ఉంచాడు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు వెంకటేష్ సంచి రూ.390తో వేలం పాడాడు. అంతకు మించి ఎక్కువ ధర ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆగ్రహించిన వీరేష్, మరికొందరితో కలసి వెంకటేష్ పై దాడి చేశారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు వైఎస్సార్సీపీ హయాంలో మార్కెట్లో నిర్మించిన సీసీ రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు. రైతులెవరూ మార్కెట్కు రావొద్దని చాటింపు ఈ క్రమంలో బిల్లేకల్లు గ్రామంలోని కూరగాయల మార్కెట్లో వేలాలు నిర్వహించరాదని, రైతులు ఎవరూ కూరగాయలు తీసుకురావద్దని టీడీపీ వర్గీయులు శుక్రవారం ఉదయం గ్రామంలో దండోరా వేయించారు. అయినా శుక్రవారం సాయంత్రం యథా ప్రకారం మార్కెట్లో కూరగాయల వేలాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులు వీరాంజినేయులు, పెరుగోడు, మొద్దోడు, రాజశేఖర్, చిన్న వీరేష్ , వీరాంజినేయులు, విశ్వనాథ్, నాగరాజు, చెన్నకేశవులు, రామాంజినేయులు, గంగాధర్, గోపాల్తో పాటు మరో వంద మంది మూకుమ్మడిగా రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన రంగ నాయకులు ఎడమ కాలు విరగ్గా, లక్షన్న సొమ్మసిల్లి పడిపోయాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గొడవ విషయం తెలుసుకున్న పత్తికొండ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆస్పరి సీఐ హనుమంత రెడ్డి, ఎస్ఐ రవీంద్ర ఘటన స్థలానికి వెళ్లారు. ఇరువర్గాలను చెదర గొడుతుండగా సీఐ హనుమంతప్ప తలకు రాయి తగిలి రక్తగాయం అయ్యింది. ఎస్ఐకి కూడా స్వల్పంగా గాయపడ్డారు. సీఐకి ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి, ఆదోనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కీచక కరస్పాండెంట్పై పోక్సో కేసు
అనంతపురం : అనంతపురం నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ నాల్గో తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాజంలో ఇన్నాళ్లూ పెద్ద మనిషిగా చలామణి అయిన 73 ఏళ్ల ఇతను మనవరాలి వయసు ఉన్న అభం శుభం తెలియని చిన్నారిని లోబరచుకుని అకృత్యానికి ఒడిగట్టాడు. అమానుష ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బాధిత చిన్నారి తల్లిదండ్రులు ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన వారు. బతుకుదెరువు కోసం దుబాయిలో ఉంటున్నారు. దీంతో పిన్ని సంరక్షణలో చిన్నారి ఉంటోంది. రెండు నెలల క్రితం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నాల్గో తరగతిలో చేర్పించారు. కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ గత శని, ఆదివారం రెండు దఫాలు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నారి తన పిన్నికి ఫోన్లో తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణను పోలీసులకు అప్పగించారు. ‘నగ్నంగా మీద పడుకోవాలని సార్ (ఆంజనేయులు గౌడ్) తరచూ అంటుంటాడు. క్లాస్కు వెళ్లాలి.. సార్ కొడతారని చెప్పినా వినకుండా నన్ను అలా చేశారు. ఒకసారి డబ్బులు కూడా ఇచ్చాడు. అవి పెట్టెలో పెట్టి తాళం వేయడం మరచిపోయాను. దీంతో డబ్బులు ఎవరో తీసుకున్నార’ని అమాయకంగా వివరించింది. ఈ మాటలు విన్న పిన్ని, బాబాయ్ బోరున విలపిస్తూ శుక్రవారం ఉదయమే పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న కరస్పాండెంట్ను నిలదీశారు. ఇంతలోనే విద్యార్థి సంఘాల నాయకులకు విషయం తెలియడంతో వారు కూడా వచ్చి కరస్పాండెంట్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతన్ని టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతపురం అర్బన్ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఆంజనేయులు గౌడ్ నుంచి కీలక విషయాలను రాబట్టారు. లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైందని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో చిన్నారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.టీడీపీ నాయకుల అండకరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్కు మద్దతుగా టీడీపీకి చెందిన కొందరు నాయకులు సోషల్ మీడియాలో అనుకూల పోస్టింగ్లు పెట్టారు. అభం శుభం తెలియ ని విద్యార్థినిపై అఘాయిత్యం జరిగితే ఖండించాల్సింది పోయి.. కీచక కరస్పాండెంట్కు అనుకూలంగా పోస్టింగ్లు పెట్టడం గమనార్హం. వారి తీరును సామా న్య ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.నిందితుణ్ని కఠినంగా శిక్షించాలిచిన్నారి ఫోన్లో విషయం చెప్పడంతో పాఠశాల వద్దకు వచ్చాం. పాప ఏడుస్తూనే ఉంది. ఏమి జరిగింది చెప్పమ్మా అంటే.. జరిగినది మొత్తం వివరించింది. వెంటనే మా అన్న, మా చెల్లి వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. మా అన్నవాళ్లు అందరూ వచ్చారు. తెలుగు టీచర్ చెప్పింది అంట .. ఇక్కడ జరిగింది మీ వాళ్లకు చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరించారట. జరిగిన దాని గురించి చెప్పొద్దు. డబ్బులు ఇస్తామని చెప్పారు. డబ్బులు కూడా పాపకు ఇచ్చారు. అఘాయిత్యానికి పాల్పడిన పాఠశాల కరస్పాండెంట్ను కఠినంగా శిక్షించాలి. – చిన్నారి పిన్ని -
నంద్యాలలో విషాదం.. నిద్రలోనే కుటుంబం మృత్యువాత
సాక్షి, నంద్యాల: జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, వాళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెల్లారి చూసేసరికి దిబ్బల కింద ఆ కుటుంబం సజీవ సమాధి అయ్యి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాన్ని గురుశేఖర్ రెడ్డి కుటుంబంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోగా.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
జనసేన నేత వేధింపులతో మహిళ బలవన్మరణం
