Mahabubabad District News
-
‘ఎస్సెస్సీ’లో డిస్నీల్యాండ్ హవా
దామెర: ఎస్సెస్సీ ఫలితాల్లో డిస్నీల్యాండ్ పాఠశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ శోభారాణి బుధవారం తెలిపారు. పాఠశాలకు చెందిన తుత్తురు హర్షిణి, బానోతు శ్రీమాన్లు 569 మార్కులు సాధించారు. 47 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. 133 మంది విద్యార్థులకు గాను 130 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె వెల్లడించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయులను పాఠశాల ముఖ్యసలహాదారులు దయ్యాల మల్లయ్య, సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, డైరెక్టర్లు రాకేష్భాను, దీనేష్చందర్లు అభినందనలు తెలిపారు. -
టెన్త్ ఫలితాల్లో ఎస్ఆర్ విజయభేరి
విద్యారణ్యపురి: టెన్త్ పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. సక్కరా శివప్రియ 600 మార్కులకు గాను 586, డి.దీక్షిత్రెడ్డి 586, ఎస్.మనస్విని 585, మనివర్ధన్ 584, శివచరణ్ 584, వి.హాసిని 584 మార్కులు సాధించారని వారు తెలిపారు. 580కి పైగా మార్కులు 23మందికిపైగా సాఽధించి తమ ప్రతిభను చాటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటిని ఆచరణ పరుస్తూ ఒత్తిడి లేని వాతావరణంలో క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఎస్ఆర్ విద్యాసంస్థల్లో పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఎస్సెస్సీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమ్ స్కూల్స్ను ప్రారంభించామన్నారు. -
‘పది’లో షైన్ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ: పదో తరగతి ఫలితాల్లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. బుధవారం వెలుబడిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేల విద్యారంగంలో విశిష్ట సంస్థగా పేరొందిన షైన్ విద్యార్థులు జిల్లాకే తలమానికంగా నిలిచారన్నారు. షైన్ అంటే కేవలం ‘ఐఐటీ’నే కాదని అన్నిరంగాల్లో ముందుంటామని మరోసారి రూఢీ అయ్యిందన్నారు. జిల్లాలోనే తమ పాఠశాల విద్యార్థి బి.ఆదిత్య దీక్షిత్ 588 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు. జి.జ్ఞానదీప్ 580, పి.హాసిని, మణికంఠ, రింషా జైనబ్ 579, సాయిశ్రీ 578, మణిచందన 577, కార్తీక, త్రిషిక పటేల్ 576, సంప్రీత్ 575, రాజేష్ 574 మార్కులు సాధించారన్నారు. 23 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా, 53 మంది 560 మార్కులకు పైగా, 92 మంది 550 మార్కులకు పైగా, 371 మంది 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. వరంగల్ మహానగరంతో పాటు రాష్ట్రస్థాయిలో షైన్ విద్యార్థులు ముందువరుసలో నిలిచారన్నారు. తెలుగులో 155 మంది, హిందీలు 90 మంది, ఇంగ్లిష్లో 299 మంది, గణితంలో 242 మంది, సైన్స్లో 217 మంది, సోషల్లో 154 మంది ఏ1 గ్రేడ్ సాధించారన్నా రు. డైరెక్టర్ పి.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ దే శంలోని ప్రతీ ప్రతిష్టాత్మక కళాశాలలో షైన్ విద్యార్థులున్నారని, దానికి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన కారణమన్నారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి.రాజేంద్రకుమార్, మూగల రమ, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేష్, షైన్ ఎర్రగట్టు గుట్ట చైర్మన్ జె.శ్రీనివాస్, ప్రి న్సిపాల్లు జి.రాజ్కుమార్, పి.విశాల్, ప్రగతి రెడ్డి, కవితా రాణి, ఉపాధ్యాయుల అభినందించారు. -
శివాని విద్యాసంస్థల విజయభేరి
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో శివాని విద్యాసంస్థలు విశ్వరూపం ప్రదర్శించాయి. పాఠశాలకు చెందిన రుద్రోజు శ్రేష్ట 577 మార్కులు, దివిజా 569, శ్రీనిత్యా 553, అంచూరి మానస 551, కుంట మనోజ్ 546, భూపతి అశ్వితారెడ్డి 545, ఽశస్త్ర రాఘశ్రీ 543, పెద్దిరెడ్డి మణిదీప్ రెడ్డి 539, ప్రణవ్ 539, దీవన్కుమార్ 538 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో శివానీ విద్యాసంస్థల కరస్పాండెంట్ టి.స్వామి, డైరెక్టర్లు సురేందర్రెడ్డి, చంద్రమోహన్, రాజు, ఎన్.రమేష్, మురళీధర్, వి.సురేష్, సంతోష్రెడ్డి, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
● 10 మందిపై కేసు నమోదు కురవి: దారి విషయంలో జరిమానా విధించి, తిట్టి కొట్టి అవమానించడంతో ఓ వ్యక్తి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీరోలు ఎస్సై నగేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసంకీస శివారు బిల్యాతండా గ్రామానికి చెందిన వాంకుడోత్ బాలు (53)కు అదే తండాకు చెందిన అతని బావ బానోత్ శంకర్ల మధ్య నడిచేదారి విషయమై ఏప్రిల్ 28న గొడవ జరిగింది. దీంతో ఈ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి బాలుకు రూ.25వేల జరిమానా విధించి అతిని బావ శంకర్కు ఇచ్చారు. దీంతో నా దగ్గర రూ.25వేలు తీసుకుంటావా? అని బావ శంకర్తో మళ్లీ గొడవ పడ్డాడు. ఈ సమయంలోనే కటారియా గోపిసింగ్, కిరణ్సింగ్, రాజేష్, వినోద్, బానోత్ మోహన్, వెంకన్న, రాజేష్, మోహన్, కమిలి, శంకర్ అందరూ కలిసి బాలును తిడుతూ, కాళ్లతో తన్ని అవమానపర్చారు. దీంతో బాలు అవమానం భరించలేక మనస్తాపంతో పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బాలు మృతికి కారణమైన పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేష్ తెలిపారు. -
ఆధ్యాత్మికతతోనే నైతిక విలువలు
హన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మికతతోనే నైతిక విలువుల పెంపొందుతాయని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు వర్ధనీపూజ, యాగశాల ప్రవేశం, భూతోత్సాదనం, యాగమండప స్థూనపూజ, ద్వారతోరణపూజ, అగ్నిప్రతిష్ఠ, సర్వతోభద్ర, నవగ్రహ, వాస్తుయోగినీ చతుషష్ఠి భైరవ మండల పూజ, క్షేత్ర పాలక మండల దేవతా యజనం పూజ, చతుఃస్థానార్చన, భేరీపూజ జరిపా రు. అమ్మవారిని పూలదండలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం వృషభవాహనంపై ఊరేగించారు. అనంతరం ధ్వజారోహణం చేశారు. అమ్మవారి సేవా కార్యక్రమాలకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉభయదాతలుగా వ్యవహరించారు. బండా ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె అశోక్, మహానగర అధ్యక్షుడు బయ్యస్వామి, ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్, బండి సారంగపాణి, పొన్నం మొగిలి తదితరులు పాల్గొన్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి రాష్ట్ర పద్మశాలి పురోహిత సంఘం అధ్యక్షుడు రుద్ర పాండురంగశాస్త్రి, శ్రీవైలం, చెన్న కేశవులు అమ్మవారి కల్యాణం కోసం ప్రత్యేకంగా నేసిన పట్టుచీరను సమర్పించారు. సాయంత్రం మృగ వాహనంపై ఉత్సవమూర్తిని ఊరేగించారు. బుధవారం అక్షయతృతీయ కావడంతో వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ -
2న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 2న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–9, 11 బాలబాలికల విభాగంలో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మీపురంలోని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ కాటన్ ఇండస్ట్రీస్ భవనంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు అండర్–9 విభాగంలో జనవరి 01, 2016 తర్వాత, అండర్–11 కేటగిరీలో పాల్గొనే క్రీడాకారులు జనవరి–01, 2014 తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. రెండు విభాగాల్లో గెలుపొందిన బాలుర నుంచి నలుగురు, బాలికల నుంచి నలుగురు క్రీడాకారులను మే చివరి వారంలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె విరమణ కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని 12 రోజులుగా సమ్మె చేస్తున్న కేయూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం సమ్మె విరమించారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సమ్మె శిబిరం వద్దకు వచ్చి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్డ్మెంట్ అయ్యే వరకు వారిని యథావిధిగా కొనసాగిస్తారని, డిస్టర్బ్ చేయరని, ఉద్యోగ భద్రత ఉంటుందని వీసీ ఆదేశాల మేరకు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హామీ ఇచ్చారు. దీంతో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సమ్మె విరమింపచేశారు. ఇందులో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కో–ఆర్డినేషన్ బాధ్యులు డాక్టర్ సాధురాజేశ్, శ్రీధర్కుమార్లోథ్, మాదాసి కనకయ్య, పి.కరుణాకర్రావు, ఆశీర్వాదం, భిక్షపతి, బి.సతీశ్, ఫిరోజ్పాషా, చంద్రశేఖర్, జూల సత్య, అరూరి సూర్యం, సూర్యనారాయణ, రఘువర్ధన్రెడ్డి, చందులాల్, శ్రీదేవి, అనిల్, స్వప్న, సాహితి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. దర్గా–ఫాతిమానగర్లో వర్షబీభత్సంకాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్ – దర్గాలో బుధవారం కురిసిన గాలి, రాళ్ల వాన బీభత్సానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్జల్నగర్, బస్తీ దవాఖాన ప్రాంతం, సర్వర్నగర్, బియాబానీ నగర్లో చెట్లు విరిగి నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కిందపడ్డాయి. సర్వర్నగర్లో 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి, అఫ్జల్నగర్లో ఇంటి పైకప్పు రేకులు ఆకాశంలోకి లేచి రైలు పట్టాలపై పడ్డాయి. ఇళ్లపైనున్న వాటర్ ట్యాంకులు కిందపడ్డాయి. వర్షబీభత్సంతో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్గా ప్రాంతంలో కరెంట్ లేదని మాజీ కార్పొరేటర్ ఎండి.అబుబక్కర్ తెలిపారు. సకాలంలో స్పందించి విద్యుత్ను పునరుద్ధరించినందుకు ఎమ్మెల్యే, మేయర్, విద్యుత్ మున్సిపల్ అధికారులకు మాజీ కార్పొరేటర్ అబుబక్కర్ కృతజ్ఞతలు తెలిపారు. -
గౌరవం పెరిగేలా పోలీసులు పనిచేయాలి
● పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కాజీపేట/మడికొండ: ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరిగేలా పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. బుధవారం కాజీపేట, మడికొండ పోలీస్ స్టేషన్ను సీపీ సన్ప్రీత్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్ని పరిశీలించడంతో పాటు సీసీ కెమెరా ల పనితీరు, కేసుల నమోదు, పరిష్కరానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో ఏసీపీ తిరుమల్, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు శివకృష్ణ, నవీన్ కుమార్, లవన్కుమార్, మడికొండ ఎస్ ఎచ్ఓ కిషన్, ఎస్సై రాజ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారికి గాయాలుహసన్పర్తి: హనుమకొండ, అంబాల మార్గమధ్యలో ఎర్రగట్టు గుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. పరకాల మండలం సీతానాగారాని కి చెందిన శ్రీనివాస్, లలిత దంపతులు బుధవారం ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి అంబాల వైపునకు వెళ్తున్నారు. ఎర్రగట్టు గు ట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రధాన ర హదారిపై ఉన్న గేట్వాల్వ్ గుంతను ఢీకొన్నారు. దీంతో శ్రీనివాస్ దంపతులతో పాటు వారి రెండేళ్ల కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గేట్వాల్వ్ గుంత విషయం అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడంలేదని స్థానికులు వాపోతున్నారు. -
విద్యుత్ ప్రమాదాలను నివారించాలి
హన్మకొండ: విద్యుత్ ప్రమాదాలను నివారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నా టి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం మే 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యుత్ భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, ఇన్చార్జ్ డైరెక్టర్లు, సీజీఎంలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మే మొదటి వారంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించడంతో పాటు సిబ్బందికి, ప్రజలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతీ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్లో విద్యుత్ విని యోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రత ప్రాముఖ్యతను వివరించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని ఎస్ఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశో క్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, బికంసింగ్, వెంకట రమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ -
వడదెబ్బతో వ్యక్తి మృతి
వెంకటాపురం(కె): మండలపరిధిలోని రాచపల్లి గ్రామంలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాచపల్లి గ్రామానికి చెందిన మాదరి వెంకన్న(55) అనే వ్యక్తి గొల్లగూడెం గ్రామంలో గేదెల కాపలదారుగా పని చేశాడు. ఈ మేరకు బుధవారం జీతం డబ్బులు తీసుకునేందుకు గొల్లగూడెం గ్రామానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మొట్లగూడెం గ్రామసమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే వెంకన్న మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతివర్ధన్నపేట: ట్రాక్టర్ టైరు కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని ఇల్లంద శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన ఇటికుల రవి (40) అదే గ్రామానికి చెందిన క రీం అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నా డు. ఈక్రమంలో బుధవారం వ్యవసాయ పను ల నిమిత్తం ఇల్లంద శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలో పడటంతో డ్రైవర్ రవి ఎగిరి వెనకటైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె అక్ష య, కుమారుడు అఖిల్ ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. కేడీసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా రజనీలతకేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.రజనీలత బాధ్యతలను నిర్వర్తించనున్నారు. బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ జి. రాజారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో వైస్ ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న రజనీలతకు చార్జీని అప్పగించారు. అధికారికంగా కళాశాల విద్యాకమిషనర్ త్వరలోనే కేడీసీ ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్గా రజనీలతను నియమించనున్నట్లు సమాచారం. ఇన్చార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం కొద్దిరోజులపాటు ఇన్చార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కేయూ ఫైనాన్స్ ఆఫీసర్గా బాధ్యతలను నిర్వర్తించిన తోట రాజయ్య బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో రెగ్యులర్గా కేయూకు ఫైనాన్స్ ఆఫీసర్ను నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూనివర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరైన డిప్యూటీ రిజిస్ట్రార్ ఉంటే ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించేవారు. ఉద్యోగ విరమణ పొందిన రాజయ్య కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంకు ఫైనాన్స్ ఆఫీసర్ బాధ్యతల చార్జీని బుధవారం అప్పగించారు. ‘అది ఫేక్.. స్పందించకండి’కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి పేరు, ప్రొఫైల్ పిక్చర్తో సాయం కోరుతూ మెసేజ్లు వస్తే స్పందించవద్దని బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి రామచంద్రదం ఒక ప్రకటనలో తెలిపారు. ఈవ్యవహారంపై కేయూ పోలీస్టేషన్లో, సైబర్క్రైమ్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’
నయీంనగర్: ఎస్సెస్సీ పరీక్ష ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు గ్రేడ్ పాయింట్లతో పాటు మార్కుల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విజయదుందుభి మోగించినట్లు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి తెలిపారు. 590 మార్కులతో మేకల శ్రీనిత్య ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎ.సాయిసిరి 586 మార్కులు, బొల్లారపు గౌతమ్క్రిస్, పి.అహన్య 584, జి.రిషిక, కె.శ్రీనిధి 583, అయోషా తబుసమ్, పి.హృతిక్ రెడ్డి 581, పి.శృతిక, జి.పవన్ విదేష్, డి.సబరీష్ 580 మార్కులు సాధించారు. 579 నుంచి 570 మార్కుల వరకు 46 మంది, 569 నుంచి 560 మార్కుల వరకు 44 మంది, 559 నుంచి 550 మార్కుల వరకు 50మంది, 549 నుంచి 540 మార్కుల వరకు 61మంది విద్యార్థులు, 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 251 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్ల్లో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించినట్లు వివరించారు. విజయపరంపర కొనసాగించిన విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి, తల్లిదండ్రులకు పాఠశాలల ప్రిన్సిపాళ్లు పిల్లలమర్రి చంద్రశేఖర్, సంధ్య, జేపీ రావు, ఉపాధ్యాయ బృందం అభినంధనలు తెలిపారు. -
పుష్కరాల పనుల్లో వేగం పెంచండి