పల్నాడు, సాక్షి: ఆర్థిక సాయం చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ జనసేన నాయకురాలు వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ కె.నాగేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు ముందు చేజర్ల గ్రామానికి చెందిన ఉప్పు కృష్ణవేణి (28) కుమారుడు అనారోగ్యం బారినపడ్డాడు. జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి అతడిని పరామర్శించింది. ఈ విషయాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా అప్పారావు దృష్టికి తీసుకెళ్లగా.. సుమారు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కాగా.. ఎన్నికలలో కృష్ణవేణి కుటుంబం జనసేనకు ఓటు వేయలేదని భావించిన జనసేన నాయకురాలు తాడువాయి లక్ష్మి ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని రెండు నెలలుగా వేధిస్తోంది. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, పరిస్థితి కుదుటపడ్డాక చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఒత్తిడి ఆపలేదని మృతురాలి భర్త కోటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 25న తాను ఇంట్లో లేని సమయంలో తాడువాయి లక్ష్మి ఇద్దరు మహిళలను వెంటబెట్టుకుని తమ ఇంటికి వచ్చిందని, తన భార్యను తీవ్ర వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆమె భర్త వివరించారు. వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై తన భార్య ఆత్మహత్య చేసుకుందని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పేరుతో ఆర్థిక సాయం చేసి.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసి తన భార్య ఆత్మహత్యకు కారణమైన తాడువాయి లక్షి్మని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు.మునిసిపల్ చైర్పర్సన్పై హత్యాయత్నంఇంటికి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్త దాష్టీ కం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చెత్త పత్రిక రోత రాతలపై పరువునష్టం దావాపెద్దాపురం: పెద్దాపురం మునిసిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారుపై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో టీడీపీ కార్యకర్త సానాది సోములు (లింగం) ఇంటి తలుపులను బద్దలుగొట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయతి్నంచాడు. లోపల నుంచి ఆమె వెంటనే పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిని అదుçపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, మునిసిపల్ వైస్చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కౌన్సిలర్లు ఆరెళ్లి వీర్రాఘవులు, సత్యభాస్కర్, విడదాసరి రాజా, తాటికొండ వెంకటలక్ష్మి ఆమెను పరామర్శించారు. అధికారపక్షం రెచ్చగొడితేనే తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కలి్పంచాలని చైర్పర్సన్ పోలీసులను కోరారు. రోత రాతలను సహించం అబద్ధాలు, ఆధారాల్లేని ఊహాగానాలతో ఈనాడు పత్రిక పెద్దాపురం కౌన్సిల్ సభ్యులపై తప్పుడు రాతలు రాసిందని మునిసిపల్ కౌన్సిల్ ధ్వజమెత్తింది. కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈనాడులో వచ్చిన తప్పుడు రాతలపై కౌన్సిల్ సభ్యులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని వచి్చన వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో పత్రిక తేల్చాలన్నారు. పత్రికలో వచి్చన 410 సర్వే నంబర్ పూర్తి జిరాయితీ అయితే 83 సెంట్ల భూమి రూ.4కోట్లు అంటూ తప్పుడు కథనం ఇవ్వడం సమంజసమా అని ప్రశి్నంచారు. ఈ కథనంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కథనం రాసిన పత్రిక ప్రతినిధి ఓపక్క జర్నలిస్ట్గా, మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్గా చలామణి అవుతున్నాడని ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కంటతడితమ కుటుంబ సభ్యుల రేషన్ షాపు తొలగించారని మహిళా కౌన్సిలర్ ఆవేదన షాపు అవసరం లేదని బలవంతంగా సంతకం చేయించుకున్న టీడీపీ నేతలుపుత్తూరు: కూటమి అధికారంలోకి వచి్చనప్పటినుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్గా వ్యవహరిస్తున్న టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షసాధింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమేగాక వారి ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ షాపులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా పుత్తూరులో ఐదేళ్లుగా నిజాయితీగా కార్డుదారులకు సరుకులు ఇస్తూ ఎలాంటి ఆరోపణలు లేని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న రేషన్ దుకాణాన్ని తొలగించారు. దీనిపై బుధవారం 18వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కె.రాధ కౌన్సిల్ సమావేశంలో కంటతడి పెట్టారు. కక్షసాధింపులు తగవని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎ.హరి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరూ సమానమేనని, అధికారపక్షం, ప్రతిపక్షం అంటూ తేడాలు ఉండకూడదని చెప్పారు. దీనిపై స్పందించిన కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ఇందుకు నిదర్శనం తమ కుటుంబసభ్యులు ఐదేళ్లుగా నిర్వహిస్తున్న రేషన్ షాపును తొలగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్క మంజుల ఐదేళ్లుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా రేషన్ షాపు నడుపుతున్నారని తెలిపారు. రెండురోజుల కిందట టీడీపీ నాయకులు కొందరు రాత్రిపూట ఇంటివద్దకు వచ్చి మంజులను బెదిరించి రేషన్ షాపు అవసరం లేదంటూ బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సైతం తమవద్ద ఉన్నాయన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నిలదీశారు. అటవీ భూముల ఆక్రమణకు టీడీపీ నేతల యత్నంఆక్రమణకు గురైన భూములను పరిశీలిస్తున్న అధికారులుచిల్లకూరు: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరూరు పంచాయతీలోని అటవీ భూముల్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నస్తున్నారు. పలువురు నాయకులు అటవీ భూముల్ని చదును చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో సర్వే నంబరు 432లో సుమారు 400 ఎకరాల అటవీభూములు ఉన్నాయి. వీటిలో సగం వరకు ఇప్పటికే ఆక్రమణలకు గురికాగా మిగిలిన భూములను ఆక్రమించేందుకు టీడీపీ నేతలు ప్రయతి్నస్తున్నారు. ఆ భూమిని చదును చేసే పనుల్ని స్థానికులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన చెరువు లోతట్టులో కూడా సుమారు 50 ఎకరాల వరకు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాలను స్థానికులు గూడూరు ఆర్డీవో కిరణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై వీఆర్వో శ్రీనివాసులను అడగగా.. భూములు ఆక్రమణలకు గురవుతున్న విషయం వాస్తవమేనన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు. మట్టిపోసి వలంటీర్ ఇంటి దారిమూతసత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్ కంటు బ్రహ్మయ్య ఇల్లు తొలగించాలని టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. 20 ట్రాక్టర్ల మట్టిపోసి వలంటీర్ ఇంటికి దారి మూసేశారు. వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ చిన్న టీ హోటల్ నడుపుతూ జీవిస్తున్న బ్రహ్మయ్య 30 సంవత్సరాల నుంచి గ్రామంలో బీసీలకు కేటాయించిన పోరంబోకు స్థలంలో పూరిగుడిసె వేసుకుని ఉంటున్నాడు. బ్రహ్మయ్య వలంటీర్గా వైఎస్సార్సీపీకీ అనుకూలంగా పనిచేశాడంటూ కక్షతో అతడి ఇల్లు కూల్చేయాలని టీడీపీ నేతలు కుట్రచేశారు. టీడీపీకీ చెందిన పచ్చ సు«దీర్, పచ్చ అప్పయ్య, నల్లబోతు కోటయ్య, బొడ్డు లింగయ్య, మరో 20 మంది ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లోలేని సమయంలో ఆయన ఇంటికి దారిలేకుండా 20 ట్రాక్టర్ల మట్టిపోశారు. బ్రహ్మయ్య ఇంటిముందు ఎనీ్టఆర్ బొమ్మ ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేయాలంటూ ఆ ఇంటిని కూల్చేయాలని ప్రయతి్నస్తున్నారు. -
అనకాపల్లిలో మైనర్పై అత్యాచారం
అనకాపల్లి: మైనర్ బాలిక(14)పై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ తేజేశ్వరరావు బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు. వి.మాడుగుల మండలం కింతలివల్లాపురం గ్రామానికి చెందిన కుటుంబం పనుల నిమిత్తం అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి వలస వచ్చారు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి బాలికపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం 5వ నెల గర్భవతి. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపారు. -
సైబర్ నేరగాళ్లే ఎంపీడీవో ఉసురు తీశారు!
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాళ్ల వేధింపుల కారణంగానే ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్యపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. వెంకటరమణ సెల్ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా రాజస్థాన్లోని బర్కత్పూర్కు చెందిన సైబర్ముఠా వలలో ఎంపీడీవో చిక్కుకున్నట్లు గుర్తించారని తెలిసింది. సుమారు 30మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని ఎంపీడీవోను ఇరుకునపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆయనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించారని తెలిసింది. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీవో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్లోని బర్కత్పూర్కు చెందిన సైబర్ముఠా సభ్యుడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఎంపీడీవో అదృశ్యమైన తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ కాంట్రాక్టర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ ప్రభుత్వానికి రేవు నిర్వహణకు సంబంధించిన లీజు డబ్బులు బకాయి ఉండటంతోనే ఎంపీడీవో కనిపించకుండాపోయారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ ధవేజీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అనుచరుడని, లీజు డబ్బులు చెల్లించకుండా ప్రసాదరాజు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందువల్లే ఒత్తిడికి గురైన ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్లో పెట్టిన సూసైడ్ నోట్ కథనాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఎంపీడీవో ఆత్మహత్యకు, ఫెర్రీ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
మద్యం మత్తులో.. కూతురికే ఉరి
రొంపిచెర్ల: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న బిడ్డనే ఉరేసి చంపిన సంఘటన మండలంలోని పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలు మేనమామ జయరాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడింపల్లెకు చెందిన కె.మునిరత్నం(35), రెడ్డెమ్మ దంపతులకు ఒక కుమార్తె గౌతమి(14) ఉంది. పదేళ్ల క్రితం రెడ్డెమ్మ మృతి చెందారు. అప్పటి నుంచి గౌతమి తన తండ్రి, అవ్వతో కలసి ఉంటోంది.గౌతమి పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే మునిరత్నం తల్లి ఐదు నెలల క్రితం మృతి చెందింది. అప్పుటి నుంచి ఆ ఇంట్లో తండ్రి, కుమారై జీవిస్తున్నారు. మునిరత్నం ఆదివారం రాత్రి తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉన్న కుమారైను ఏమీ పని చేయడం లేదని మందలించాడు. దీంతో గౌతమి కూడా గట్టిగా బదులిచ్చింది. వెంటనే కోపంతో సెల్ చార్జింగ్ వైర్ను మెడకు వేసి చంపివేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకుని మృతి చెందిందంటూ ఉదయాన్నే చుట్టుపక్కల వారికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు తండ్రి మీద అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో తన బిడ్డను చార్జింగ్ వైరుతో చంపివేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే నిందితుడు మునిరత్నం పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కల్లూరు సీఐ శ్రీనివాసులు, ఇన్చార్జి ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మునిరత్నం కోసం రొంపిచెర్ల పోలీసులు గాలిస్తున్నారు. రెండు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.ఎన్నో అనుమానాలు కుమారై గౌతమి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి తాను చనిపోతున్నానని తన చావుకు తన స్నేహితులను పిలవాలని రాసిన ఒక లేఖ సోమవారం బయటపడింది. అయితే మరోపక్క మునిరత్నమే తన కుమార్తెను చంపేశాడని ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కుమార్తెపై లైంగిక దాడికి యతి్నంచి, చంపేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోస్టుమాస్టరం నివేదికలో వాస్తవం బయటపడుతుందని భావిస్తున్నారు. -