కాళేశ్వరం: ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి నది పుష్కరాల పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేలతో కలిసి పుష్కరాల పనులను పరిశీలించారు. ముందుగా త్రివేణిసంగమం వద్ద వీఐపీ (జ్ఞాన సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న సరస్వతి మాత విగ్రహం, ఘాటు విస్తరణ పనులు, మరుగుదొడ్లు, శ్రాద్ధమండపం నిర్మాణాలను పరిశీలించారు. మంత్రికి ఎస్పీ వీఐపీ ఘాటుకు వచ్చే రోడ్డు మ్యాపును వివరించారు. గోదావరిలో నీటిమట్టం పుష్కరాల నాటికి తగ్గుతుందా? అని ఇరిగేషన్శాఖ ఈఈ తిరుపతిరావును అడుగ్గా కొంత తగ్గుతుందని, అయితే భక్తులకు ఇబ్బంది లేదన్నారు. సరస్వతిమాత విగ్రహం బేస్ కింద రివిట్మెంట్ కరెక్ట్ ఉందా అని ఎండోమెంట్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ ఘాటు వద్ద టెంట్సిటీ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఇక్కడ టెంట్సిటీని మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నామని, జాయ్రైడ్స్ కోసం కన్నెపల్లి వద్ద కాకుండా దేవస్థానం లేదా ఘాటు పరిసరాల్లో మూడు హెలిపాడ్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్కు తెలిపారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించండి పుష్కరాలకు వచ్చే భక్తులకు అందంగా కనిపించాలని, వ్యర్థాలు, చెత్తచెదారం లేకుండా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లుకు ఆదేశించారు. పుష్కరాల్లో పారిశుద్ధ్యం పెద్దపీట వేస్తుందని, ఎక్కువ సంఖ్యలో కూలీలను పెంచాలన్నారు. అలాగే ప్రధాన ఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు గోదావరిలో బండరాళ్ల తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మళ్లీ పుష్కరాల పనులు పరిశీలించేందుకు నిత్యం వస్తుంటానని, అధికారులు అందుబాటులో ఉంటూ పనులు పూర్తి చేయించాలన్నారు. అలాగే గోదావరిలో బోట్లు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలని, మరిన్ని బోట్లు పెంచి గంగపుత్రులకు ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం హరితహోటల్లో శాఖల వారీగా సమీక్ష చేశారు. మంత్రి వెంట సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఈఓ మహేష్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డి, నాయకులు కోట రాజబాపు, మాజీ ఎంపీపీ రాణిబాయి, అశోక్, శ్రీనివాసరెడ్డి, ఎల్.రాజబాపు, శకీల్, సత్యనారాయణ, జానీ, శ్యాందేవుడా తదితరులు పాల్గొన్నారు.భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం వద్దు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సరస్వతి నది పుష్కరాల పనులపై అధికారులతో సమావేశం -
పారదర్శకంగా ఎంపిక చేయాలి
దంతాలపల్లి: జిల్లాలో ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అ న్నారు. మండలంలోని బీరిశెట్టిగూడెంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా జాబితాలో ఉన్న ఇళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. అనర్హులు ఉంటే తొలగించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వివేక్రామ్, వెరిఫికేషన్ అధికారి వాహిని, ఎంపీఓ అప్సర్పాషా తదితరులు పాల్గొన్నారు. చిన్నగూడూరులో.. చిన్నగూడూరు: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వేను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో బుధవారం పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు, ఎంపీఓ రజిని తదితరులు ఉన్నారు. -
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
అందరి భాగస్వామ్యంతోనే ఉత్తమ ఫలితాలు సాధించాం కలెక్టర్ చొరవ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఉత్తమ బోధనతో నంబర్ వన్ స్థానం సాధించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివిన విద్యార్థులు భవిష్యత్ వివిధ రంగాల్లో రాణిస్తారు. పరీక్షల సమయంలో సహకరించిన పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – ఎ. రవీందర్రెడ్డి. జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలో 99.29శాతం విద్యార్థుల ఉత్తీర్ణత ● ‘టెన్త్’ ఫలితాల్లోనూ బాలికలదే హవా ● 99.39శాతం బాలికల ఉత్తీర్ణత ● 99.2శాతం బాలురు పాస్ మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా 99.29శాతం ఉత్తీర్ణత సాధించింది. 8,184 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 8,126 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 4,229మంది బాలురకు 4,195 మంది 99.2శాతంతో ఉత్తీర్ణులయ్యారు. 3,955 మంది బాలికలకు 3,931మంది 99.39శాతంతో పాస్ అయ్యారు. కాగా ఇంటర్ ఫలితాలను కొనసాగిస్తూ పదో తరగతి ఫలితాల్లోనూ బాలికల హవా కొనసాగింది. 2024 ఫలితాల్లో 94.62శాతం ఉత్తీర్ణతో జిల్లా 12వ స్థానంలో నిలువగా.. ప్రస్తుతం మొదటిస్థానంలో నిలిచింది. 100శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు.. జిల్లాలోని 8 మోడల్ స్కూళ్లు, 7 కేజీబీవీలు, 26 జెడ్పీ పాఠశాలలు, 5 బీసీ వెల్ఫేర్, 3 మైనార్టీ గురుకులాలు, 5 సోషల్ వెల్ఫేర్, 4 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే మినీ రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2,987మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. జూన్ 3నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. జూన్ 3ను నుంచి 13 వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. మే 16వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. లేట్ ఫీజు రూ. 50 ఫైన్తో జూన్ 1వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. -
అంకితభావంతో విధి నిర్వహణ
మహబూబాబాద్ రూరల్: జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులను బుధవా రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన అధికారులు తమ జీవితంలో ముఖ్యమైన భాగాన్ని పోలీసుశాఖకు అంకితం చేశారన్నారు. పదవీ విరమణ పొందిన వారిలో మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై పెద్దిరెడ్డి రమేశ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగం ఏఎస్సై భూక్య కిషన్, కొత్తగూడ ఏఎస్సై సోమ కుమారస్వామి, గంగారం హెడ్ కానిస్టేబుల్ స్వర్ణపాక పాపయ్య, డీసీఆర్బీ ఏఎస్సై మహమ్మద్ అహ్మద్ ఉన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, మోహన్, విజయ్ ప్రతాప్, సీఐలు నరేందర్, సరవయ్య, సత్యనారాయణ, ఆర్ఐలు నాగేశ్వరరావు, అనిల్ ఉన్నారు. -
వెక్కిరిస్తున్న శిలాఫలకం
గార్ల: గార్ల పట్టణ సమీపంలో పాకాల ఏరు ఏటా వానాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. అయితే ఆయా గ్రామాల విద్యార్థులు, ప్రజలు రైల్వే ట్రాక్ బ్రిడ్జి వెంబడి, చెక్డ్యామ్ మీదుగా గార్లకు చేరుకుంటారు. ఈక్రమంలో ప్రమాదాలు జరిగి మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాటి సీఎం కేసీఆర్తో బ్రిడ్జి నిర్మాణ గురించి మాట్లాడారు. దీంతో ఆయన రూ.15 కోట్లు నిధులు కేటా యించగా, అట్టహాసంగా బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం మార డంతో మళ్లీ మొదటికొచ్చింది. ఏటా మూడు నెలలు ఇబ్బంది.. ఏటా వానాకాలంలో పాకాల ఏరు మూడు నెలల పాటు చెక్డ్యామ్ పైనుంచి పొంగిపొర్లుతుంది. దీంతో రాంపురం, మద్దివంచ పంచాయతీల ప్రజలు, పాఠశాల విద్యార్థులు మండల కేంద్రమైన గార్లకు బయ్యారం, డోర్నకల్ మండలాల మీదుగా చుట్టూ తిరిగి వస్తారు. కొంతమంది విద్యార్థులు రైల్వే బ్రిడ్జి పైనుంచి భయంతో నడుచుకుంటూ గార్లకు వస్తుంటారు. అలాగే ఏటి చెక్డ్యామ్ కమ్ రోడ్డు దాడుతూ వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో పదుల సంఖ్యలో ఏటిలో పడి మృతి చెందారు. కాగా బ్రిడ్జి నిర్మాణం చేపడితే సౌకర్యవంతంగా ఉంటుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం మారడంతో.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుత ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత ప్రభుత్వం కేటాయించిన రూ.15 కోట్ల నిధుల విషయంపై సంబంధిత రాష్ట్ర మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి పాకాల ఏటిపై లోలెవెల్ చెక్డ్యామ్ నిర్మించడం వల్ల ఏటా వర్షాకాలంలో 3 నెలల పాటు ఇబ్బందులు పడుతున్నాం. విద్యార్థులు, ప్రజలు రైల్వేబ్రిడ్జి వెంట నడిచి గార్లకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు తప్పడం లేదు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు కృషిచేయాలి. – కట్టెబోయిన శ్రీనివాసరావు, మద్దివంచ గ్రామంపాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం పట్టించుకోని అధికారులు, పాలకులు వానాకాలంలో రహదారి లేక ప్రజల ఇబ్బందులు చెక్డ్యామ్ దాటుతూ ప్రాణాలు కోల్పోయిన పలువురు -
భూభారతి చట్టం రైతులకు చుట్టం
దంతాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకు చుట్టంలా పని చేస్తుందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలకేంద్రంలోని బాలా జీ ఫంక్షన్ హాల్లో మంగళవారం భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి కంటే అన్నివిధాలా భూ భారతి చట్టం మెరుగ్గా ఉంటుందన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ఈ చట్టం తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, నిజాం భూములు, నయీ మ్ భూములు కొట్టేసేందుకు ధరణి తెచ్చిందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో గ్రామాల్లో అధికారులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జూన్ నుంచి భూసమస్యలు పరిష్కరించనుండగా.. దంతాలపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మే నెల నుంచే సమస్యలు తీర్చనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, డీఏఓ విజయనిర్మల, అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఏడీఏ విజయచంద్ర, తొర్రూ రు ఆర్డీఓ గణేశ్, తహసీల్దార్ సునీల్కుమార్, ఆర్ఐలు తదితరులు ఉన్నారు. -
రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్గా తీసుకోవాలి...
పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి. – డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు -
విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాధ్: స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో మరుగుదొడ్ల నిర్మా ణం, పలు అంశాలపై సంబంధిత అధికారులతో స మీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం చేట్టాలన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఏఓ విజయనిర్మల, డీఈఓ రవీందర్రెడ్డి, డీపీఓ హరిప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణే ఎజెండా కావాలి
నెహ్రూసెంటర్: రాజ్యాంగ పరిరక్షణే ప్రతి ఒక్కరి ఎజెండా కావాలని జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్ గద్దర్ ప్రాంగణంలో మంగళవారం మాలమహానాడు ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ పరిరక్షణ సదస్సు’ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సుమారు 52 వేల మంది ఉద్యమకారులు ఉన్నారని, వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్పై మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్పై చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దయాకర్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, హరికోట్ల రవి, సూర్నపు సోమయ్య, మైస శ్రీనివాస్, బి.అజయ్సారథిరెడ్డి, దార్ల శివరాజ్, గుగ్గిళ్ల పీరయ్య, అశోద భాస్కర్, గుగులోత్ కిషన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– IIలోuఒక్కసారి ఫెయిలైతే జీవితమే ముగిసినట్టు కాదు ● దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్తో ముందుకెళ్లొచ్చు ● పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు ● ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్ ● పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు ఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు. మీరు (పరీక్షల్లోనైనా, ఇతర అంశాల్లో అయినా) విఫలమైతే, ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వైఫల్యం అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని అర్థం. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం. అది మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది. – ఏపీజే అబ్దుల్ కలాంసాక్షి, వరంగల్: చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు...జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పేమీ కాదు...అందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఫెయిల్ అవుతారు...కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు...జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, ఆవేశమే. ఇవి సాధిస్తామన్న ఆశను చంపకూడదు. వారం క్రితం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో తప్పిన కొందరు విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకున్నా దరిమి లా..పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడవుతున్న నేపథ్యంలో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఓ స్నేహితుడిలా...గురువులా మెదిలి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. భవిష్యత్పై భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయం విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు 42,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల సమయంలో ర్యాంక్లు రాలేదని కొందరు... మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు...ఫెయిల్ అయ్యామని మరికొందరు మానసిక ఒత్తిడికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కంటే కూడా వారి ఫలితాలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఈ తరహా ఘటనలకు అవకాశం ఇస్తోంది. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించొద్దని సూచిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చడం వల్ల పిల్లలు మానసిక వ్యథకులోనై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అంటున్నారు.ఇవీ మరవొద్దు... ● ఫలితాలు ఎలా వచ్చినా విద్యార్థులు పాజిటివ్గా తీసుకోవాలి. విద్యార్థులతో పాటు కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు, చుట్టుపక్కల వారు ప్రవర్తించే తీరు ప్రభావం చూపుతుంది. ● ఫెయిలైన విద్యార్థి ఇంతటితోనే అంతా అయిపోయిందనే భావనను వీడాలి. ఓ పరీక్షలో మాత్రమే ఫెయిలయ్యామని, జీవితంలో కాదన్న విషయాన్ని గ్రహించాలి. ● ముఖ్యంగా క్షణికావేశానికి గురికాకూడదు. తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. తమలోని బాధను స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకోవడంతోపాటు నెగెటివ్ ఆలోచనలను దూరం పెట్టాలి. ● ఫెయిలైనా జీవితంలో విజేతలుగా నిలిచిన వారి గురించి తెలియజేయాలి. ఆలోచిస్తూ బాగా చదివేలా వారిని ప్రోత్సహించాలి. ● ఇన్ని చెప్పినా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.న్యూస్రీల్జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు హనుమకొండ 12,010వరంగల్ 9,237మహబూబాబాద్ 8,194జనగామ 6,238 జేఎస్ భూపాలపల్లి 3,449 ములుగు 3,134 -
స్థిరమైన వ్యవసాయానికి ‘దేశీ’ దోహదం
మహబూబాబాద్ రూరల్: స్థిరమైన వ్యవసాయానికి డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్ఫుట్ డీలర్స్ (దేశీ) కార్యక్రమం దోహదపడుతుందని డీఏఓ విజయనిర్మల, మల్యాలకేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాలతి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దేశీ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. దేశీ కార్యక్రమం సాంకేతిక జ్ఞానం, నైపుణ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఎరువుల వినియోగం, పురుగుమందు ల ఉపయోగం, పర్యావరణ సంరక్షణ తదితర అంశాలపై డీలర్లు శిక్షణ పొందారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న డీలర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. రిటైర్డ్ ఏడీఏ రామచందర్, డీఏఓ కార్యాలయ ఏడీఏ మురళి, శాస్త్రవేత్తలు కిశోర్ కుమార్, రాంబాబు, క్రాంతికుమార్ ఉన్నారు. రిసోర్స్పర్సన్ల ఎంపికమహబూబాబాద్ అర్బన్: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ ఆదేశాల ప్రకారం ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో అన్ని సబ్జెక్ట్లకు 191మంది రిసోర్స్పర్స న్లను ఎంపిక చేశామని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ని అనంతారం మోడల్ స్కూల్లో మంగళవారం ఇంటర్వ్యూలు, డెమోలు నిర్వహించారు. డీఈఓ హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి విద్యను బలోపేతం చేయడానికి రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశామన్నారు. ఎంపికై న ఉపాధ్యాయుల వివరాలను బుధవారం ప్రకటిస్తామన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మధుమహబూబాబాద్ అర్బన్: ఖమ్మంలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలో జిల్లాలోని చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన పట్ల మధును రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా పట్ల మధు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేపడుతున్నందుకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారన్నారు. ఈమేరకు రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గుండెపోటుతో ఏఎస్సై హఠాన్మరణంమరిపెడ/గార్ల: మరిపెడ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై హనుమంతు నాయక్ (58) గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందారు. పిల్లల చదువుల కోసం ఖమ్మం పట్టణంలోని బల్లెపల్లిలో నివాసం ఉంటున్న ఆయన రోజు మాదిరిగానే మరిపెడలో విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. కాగా, ఆయన మరణంతో స్వగ్రామమైన గార్ల మండలం మూడుతండాలో విషాదం అలుముకుంది. హనుమంతునాయక్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