విషాదం మిగిల్చిన విహారం
మైదుకూరు/దువ్వూరు: విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. తెలుగుగంగ రిజర్వాయర్లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన పఠాన్ రహంతుల్లా(23), ఎస్కే ముదాతీర్(22), వేంపల్లి షాహిద్(23) ఆదివారం సాయంత్రం మైదుకూరు మండల పరిధిలోని తెలుగు గంగ సబ్సిడరీ రిజర్వాయర్–1 వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పార్కులో కొద్దిసేపు గడిపిన తర్వాత రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈత వేసేందుకని రిజర్వాయర్లోకి దిగి గల్లంతయ్యారు. రాత్రయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు.. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయాన్నే వారి స్నేహితులను వాకబు చేశారు. ముగ్గురు యువకులూ విహార యాత్రకని తెలుగు గంగ రిజర్వాయర్కు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. ఆ వెంటనే అక్కడికి వెళ్లగా.. రిజర్వాయర్ కట్టపై యువకుల దుస్తులు, చెప్పులు, సెల్ ఫోన్లు ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైదుకూరు, దువ్వూరు పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకొని.. యువకుల కోసం గాలించారు. మైదుకూరు అర్బన్, రూరల్ సీఐలు మస్తాన్, శ్రీనాథ్రెడ్డి అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు రిజర్వాయర్లో గాలించి సోమవారం మధ్యాహ్నానికి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. రిజర్వాయర్ గేట్లకు సమీపంలో.. 30 అడుగుల లోతు ఉండటంతో యువకులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. -
దాడిచేసింది వారే.. కేసు పెట్టింది వారే!
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ నాయకుడు గున్నయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన సురేష్, అతడి బావ రాజయ్య, మామ వెంకటయ్య, మరికొందరు ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడిచేశారు. విజయకుమార్, గురునాథ్, చిట్టెమ్మ, బాబు, సుధాకర్లను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. బాధితులు ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఇరువర్గాలను స్టేషన్కు తీసుకువచ్చారు. టీడీపీ నేతల ఒత్తిడితో టీడీపీ వారిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఆస్పత్రిలో చేరకుండా అడ్డుకుని వారిని తీసుకెళ్లి రాత్రంతా స్టేషన్లో ఉంచారు. సోమవారం వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేసి న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టి సబ్జైలుకు పంపారు. తీవ్రంగా గాయపడిన చిట్టెమ్మ ఇచి్చన ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదుచేయలేదు. దీనిపై డీఎస్పీని అడగగా.. విచారించి కేసు నమోదుచేస్తామని తెలిపారు. ఈ నెల 19న వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైననాటో డ్రైవర్ ఎర్రయ్యను హత్యచేసేందుకు టీడీపీకి చెందిన సురే‹Ù, మరికొంతమంది ప్రయతి్నంచారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో పారిపోయారు. 20వ తేదీన ఎర్రయ్య తొట్టంబేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిన పోలీసులు టీడీపీ నాయకుల బెదిరింపులకు తలొగ్గి సాధారణ కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని టీడీపీ నాయకులను వదిలేశారు.ఊళ్లోంచి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారు..» కూటమి నేతలు ఇళ్లల్లోకి వచ్చి దాడి చేస్తున్నారు » ఎస్పీ కార్యాలయంలో గుంటూరు జిల్లా గారపాడు మహిళల ఫిర్యాదునగరంపాలెం: కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ ల నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలోని పల్లెలో ఉంటున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము గ్రామంలో బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలకు చెందిన మహిళలు కూడా తమ ఇళ్లల్లోకి చొరబడి గొడవలకు దిగుతున్నారని, పల్లె విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బాధితులు కూరపాటి పూర్ణ, పల్లపాటి శృతి, ఏసుపొగుల సింధు, మహాలక్షి్మ, కోటేశ్వరి, బేతపూడి రాణి తదితరులు సోమవారం గుంటూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల ఫిర్యాదుల స్వీకరణలో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు.. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి వైఎస్సార్సీపీ వారిని కవి్వస్తున్నారు. అధికారం మాదే, ఈ ఐదేళ్లు గ్రామంలో ఉండటానికి వీల్లేదు.. వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. గత నెల 26న తాను ఇంటివద్ద నిలబడి ఉండగా లైట్లు ఆర్పేసి కర్రలు, సీసాలతో దాడిచేసి కొట్టి గాయపరిచారని కారసాల రంగమ్మ కన్నీరుమున్నీరైంది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స చేయించుకున్నట్లు తెలిపింది. ఈ దాడి గురించి స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గత నెల 24న తన మామ ఏసుపొగుల రవి, మరో పదిమందిపై సీసాలతో దాడిచేశారని మాధవి తెలిపింది. బయట నుంచి తాగునీరు తెచ్చుకోవాలన్నా భయమేస్తోందని చెప్పింది. ఆఖరికి పిల్లలపై పాఠశాలల వద్ద దాడిచేస్తున్నారని పలువురు తెలిపారు. 50కి పైగా కుటుంబాలు గ్రామం బయటే ఉంటున్నట్లు చెప్పారు. కారసాల ఆదాం, పల్లెపు రాంబాబు, శ్యాంబాబు తదితరులు గ్రామం విడిచి వెళ్లారని వారు తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని వారిని కట్టడి చేయాలని బాధిత మహిళలు విజ్ఞప్తి చేశారు. -
అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుశ్చర్య
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త , ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనాకోట తండాలో కాపుకాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడిచేసి చేయి విరగ్గొట్టారు. కులం పేరుతో దూషించారు. తోటి కార్యకర్తను కాపాడిందని.. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 27న ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. అంగన్వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను వివరిస్తూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.పక్క గ్రామమైన నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త సుహాసినికి విషయం తెలియడంతో వెంటనే సదరు కేంద్రానికి వెళ్లి తోటివారితో కలిసి నాగమణిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగమణి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా.. నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె అనుచరుడు ఆంజనేయులు దాషీ్టకానికి ఒడిగట్టాడు. బాధితురాలు జాయింట్ కలెక్టర్ అభిõÙక్కుమార్, ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు, అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, గౌరవాధ్యక్షుడు వెంకటే‹Ù, అధ్యక్షుడు మహబున్నీషా, కోశాధికారి శ్రీదేవి,కార్యదర్శి దిల్షాద్ పాల్గొన్నారు. -
కాకినాడలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మురారీ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. కాకినాడలోకి గండేపల్లి మండలం మురారీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, మృతులను భీమవరానికి చెందిన వారిగా గుర్తించారు. -
పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ
సాక్షి, అమరావతి: ప్రముఖ ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ పేరిట ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో వేల మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రెట్టింపు ఆదాయం లభిస్తుందని బురిడీ కొట్టించారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయామని విశాఖతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు, లింక్ క్లిక్ చేస్తే చాలు అంటూ నెట్ఫ్లిక్స్ ఫాలో అనే యాప్ పేరిట 2021లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులను బురిడీ కొట్టించారు. రూ. లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఇలాంటి నేరగాళ్లు, గొలుసుకట్టు ఇన్వెస్ట్మెంట్ సైబర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరుకు చెందిన రవి ఫోన్ నంబర్ను ఐపీజీ అనే పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినట్టు నోటిఫికేషన్ వచి్చంది. కొద్దిసేపటికి గ్రూప్ అడ్మిన్ ‘రూ.800 పెట్టుబడి పెడితే ఏడాదంతా రోజుకు రూ.35 చొప్పున ఆదాయం’ అంటూ మెసేజ్ పెట్టింది. గ్రూప్ సభ్యులు కొందరు కొన్ని స్క్రీన్షాట్స్ షేర్ చేసి తాముసంపాదిస్తున్నాం అంటూ వంతపాడారు. ఇవన్నీ చూసిన రవి వాళ్లను నమ్మి అడ్మిన్ సూచించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.800 పెట్టుబడి పెట్టాడు. తనకు తెలిసిన మరికొందరితోనూ పెట్టుబడి పెట్టించాడు. ప్రారంభంలో వాళ్లు చెప్పినట్లే చెల్లిస్తూ వచ్చారు. ఇది బావుందని భావించి రవి రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. అంతే రెండు రోజుల్లోనే యాప్ పనిచేయకుండా పోయింది. మెసేజ్లకు అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయానని రవి గుర్తించి లబోదిబోమన్నాడు. తక్కువ పెట్టుబడి. ఎక్కువ ఆదాయం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని టాస్్కలు పూర్తి చేస్తే డబ్బు వచ్చి ఖాతాలో జమ అవుతుంది అంటూ సైబర్ నేరగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో పడి పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, యువత తమ కష్టార్జితాన్ని సమరి్పంచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నమ్మించిమోసం చేస్తారు.. అదనపు ఆదాయం వస్తుందనికొందరి ఆశే.. సైబర్ మోసగాళ్లకు వరమవుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకూ నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టెలీగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గ్రూప్లు క్రియేట్ చేసి ఫలానా స్కీమ్ ద్వారా ఫలానా లాభం ఉంటుందని ఆకర్షిస్తున్నారు. ఈ తరహా యాప్లు, వెబ్సైట్లు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏదైనా యాప్, వెబ్సైట్ను సందర్శించే ముందు ఒకటి రెండుసార్లు పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు చేయండిలా దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు చేయడానికి కేంద్ర హోమ్ శాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచి్చంది. https://www. cybercrime.gov.in./ వెబ్సైట్ ద్వారా, 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి బాధితులు మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు. అదే విధంగాసమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్/సాధారణ పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఒక వేళ ఓటీపీ, ఆన్లైన్ బ్యాంకింగ్ల ద్వారా మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులు ఇలా..» ఢిల్లీ 58,748» బిహార్ 42,029» ఛత్తీస్గఢ్ 18,147» తెలంగాణ 71,426» ఆంధ్రప్రదేశ్ 33,507» కర్ణాటక 64,301 » కేరళ 23,757 -
ఒంటరితనం ఊపిరి తీసింది!