బయ్యారం : వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం మండలంలోని కస్తూరినగర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరినగర్ గ్రామానికి చెందిన కేలోత్ రంగ్య (52) ఎండ తీవ్రతకు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఐనవోలులో వృద్ధురాలు.. ఐనవోలు : మండలంలోని నందనం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వడదెబ్బతో మృతిచెందింది. నందనం గ్రామానికి చెందిన యాకర సాలమ్మ (75) కూలీ పనులు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూరగాయలు అమ్ముకోవడానికి ఇంట్లో నుంచి వెళ్లింది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మధ్యాహ్నం ఇంటికి చేరుకుని స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత చుట్టు పక్కల వాళ్లు గమనించగా అప్పటికే ఆమె మృతి చెందింది. వడదెబ్బతో మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని మృతురాలి బంధువులు కోరారు. డీఏఓ విజయనిర్మలకు ఆత్మ పీడీగా పదోన్నతిమహబూబాబాద్ రూరల్: మానుకోట జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల వరంగల్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ప్రాజెక్టు డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు మానుకోట జిల్లా వ్యవసాయ అధికారిగా కొనసాగనున్నారు. శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ..హన్మకొండ కల్చరల్ : నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాల అంకురార్పణ పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వే దపండితులు గణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, రుత్విగ్వరణ, వాస్తుయాగం, గణపతిహోమం, సుదర్శనహోమం, శ్రీభద్రకా ళీ పరివస్యా, చండీహోమం, నీరాజన మంత్రపుష్పం జరిపారు. అనంతరం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరై అమ్మవారి సన్ని ధిలో జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం అంకురార్పణ పూజలు నిర్వహించి సర్వతోభద్ర, నవగ్రహ, వాస్తు, యోగినీ, క్షేత్రపాలమండల లేఖనం, ధ్వజాధివాసం చేశారు. ఉదయం శ్రీగణపతి సేవ , సా యంత్రం శ్రీసుబ్రహ్మణ్యసేవ నిర్వహించారు. అంకురార్పణ పూజలకు ఉమ్మడి జిల్లా మున్నూ రుకా పు సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. -
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
హన్మకొండ : వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు, మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు నడుం బిగించారు. అందులో భాగంగా మే 5నుంచి జూన్ 13వ తేదీ వరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల వ్యాప్తంగా 50కి పైగా బృందాలను నియమించారు. ప్రతి బృందంలో విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, కళాశాల విద్యార్థులు, అభ్యుదయ రైతులు ఉంటారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ పరిశోధ సంస్థలు, వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలోని శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రభుత్వ అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహా సంచాలకులు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి మాట్లాడుతూ.. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సలహాలతో పాటు వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడానికి అవసరమైన సూచనలు, యాంత్రీకరణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు స్వయంగా పాల్గొనడం ద్వారా గ్రామీణ స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను స్వయంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మే 5నుంచి జూన్ 13వరకు కార్యక్రమాలు -
ఇంటర్ వర్సిటీ సాఫ్ట్బాల్ టోర్నీకి మహిళా జట్టు
కేయూ క్యాంపస్ : ఏపీలోని నెల్లూరులో గల విక్రమసింహపురి యూనివర్సిటీలో ఈనెల 30నుంచి మే 5వ తేదీవరకు జరుగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ ఉమెన్ జట్టు పాల్గొననుందని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో ఎం.అనుబిందు (న్యూసైన్స్ డిగ్రీ కాలేజీ హనుమకొండ), టి.స్పందన (మాతృశ్రీ, డిగ్రీ కాలేజీ, భీమారం), ఎ.అనూష (వీసీపీఈ, బొల్లికుంట), ఎస్.సుమిత్రా (కాకతీయ డిగ్రీ కాలేజీ, హనుమకొండ), జి.పూజ, సీహెచ్ రమ, ఆర్.భాగ్యశ్రీ (యూసీపీఈ కేయూ), జె.దుర్గాభవాని, ఎన్.సాయిప్రసన్న (వీసీపీఈ, బొల్లికుంట), ఎ.నందిని, బి.అరవింద (టీజీటీడబ్ల్యూఆర్డీసీ, కొత్తగూడెం), పి.సొనాలి (టీజీడబ్ల్యూఆర్డీసీ, ఆసిఫాబాద్), పి.నాగలక్ష్మి (ఆర్డీ కాలేజీ, హనుమకొండ), ఎన్.శైలజ (యూసీపీఈ కేయూ, ఖమ్మం), ఎ.అర్చన (వరంగల్ కిట్స్), టి.శ్యామల (యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్ కాలేజీ హనుమకొండ) ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈ జట్టుకు కోచ్గా ఎ.రాజేష్, మేనేజర్గా పి.లక్ష్మిపతి వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. -
పురుగుల మందు తాగి యువకుడి బలవన్మరణం
జనగామ రూరల్ : పురుగుల మందు తాగి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జనగామ మండలంలోని గోపిరాజుపల్లిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గోపిరాజుపల్లికి చెందిన పిడుగు అనిల్ (22) వ్యవసాయం చేసుకుంటు కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాడు. వ్యవసాయంతో పాటు ఇతర కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామశివారులో పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే జనగామ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా మృతికి గల పూర్తి విషయాలు తెలియరాలేదు. అయితే విషయం తెలుసుకున్న మృతుడి అన్న పిడుగు రమేశ్ తమ్ముడి మరణం తట్టుకోలేక అదే ఆస్పత్రిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. డాక్టర్లు వెంటనే చికిత్స అందజేయగా ఎలాంటి ప్రమాదం లేకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై, పోలీసులు తెలిపారు. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్యాయత్నం -
మనకెప్పుడు క్రికెట్ ‘వైభవం’..?
ఇవీ సమస్యలు..అసౌకర్యాల నడుమ క్రికెట్ శిక్షణ● వరంగల్ క్రికెట్ సంఘానికి సొంత మైదానం కరువు ● ప్రాక్టీస్కు ప్రైవేట్ పిచ్లను ఆశ్రయించాల్సిందే..వరంగల్ స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా వైభవ్ సూర్యవంశి.. నిన్నటి వరకు ఎవరో తెలియని వైభవ్, తన సత్తా చాటి ఐపీఎల్లో కొత్త చరిత్రను సృష్టించాడు. 14 ఏళ్ల కుర్రాడు 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్లు మొత్తంగా 101 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలను ఆకట్టుకున్నాడు. చిన్న వయస్సులోనే వైభవ్ ఐపీఎల్ సెంచరీ కొట్టడంతో డీఎస్ఏలో శిక్షణ పొందుతున్న పలువురు యువ క్రికెటర్లను ‘సాక్షి’ పలకరించింది. వైభవ్ ఆట తీరు పై అడుగుతూ, వీళ్లకేం కావాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. వైభవ్ ఆటను మరిచిపోలేనురాజస్తాన్ రాయల్స్, గుజరాత్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ ఆట ఆద్యంతం కట్టిపడేసింది. అంతకుముందు ఆడిన ఆటలో అంతగా ఆడని వైభవ్, ఈ మ్యాచ్లో సిక్స్లు, ఫోర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. పది పూర్తికాగానే హనుమకొండకు వచ్చి క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు అండర్–19 నేషనల్స్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మ్యాచ్లో కేయూ టీం కెప్టెన్గా ఆడాను. ప్రాక్టీస్కు మరింత వసతులు కల్పిస్తే బాగా రాణిస్తాం. – ఎం.నవ్యనాయక్, డిగ్రీ, కేడీసీ హనుమకొండ● పట్టుదల, ప్రతిభ, సత్తా ఉన్న వైభవ్లు మనవద్దా లేరా..మనకెప్పుడు క్రికెట్ వైభవం అంటూ వరంగల్ క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అనుబంధంగా వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నప్పటికీ ఒక్క వైభవ్ను తయారు చేయలేకపోవడం బాధాకరం. ఇన్నేళ్లలో ఒక్కరూ వరంగల్ నుంచి క్రికెట్ వైభవాన్ని ప్రపంచానికి ఎందుకు ఎలిగెత్తి చాటలేదు. అన్నింటికీ ఒకే సమాధానం క్రికెట్కు సొంత మైదానమే లేకపోవడం. ● హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్లో క్రికెట్ స్టేడియం లేకపోవడం ఇక్కడి క్రికెట్ పెద్దల నిర్లక్ష్యానికి నిదర్శనం. హెచ్సీఏ అధ్యక్షుడి హోదాలో అనేక మంది వరంగల్కు వచ్చి వెళ్లారు. వచ్చిన ప్రతీసారీ అంతర్జాతీయ స్థాయిలో వరంగల్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ప్రకటనలు ఇవ్వడం, అవీ కాలగర్భంలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ● హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిత్యం క్రికెట్లో అనేక మంది శిక్షణ పొందుతున్నారు. అయితే డీఎస్ఏ అందించే శిక్షణ కేవలం గల్లీలో ఆడేంత వరకు మాత్రమే సరిపోతుంది. జేఎన్ఎస్లో సైతం ఆర్ఫో టర్ప్ పిచ్, లైటింగ్, బౌలింగ్ మిషన్ వంటి అధునాతన పరికరాలు అందుబాటులో లేవు. దీంతో కోచ్ సాధారణ శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. సాధారణ గ్రౌండ్లో ప్రాక్టీస్..రెండున్నర ఏళ్లుగా డీఎస్ఏ కోచ్ అఫ్జల్ వద్ద శిక్షణ తీసుకుంటున్న. ప్రతి రోజు ప్రాక్టీస్ చేసేది సాధారణ గ్రౌండ్లో.. టోర్నమెంట్లకు వెళ్లినప్పుడు అక్కడ పిచ్ బాగుంటుంది. దీంతో అక్కడ బ్యాటింగ్లో పట్టు దొరికే లోపే వికెట్లను కోల్పోవల్సి వస్తోంది. అండర్–17 కేటగిరీలో రెండు స్టేట్ మీట్లు ఆడాను.ఒక నేషనల్స్కు ప్రాబబుల్స్గా ఎంపికయ్యాను. – డి. శ్రీసహస్రరాజ్, హనుమకొండప్రత్యేక స్టేడియం ఉండాలి ప్రపంచంతో పోటీపడి ఆడాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. సాధనకు సరిపడా వసతులు ఉండాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రికెట్కు ప్రత్యేకంగా సొంత స్టేడియమే లేకపోవడం బాధాకరం. రోజూ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్కు బరిలో దిగే గ్రౌండ్ మరోలా ఉంటే ఆడేందుకు కష్టపడాల్సి వస్తోంది. – మహ్మద్ అఫ్జల్, క్రికెట్ కోచ్, డీఎస్ఏచీకటి పడితే ఇంటికి వెళ్లాల్సిందేరెండేళ్లుగా క్రికెట్లో శిక్షణ పొందుతున్నాను. స్కూల్ నుంచి ఇంటికెళ్లి గ్రౌండ్కు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది. గంట ప్రాక్టీస్ చేయగానే చీకటి పడుతుంది. మరో గంట పాటు ప్రాక్టీస్ చేద్దామనుకుంటే అంతా చీకటే. ప్లడ్లైట్లు ఏర్పాటు చేస్తే ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయొచ్చు. టర్ప్ పిచ్, ప్లడ్ లైట్స్, బౌలింగ్ మిషన్ లాంటి అధునాతన సౌకర్యాలు కల్పిస్తే వరంగల్ నుంచి కూడా వైభవ్లు పుట్టుకొస్తారు. – ఎండీ అమన్, హనుమకొండఅధునాతన వసతులు కల్పించాలి మూడేళ్లుగా క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్న.అండర్–14 లో రెండు స్టేట్ మీట్లు ఆడాను. బ్యాట్ పట్టినప్పటి నుంచి నేను ఇక్కడే ఇరుకై న నెట్ ప్రాక్టీస్ చేస్తున్నా. టోర్నమెంట్లు ఉన్నప్పుడు ప్రైవేట్ మైదానాల్లో ఆడుతుంటాము. ఇక్కడ ప్రాక్టీస్ చేసి, మైదానాల్లో ఆడడం ఇబ్బందిగా ఉంటుంది. అధునాతన బౌలింగ్ మిషన్, టర్ప్ పిచ్ ఇతర వసతులు అందుబాటులో ఉంటే మా టీంలోనూ ఎందరో వైభవ్లు ఉన్నారు. – విదాత్శర్మ, హనుమకొండఏడాది నుంచి ప్రాక్టీస్ లేదుఇంతకుముందు కాకతీయ మెడికల్ కాలేజీ మైదానంలో శిక్షణ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు వారు అనుమతి నిరాకరించడంతో ఏడాది నుంచి క్రీడాకారులకు ప్రాక్టీస్ లేదు. బౌలింగ్ మిషన్, ఆస్ట్రో టర్ప్ పిచ్ ఉన్నప్పటికీ సొంత మైదానం లేకపోవడం వల్ల మెరుగైన శిక్షణ ఇవ్వలేక పోతున్నాం. వరంగల్లో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు హెచ్సీఏ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వాలను అనేక సార్లు వినతి పత్రాలు, ప్రతిపాదనలు పంపించాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఉంటే ప్రతిభ గల క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. – చాగంటి శ్రీనివాస్, కార్యదర్శి, వరంగల్ క్రికెట్ సంఘం -
మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● వరంగల్ జోనల్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్యతొర్రూరు : ఉమ్మడి వరంగల్ జిల్లాను మలేరియా రహితంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని ఉమ్మడి జోనల్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ ఇ.నాగయ్య పేర్కొన్నారు. జాతీయ కీటక జనిత నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ల్యాబ్, రికార్డులను పరిశీలించారు. ప్రై డే– డ్రై డే కార్యక్రమ తీరుతెన్నులపై ఆయన ఆరా తీశారు. పెద్దవంగర మండలం పోచారంలోని డెంగీవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఇంటిని సందర్శించి వారితో మాట్లాడారు. అనంతరం నాగయ్య మాట్లాడుతూ మలేరియా కేసులను సకాలంలో గుర్తించి ప్రాణాలు పోకుండా ఉండేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి జ్వలిత, వైద్యులు మీరాజ్, నందన, ఆరోగ్య సిబ్బంది కుసుమ విద్యాసాగర్, వనాకర్రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు. -
మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి
● ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ హన్మకొండ : మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజా సంఘాల నాయకులు మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా శాంతి చర్చల కమిటీ బాధ్యులు సోమ రామ్మూర్తి, గోర్ సభ జాతీయ అధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, ఆదివాసీ, గిరిజన, దళిత ప్రజా, పౌర సంఘాల బాధ్యులు మాట్లాడారు. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టి కార్పొరేట్లకు ఖనిజ సంపద అప్పగించే కుట్రలో భాగమే ఆపరేషన్ కగార్ అని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, గిరిజనులను చంపడాన్ని వారు ఖండించారు. శాంతి చర్చలకు పిలవాలని మావోయిస్టు పార్టీ ప్రతినిధులు అడుగుతుంటే వారిని గౌరవించి పిలువకుండా తుదిముట్టించే దాకా వదలబోమనడం దుర్మార్గమన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలను నిర్మూలించే పద్ధతిని మోదీ సర్కారు కొనసాగిస్తోందన్నారు. భారత్ సమ్మిట్లో సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, ఆదివాసీ, గిరిజన హక్కులపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు చేస్తే సరిపోదనీ, ఆదివాసీలపై జరుగుతున్న దాడిని ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రజా సంఘాల నాయకులు సిద్దబోయిన లక్ష్మినారాయణ, బాదావత్ రాజు, రాజారపు భాస్కర్, జిలకర శ్రీనివాస్, బొట్ల భిక్షపతి, నున్న అప్పారావు, పోరిక ఉదయ్ సింగ్ నాయక్, సమ్మయ్య రాథోడ్, కరుణాకర్ నాయక్, అజ్మీరా వెంకట్, నలిగంటి ప్రసాద్, వెంగల్ రెడ్డి, చావా రవి, పాలకుర్తి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ జాబితా క్రాస్ చెక్
హసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. ఎంపిక చేసిన జాబితాను మళ్లీ క్రాస్ చెక్ చేస్తున్నారు. జాబితాలో ఉన్న లబ్ధిదారులు అర్హులా? కదా? అని నిర్ధారించడానికి మళ్లీ అధికారులు ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రత్యేకాధికారులు సర్వేలో నిమగ్నమయ్యారు. ఇందిరమ్మ కమిటీలదే బాధ్యత .. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించారు. ఆయా గ్రామాలు, డివిజన్ల్లో ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను స్థానిక ఎమ్మెల్యేకు అప్పగించగా, అదే జాబితాను అధికారులకు అందజేశారు. అనర్హులుగా ఉన్నట్లు తేలితే వారి పేర్లను తొలగిస్తున్నట్లు సమాచారం. 600 ఎస్ఎఫ్టీ దాటొద్దు సొంత స్థలం ఉండి 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకున్న వారు పేదవాడు కాదని వారికి పథకం వర్తించదని అధికారులు చెబుతున్నారు.దీంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న పెంబర్తిలో ఓ లబ్ధిదారుడు 600 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీంతో అతడు అనర్హుడని గుర్తించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అనర్హులకు పథకం వర్తింపజేస్తే ఆ బాధ్యత స్థానిక పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓదేనని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కమిటీలదే ఎంపిక బాధ్యత 600 చదరపు అడుగులు దాటితే.. అనర్హులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అధికారులే బాధ్యులుమూడు కేటగిరీలుగా దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిని మూడు కేటగిరీలుగా విభజించారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు లేని వారిని ఎల్–1 కేటగిరిలో, స్థలంలో గుడిసె, పూరి గుడిసె, మట్టి ఇళ్లు, రేకుల ఇళ్లున్న వారిని సైతం ఎల్–1 కేటగిరిగా విభజించారు. సొంతస్థలం లేని వారిని ఎల్–2 కేటగిరిలో, సొంత ఇళ్లు ఉండి, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్–3 కేటగిరిలో పొందుపరిచారు. ఇక్కడ ఎల్–1 కేటగిరిలో ఉన్నవారికే ప్రాధాన్యత కల్పించారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
వెంకటాపురం(కె) : మండల కేంద్రంలోని జక్కులవారి వీధికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 24వ తేదీన అదృశ్యం కాగా, మంగళవారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. జక్కుల వారి వీధికి చెందిన వాసం రవికిరణ్ కుమార్ (40) మిషన్ భగీరథ పథకంలో పంప్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేక కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ నెల 24వ తేదీన భగీరథ నీరు వదిలి పెట్టి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కాగా రవి కిరణ్ కుమార్ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రవికిరణ్ కుమార్ తల్లి సాలమ్మ అతడి జాడ వెతికిన కనిపించక పోవడంతో ఈ నెల 25వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం వీఆర్కే పురం గ్రామ సమీపంలోని పాలెం వాగు ప్రాజెక్టు కాల్వ సమీపంలో మృతదేహం లభ్యమయ్యిందని పేర్కొన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యజమాని అంటూ మెసేజ్..
వరంగల్ క్రైం : యజమాని పేరుతో ఫేక్ మెసేజ్ చేసి కోట్లు కాజేసిన సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసినట్లు వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఏసీపీ సీహెచ్.ఆర్.వి. ఫణీందర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రతాప్ఘడ్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్.. హనుమకొండలోని ప్రముఖ హచరీస్ సంస్థలో పనిచేస్తున్న గుమాస్తాకు మార్చి 19వ తేదీన ఓ నంబర్ నుంచి ఫోన్ చేసి ‘నేను మీ యజమానిని.. ఇది నా కొత్త ఫోన్ నంబర్ అని, ఈ నంబర్ సేవ్ చేసుకొమ్మని’ సదరు సంస్థ గుమాస్తాకు వాట్సాప్లో మెసేజ్ పంపించాడు. దీంతో తన యజమాని నంబర్ అని భ్రమపడి సంస్థ గుమాస్తా తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. మరుసటి రోజు గుమాస్తా తాను సేవ్ చేసుకున్న నంబర్కు ఫోన్ చేయగా నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత చేస్తానని సైబర్ నేరగాడు సమాధానం చెప్పాడు. అనంతరం నిందితుడు గుమాస్తాకు ఫోన్ చేయడంతో యజమానే ఫోన్ చేస్తున్నాడని ఫోన్ తీయడంతో ఎక్కడ ఉన్నావని అడిగి తన బ్యాంక్ లావాదేవీలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి తాను చెప్పిన అకౌంటుకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయమనడంతో గుమాస్తా నిందితుడు చెప్పిన బ్యాంక్ ఖాతాకు రెండు దఫాలుగా మొత్తం రూ.1.68 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరోమారు నిందితుడు ఫోన్ చేయడంతో నిందితుడి మాటతీరును తప్పుపట్టి గుమాస్తా అనుమానంతో తన సంస్థ యజమానికి సంబంధించిన వ్యక్తిగత నంబర్కు ఫోన్ చేశాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చి యజమాని, తమ గుమాస్తా సైబర్ నేరగాడి చేతిలో మోసపోయినట్లుగా గుర్తించి వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగంలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ యాసిన్, ఎస్సైలు చరణ్, శివ, కానిస్టేబుల్లు శివ, జహూర్ను ఏసీపీ అభినందించారు. రూ.1.68 కోట్లు కాజేసిన సైబర్ నేరస్తుడి అరెస్ట్ -
‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
తొర్రూరు: ‘భూ భారతి’ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. భూ భారతి చట్టంపై మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ గణేశ్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో భూ భారతి–2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. గతంలో తహసీల్దార్ పరిష్కరించే చిన్న చిన్న భూ సమస్యలు సైతం కలెక్టర్ దృష్టికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పరిష్కారంలో జాప్యం జరిగేదన్నారు. భూ భారతిలో దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుందన్నారు. కొత్త చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. ఆర్డీఓ నిర్ణయాన్ని కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయాన్ని ల్యాండ్ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చన్నారు. భూ భారతి చట్టంతో పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ విజయ్చంద్ర, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ పూర్ణచందర్రెడ్డి, ఏఓ రాంనర్సయ్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం.. పెద్దవంగర: భూ భారతి చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేకూరుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై తహసీల్దార్ మహేందర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. రైతుల దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. మేధావులు, అధికారులు, నిపుణుల సలహాలతో భూ భారతి చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ప్రస్తుత చట్టంతో ఎలాంటి ఇబ్బందులు, ఆలస్యం, పొరపాట్లకు తావులేకుండా రూ పొందించారన్నారు. అనంతరం మండల కేంద్రంలో ని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేశ్, ఏడీ ఎస్ఎల్ఆర్ నర్సింహమూర్తి, ఎంపీడీఓ వేణుమాధవ్, ఏడీఏ శ్రీనివాస్, ఏఓ స్వామి నాయక్, ఏపీఎం రమణాచారి, ఆర్ఐ లస్కర్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఏఈఓలు, నాయకులు, నెహ్రూనాయక్ ఉన్నారు, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
మార్కెట్కు పోటెత్తిన ధాన్యం, మక్కలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మార్కెట్కు సోమవారం, ధాన్యం, మక్కలు పోటెత్తాయి. రైతులు అధిక మొత్తంలో యార్డుకు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్లోని షెడ్లన్నీ సరుకులతో నిండిపోయాయి. స్థలం సరిపోకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో రాశులుగా పోసుకున్నారు. కాగా 6,622 బస్తాల (3,973 క్వింటాళ్లు) మక్కలు, 3,533 బస్తాల (2,297 క్వింటాళ్లు) ధాన్యం కొనుగోలు చేశారు. అదే విధంగా మిర్చి 4,451 బస్తాల (1,783 క్వింటాళ్లు) మేరకు కొనుగోలు జరిగాయి. 6,622 బస్తాల మక్కలు, 3,533 బస్తాల ధాన్యం కొనుగోలు -
విద్యార్థులను సంసిద్ధం చేయాలి