కర్నూలు సిటీ: కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీడీఎం)లో చదువుతున్న నల్ల సాయి కార్తీక్ నాయుడు(20) ఒంటరితనం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామానికి చెందిన నల్ల వెంకట నాయుడు కుమారుడైన సాయికార్తీక్ ట్రిపుల్ఐటీడీఎంలో ఈసీఈ బ్రాంచ్తో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.శనివారం క్యాంపస్లోని కలాం హాస్టల్ భవనం 9వ అంతస్తు నుంచి దూకడంతో కుడి కాలు విరిగి, తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. క్యాంపస్కు వేసవి సెలవులు ముగిసి ఈ నెల 22 నుంచి క్లాసులు తిరిగి ప్రారంభమయ్యాయి. సాయి కార్తీక్ క్యాంపస్కి వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ మానసికంగా ఇబ్బంది పడే వాడని, సమస్య ఏంటో ఎవరికీ చెప్పలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు.చదువులో ఒత్తిడి ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరితనం, తాను చెప్పినా ఎవరు వినిపించుకోలేదని సూసైడ్ నోటులో రాసినట్లు సమాచారం. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
రషీద్ హత్యకేసులో అసలు దోషులేరీ..?
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వినుకొండ వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ హత్యను ప్రభుత్వం నీరుగారుస్తోంది. రాజకీయ ప్రతీకార హత్య అయినప్పటికీ వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మృతుడి రక్త సంబంఽధీకులు ఇచ్చిన ఫిర్యాదులోని నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకుండా నామమాత్రంగా కొందరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు బాధిత కుటుంబం నుంచి వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రోజే రషీద్ సోదరుడు ఖాదర్బాషా ఇచ్చిన ఫిర్యాదులో రషీద్ మరణానికి కారణంగా పేర్కొంటూ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ మున్సిపాలిటీకి చెందిన కీలక టీడీపీ నేతలు షమీమ్ఖాన్, అయూబ్ఖాన్, హంతకుడు జిలానీ స్నేహితులైన కొందరు టీడీపీ రౌడీల పేర్లు ప్రస్తావించారు. అయితే పోలీసులు కేవలం హత్యలో పాల్గొన్న టీడీపీ గూండాల పేర్లు మాత్రమే పొందుపరచి, హత్యకు కుట్ర పన్నిన ప్రజాప్రతినిధులు, పట్టణ టీడీపీ ముఖ్యనేతల పేర్లు తొలగించారు. దీనిపై తొలిరోజు నుంచి రషీద్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు కుట్ర పన్నిన వారిని పక్కకు తప్పించి ఇది కేవలం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు.హత్యలో పాల్గొన్న టీడీపీ గూండాలు అరెస్ట్రషీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు జిలానీని ఇప్పటికే అరెస్ట్ చేయగా, హత్యతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్ట్ చూపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు జిలానీ కూడా టీడీపీకి చెందిన వారే. ఈ ఏడాది జనవరి 17న ప్రచురితమై ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీరంతా టీడీపీ కార్యకర్తలని, వారిపై వినుకొండలో జరిగిన ఓ దాడి కేసులో కేసు నమోదు చేశారని వార్త రాశారు. గురువారం అరెస్ట్ అయిన ఒక్కొక్కరిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీరంతా పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి హత్య ఉదంతాన్ని ముగించారు. మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేసే రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడో, ఎలా వెళ్తాడు అనేది వారం ముందు నుంచే జిలానీ, అతని అనుచరులు అక్కడ సంచరిస్తూ ఆరా తీశారు. హత్య జరిగిన ప్రాంతంలో పలు దుకాణాల వద్ద లభ్యమైన సీసీ ఫుటేజ్ల్లో ఈ విషయం వెల్లడైనట్టు పోలీసులు చెబుతున్నారు. రషీద్ను పాశవికంగా హత్య చేస్తున్న సమయంలో హంతకుడు జిలానీ అనుచరులు ఒక వలయంగా ఏర్పడి పహారా కాశారు. కొందరు హత్యకు ముందు మారణాయుధాలను అందించారు.పోలీసులపై తీవ్ర ఒత్తిడి?రషీద్ హత్య కేసులో తెరవెనుక కీలకంగా వ్యవహరించిన షమీమ్ఖాన్, అయూబ్ఖాన్లను ఎలాగైనా కేసు నుంచి తప్పించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ ఒత్తిడితో తాను న్యాయం చేయలేకపోతున్నానంటూ ఓ పోలీసు అధికారి బాధిత కుటుంబానికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసులో వీరిద్దరిని అరెస్ట్ చేస్తే టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటుందని అందుకు వారిద్దరిని అరెస్ట్ చేయకుండా చూడాలని పోలీసు శాఖలో ఓ ఉన్నతాఽధికారిని ఎమ్మెల్యే కోరినట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.మాజీ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా...తన పార్టీ క్యారకర్త రషీద్ హత్యను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినుకొండకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు మనో ధైర్యం చెప్పారు. నిందితుడు జిలానీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు సతీమణి లీలావతికి కేక్ తినిపిస్తున్న ఫొటోలు వైఎస్ జగన్కు చూపి తమ పార్టీ వాడు కాదని టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మృతుడి తల్లిదండ్రులు ఎండగట్టారు. అయినప్పటికీ పోలీసులు ఆ దిశగా ఎందుకు విచారణ చేపట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. రషీద్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని దేశ రాజధాని వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. ప్రభుత్వం, పోలీసులు మాత్రం ఈ కేసును వ్యక్తిగత కక్షలతో అని అర్థం చెప్పేలా ప్రయత్నిస్తున్నాయి.అజ్ఞాతంలో అసలు నిందితులురషీద్ హత్యకు కుట్ర పన్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న షమీమ్ ఖాన్, ఆయూబ్ ఖాన్లు హత్య జరిగిన రోజు నుంచి వినుకొండ నుంచి పారిపోయినట్టు సమాచారం. రషీద్ హత్యకు కఽథా, స్క్రీన్ప్లే మొత్తం షమీమ్, అయూబ్ఖాన్లే రచించారనదే వినుకొండలో అందరినోటా వినిపిస్తోంది. ప్రధాన నిందితుడు జిలానీ, షమీమ్, అయూబ్ ఖాన్లపై ఈ ఏడాది జనవరిలో షాదీఖానా వద్ద జరిగిన గొడవలో నిందితులుగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వీరు ముగ్గురి మధ్య సంత్ససంబంధాలు ఉన్నాయి. హత్యానంతరం వీరిద్దరు అజ్ఞాతంలో ఉండి తమ ఫోన్లను స్విచ్ఆఫ్ చేసి మారు నెంబర్లతో మాట్లాడి రషీద్ హత్యకేసులో నిందితులను పోలీసులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారు. దీనికి ప్రతిఫలంగా కేసు నుంచి వీరి ఇరువురు పేర్లు తప్పించేందుకు ఒప్పందం కుదిరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యతో సంబంధం లేకపోతే వీరు పారిపోవాల్సిన అవసరమేముంది? పరారైన నిందితులు ఆశ్రయం కోసం వీరి వద్దకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు బాధిత కుటుంబం నుంచి వినిపిస్తున్నాయి. చిన్నచిన్న కేసుల్లో నానా హడావుడి చేసే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీమ్, ఆయూబ్లను అరెస్ట్ చేయడంలో అలసత్వం వహించడం పోలీసుశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. -
ఏలూరులో బస్సు ప్రమాదం, వేగంగా లారీని ఢీ కొట్టి..
ఏలూరు, సాక్షి: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. అయితే ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ వేకువజామున బస్సు ఢీ కొట్టింది. వేగానికి బస్సు ముందు భాగంగా.. లారీలోకి చొచ్చుకుపోయింది. బస్సులోనే ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోగా.. ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే.. తన క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన ప్రయాణికుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందించాల్సి ఉంది. -
నమ్మించి.. మత్తులో ముంచి..
తిరుపతి రూరల్ : ఫ్రెండ్ అని నమ్మించింది.. ప్రాణం కన్నా ఎక్కువ అని నమ్మబలికింది.. ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేసింది.. నమ్మి వచ్చిన ఫ్రెండ్కు భర్తతో కలిసి గంజాయి మత్తును అలవాటు చేసింది. మత్తులో ఉన్న ఫ్రెండ్పై భర్తతో లైంగిక దాడి చేయించింది.. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. ఆపై బ్లాక్ మెయిల్కు పాల్పడటం మొదలెట్టింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న సమయంలో అమ్మకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలు.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన విద్యార్థి (22) తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిషోర్రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమె చదువుతున్న క్లాస్లోనే సహ విద్యార్థి నిగా ఉంది. తన తోటి విద్యార్థి ని నమ్మించి పుదిపట్లలోని తన ఇంటికి తీసుకెళ్లి భర్త కృష్ణకిషోర్రెడ్డికి పరిచయం చేసింది ప్రణవకృష్ణ. అనంతరం ఇద్దరు కలిసి విద్యార్థి కి గంజాయిని అలవాటు చేశారు. మత్తులో ఉన్న విద్యార్థి నిపై కృష్ణకిషోర్రెడ్డి లైంగికదాడి చేసేవాడు. దీనిని ప్రణవకృష్ణ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇదంతా గతేడాది జూన్ 13 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగింది. ఇటీవల కర్నూలు విద్యార్థి కి తమ కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో నిశి్చతార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్రెడ్డి విద్యార్థి ని బ్లాక్మెయిల్ చేయసాగారు. నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, నగదును సైతం లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆలస్యం అవుతుందని శారీరకంగా, మానసికంగా దాడులు చేస్తూ వేధించారు. ఇంట్లో చెప్పుకోలేక, వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చి 0ది. బిడ్డ దుస్థితి చూసి లోతుగా ఆరా తీసింది. దీంతో జరిగిన ఘటన, బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారంపై తల్లి వద్ద వాపోయింది. దీంతో ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్స్టేషన్లో తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రూరల్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. కేసులో నిందితులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, ప్రణవకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. -
ఆగని టీడీపీ శ్రేణుల దాష్టీకాలు
సాక్షి నెట్వర్క్: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తల దాష్టీకాలు గురువారం రాత్రి, శుక్రవారం కూడా యథేచ్ఛగా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అడ్డూఅదుపు లేకుండా ప్రవర్తించారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపైకి వెళ్లి అనుచితంగా ప్రవర్తించడమేగాక ప్రశ్నించినందుకు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడిచేశారు. గ్రామ సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రానికి పెయింట్ వేశారు. రైతుభరోసా కేంద్రం, సచివాలయం బోర్డులు తొలగించారు. వైఎస్సార్సీపీ జెండాపోల్ను ధ్వంసం చేశారు. » పల్నాడు జిల్లా మర్సపెంట తండాలో టీడీపీకి చెందిన ఓ యువకుడు గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీకి చెందిన ఒక మహిళ ఇంటి తలుపు కొట్టాడు. ఒంటరిగా ఉన్న మహిళను దుర్భాషలాడాడు. ఈ విషయమై స్థానికులు టీడీపీ వారిని నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో ఇళ్లముందున్న ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా వారు గృహాలపై దాడులకు తెగబడినట్లు గ్రామ సర్పంచ్ రవీంద్రనాయక్ చెప్పారు. ఆ మహిళ శుక్రవారం వెల్దుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.» ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన లింగసముద్రంలో వైఎస్సార్సీపీ మండల జేసీఎస్ కన్వీనర్ వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేశారు. లింగసముద్రం గ్రామకంఠం సర్వే నంబర్ 79లో ఆర్యవైశ్యులకు 89 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 50 ఏళ్లుగా వారు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. తమ అవసరాల నిమిత్తం ఓ రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వస్థలం అంటూ శుక్రవారం టీడీపీ నాయకులు ఆ షెడ్డును పడగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఆర్యవైశ్యులను పక్కకి నెట్టిపడేశారు. అదే సమయంలో వెళ్లిన వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేసి కొట్టారు. సమాచారం అంది వచ్చిన పోలీసులు వారిని చెదరగొట్టారు. కృష్ణారెడ్డిపై దాడిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్, నేతలు ఖండించారు. » అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో పలువురు గడ్డపారలు, ఇతర పనిముట్లతో గ్రామ సచివాలయంలోకి చొరబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన సచివాలయ ఉద్యోగులు భయంతో బయటకు పరుగుతీశారు. దుండగులు సచివాలయంపై ఉన్న జగన్ ఫొటోతో పాటు శిలాఫలకానికి పెయింట్ వేశారు. అక్కడ పికెట్లో ఉన్న పోలీసులు కనీసం అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి అప్గ్రేడ్ రూరల్ పోలీసుస్టేషన్ సీఐ లక్ష్మీకాంతరెడ్డి స్పందించి ఎస్ఐ సాగర్తో పాటు సిబ్బందిని గ్రామానికి పంపించారు. టీడీపీ మద్దతుదారుల చర్యలను పోలీసులు అడ్డుకుని హెచ్చరించి పంపేశారు. » ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయం బోర్డులను తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అధికారుల పేర్లు ఉన్న శిలాఫలకాలను తొలగించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. » పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు, 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి దహనం చేశారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం గమనించిన శివప్రసాద్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి దుండగులు పరారయ్యారు. దీనిపై పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.» గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని అంజిరెడ్డినగర్లో వైఎస్సార్సీపీ జెండా పోల్ను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులి ఆశ్రయించనున్నట్లు వైఎస్సాÆŠ‡సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి చెప్పారు. -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
షిర్డీ టూ కాకినాడ రైలులో భారీ చోరీ.. ప్రయాణీకుల ఆందోళన
సాక్షి, బీదర్: షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. రైలులో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని మూడు బోగీల్లో బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. దీంతో, బీదర్ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.వివరాల ప్రకారం.. సాయినగర్ షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలులో ఎక్కిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద నుంచి బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. ఈ క్రమంలో దోపిడీని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్కు ముందున్న పర్లీ స్టేష్లన్లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దీంతో, తమకు న్యాయం జరగాలని ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. బీదర్లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. -
సోమిరెడ్డి అనుచరుల దురాగతం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల దురాగతాలు పెచ్చుమీరాయి. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తుల్ని ధ్వంసం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పారిశ్రామిక రంగంపై కన్నేశారు. పరిశ్రమల యాజమాన్యాల నుంచి సొమ్ములు దండుకునేందుకు భయబ్రాంతుల్ని చేస్తున్నారు. తాజాగా.. టీపీ గూడూరు మండలం అనంతపురంలోని వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడి 16 మందిని తీవ్రంగా గాయపరిచారు. పథకం ప్రకారమే దాడి జిల్లాలోని సముద్ర తీరం వెంబడి రొయ్యల ప్రాసెసింగ్, మేత తయారీ యూనిట్లు ఉన్నాయి. టీపీ గూడూరు మండలం అనంతపురం వద్ద ది వాటర్బేస్ లిమిటెడ్ కంపెనీని దశాబ్దం కిందట నెలకొల్పారు. రొయ్యల ఫీడ్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ ఏటా రూ.200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తుంది. అందులో 200 మంది ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 150 మంది వరకు రోజువారీ లేబర్గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీపై టీడీపీ నేతల కన్ను పడింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే డైలీ లేబర్ పోస్టులు తమ కార్యకర్తలు సూచించిన వారికే ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు తెచ్చారు. 10 రోజుల్లో ఆ కూలీలను తొలగించి తాము చెప్పిన వారినే పెట్టుకోవాలని బెదిరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న లేబర్ను తొలగించేందుకు న్యాయపరమైన చిక్కులున్నాయని యాజమాన్యం కొంత సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం టీడీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులకు స్కెచ్ వేశారు. నిత్యం నెల్లూరు నుంచి అనంతపురం వద్ద ఉన్న కంపెనీకి ఉద్యోగులను తీసుకొచ్చే వాహనాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు వరకయపూడి వద్ద అడ్డుకుని అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగులను కిందికి దించి కర్రలతో దాడి చేశారు. దాడిలో 16 మంది గాయపడ్డారు. కంపెనీ హెచ్ఆర్ హెడ్ ఉత్తమ్కుమార్కు తీవ్రగాయాలు కావడంతో ఆయనను చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఉద్యోగుల ఆందోళన ఉద్యోగులపై పథకం ప్రకారం టీడీపీ నేతలు దాడులకు తెగబడటంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకుల నుంచి రక్షణ కలి్పంచి న్యాయం చేయాలని కోరుతూ వరకయపూడి రచ్చబండ వద్ద ధర్నా నిర్వహించారు. కంపెనీ యాజమాన్యంపై ఉన్న అక్కసుతో ఉద్యోగులపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది ఉద్యోగులకు గాయాలైనప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కంపెనీ యాజమాన్యం జంకుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.