మహబూ బా బాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విద్యను ప్రవేశపెట్టనున్నారని, అందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు సంసిద్ధం చేయాలని జిల్లా గిరిజనశాఖ అధికారి దేశీరాం నాయక్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏఐపై ఉపాధ్యాయులకు సోమవారం శిక్షణను ప్రారంభించారు. ఆన్లైన్లో శిక్షణ తీసుకుంటున్న ఉపాధ్యాయుల ఇళ్లను దేశీరాంనాయక్ సందర్శించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా మొదటిరోజు రెగ్యులర్ ఉపాధ్యాయులు 14మంది, సీఆర్టీలు 19 మంది హాజరయ్యారని, గణిత శాస్త్రంపై శిక్షణ జరిగిందన్నారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ఏసీ ఏంఓ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేడు రాజ్యాంగ పరిరక్షణ సభమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహిస్తున్నామని మాలమహానాడు జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ సభకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ హాజరుకానున్నట్లు తెలిపారు. సభకు ప్రజలు, ప్రజా స్వామికవాదులు, మేధావులు, విద్యార్థి, ఉద్యో గ, ఉపాధ్యాయ వర్గాలు సబ్బండ కులాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చిట్టిమళ్ల మహేశ్, రాష్ట్ర కార్యదర్శి దార కుమార్, నాయకులు కందుకూరి వెంకటాద్రి, ఉసిల్ల ఉదయ్, రాకేశ్, భరత్ తదితరులు పాల్గొన్నారు. వినతులను సత్వరమే పరిష్కరించాలి● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ● ప్రజావాణిలో 78 అర్జీల స్వీకరణ మహబూబాబాద్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకుని వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. వినతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 78 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆర్డీఓ కృష్ణవేణి, సీపీఓ సుబ్బారావు, డీసీఓ వెంకటేశ్వర్లు, డీహెచ్ఎస్ఓ మరియన్న ఉన్నారు. నేటి నుంచి ‘భద్రకాళి’ కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఏప్రిల్ 29 నుంచి మే 10వరకు భద్రకాళి భద్రేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం అంకురార్పణ పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఒక్కోరోజు వివిధ కుల సంఘాల వారు అమ్మవారి సేవల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చినట్లు ఆరోజున వారి నిర్వహణలోనే పూజా కార్యక్రమాలు జరుగుతాయని ప్రతీరోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 7 గంటలకు అత్యంత వైభవంగా వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 2న జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనదల్చిన భక్తులు 516 రూపాయలు చెల్లించాలన్నారు. -
అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ నాయకుడి మృతి
● ధర్మకంచలో విషాద ఘటనజనగామ : జనగామ పట్టణం ధర్మకంచకు చెందిన పానుగంటి ప్రవీణ్ సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సువార్త ఫిర్యాదు మేరకు సీఐ దామోదర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంధువుల వివాహ వేడుకలకు ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఈ నెల 24న హైదరాబాద్కు వెళ్లారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ప్రవీణ్ జనగామకు వచ్చాడన్నారు. సభకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, భార్యకు ఫోన్ చేసినట్లు చెప్పారు. సోమవారం ప్రవీణ్కు అతని భార్య ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయక పోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఉరేసుకుని ఉన్నట్లు భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలుపగా, అందరు జనగామకు వచ్చారు. భర్త చనిపోయిన విధానం, అక్కడి పరిస్థితులు సహజ మరణంగా లేదని మృతుడి భార్య సువార్త ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి తలుపులు తీసి ఉండడం, లాక్ కూడా వేసుకోక పోవడం అనుమానంగా ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంతా పిరికివాడు కాదని, ప్రవీణ్ మృతిపై సెల్ఫోన్ కాల్ డాటా ఆధారంగా సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని పేర్కొన్నారు. సీఐ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో పంచనామా చేసి, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలో విషాదం బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ అనుమానాస్పద మృతితో కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీ, మిత్రులు విషాదంలో మునిగి పోయారు. ఎల్కతుర్తి సభ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి ఇంటికి తిరిగి వచ్చే వరకు కలిసి ఉన్న ప్రవీణ్ ఒక్కసారిగా విగత జీవిగా కనిపించడంతో పార్టీ నాయకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
నేటినుంచి టీజీఎప్సెట్ పరీక్షలు
విద్యారణ్యపురి : రాష్ట్రంలో 2025–26 విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న టీజీఎప్సెట్ పరీక్షలు నేటినుంచి జరుగనున్నాయి. ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నారు. మే 2నుంచి 4వతేదీ వరకు ఇంజనీరింగ్లో ప్రవేశాలకు ఎప్సెట్ పరీక్ష జరుగనుంది. ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. సీబీటీ ఆన్లైన్లో జరిగే పరీక్షలకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హాల్టికెట్లపై క్యూ ఆర్ కోడ్ను కూడా ముద్రించారు. దీని ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. వరంగల్ జోన్లోని పలు పరీక్ష కేంద్రాల్లో అగ్రికల్చరల్, ఫార్మసీలో ప్రవేశాలకు 5,845 మంది, నర్సంపేటలో 1,078 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను వరంగల్ జోన్ పరిధిలో 11,785 మంది, నర్సంపేట జోన్లో 2,158 మంది విద్యార్థులు రాయబోతున్నారని కన్వీనర్ కుమార్ తెలియజేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఆయా పరీక్ష కేంద్రాలకు నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించబోరు. ఉదయం సెషన్కు ఉదయం 7:30 గంటల కల్లా చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం సెషన్కు 1:30గంటల కల్లా విద్యార్థులు చేరుకోవాలి. ఫొటో ఐడీ, హాల్టికెట్తో పాటుగా బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లాలి. సీపీని కలిసిన వరల్డ్ పీస్ బాధ్యులు హన్మకొండ చౌరస్తా : వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ బాధ్యులు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. శాంతి కార్యక్రమాలను సీపీకి వివరించగా సమాజహితానికి చేపట్టే సంస్థలకు సహాకారం అందిస్తామని అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న మన పండుగలు కార్యక్రమానికి ఆహ్వానించారు. బి.సురేష్లాల్, సంస్థ వ్యవస్థాపకుడు సిరాజుదీ ్ద న్, విష్ణువర్ధన్, పీఆర్ఓ నివాస్ పాల్గొన్నారు.● రెండ్రోజులు అగ్రికల్చరల్, ఫార్మసీ ● 2నుంచి ఇంజనీరింగ్లో ప్రవేశాలకు.. ● నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ -
బొమ్మకూర్లో నవీన యుగంనాటి శిలలు
● డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి నర్మెట : జనగామ జిల్లా నర్మెట మండల పరిధి బొమ్మకూర్లో నవీన శిలాయుగం నాటి అరుదైన శిలలు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన ఆయన నవీన శిలాయుగం నాటి సంగీతం వినిపించే అరుదైన రాతి కళాఖండాన్ని గుర్తించారు. అనంతరం రత్నాకర్రెడ్డి మాట్లాడుతూ..బొమ్మకూర్ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, జిల్లాలోనే పూర్వకాలం అతిపెద్ద ఇనుము, లోహ పరిశ్రమ ఇక్కడ విలసిల్లిందని పేర్కొన్నారు. 15కిలోల బరువున్న చిట్టెపు రాళ్లు ఇక్కడ ప్రసిద్ధి అని తెలిపారు. అరుదైన రాతి పనిముట్లు, ధాన్యాన్ని నూరే, సంగీతం పలికే శిలలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. అరుదైన శిలాసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రభుత్వం జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. -
రోల్మోడల్ ‘భూభారతి’ చట్టం
సాక్షి ప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : దేశానికి రోల్ మోడల్గా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూసమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఒక అద్భుతమైన అస్త్రం అవుతుందని వెల్లడించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా అందులోని అంశాలను హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్ చదివి వినిపించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు తమ భూ సమస్యలకు సంబంధించి ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాగా వాటికి భూభారతి చట్టం ద్వారా ఉన్న పరిష్కారం మార్గాలను ఆర్డీఓ, స్థానిక తహసీల్దార్ జగత్ సింగ్ తెలియజేశారు. అనంతరం ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చామని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. భూ సమస్య ఉన్న రైతు వద్దకే రెవెన్యూ అధికారులు వచ్చి వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లల్లో సన్న బియ్యం, ఉచిత విద్యుత్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. రైతుకు భూమికి విడదీయని బంధం ఉంటుందన్నారు. ఎంతోమంది మేధావులు, రైతులు, ఆయా వర్గాల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు చేసినదే భూ భారతి చట్టం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన భూ భారతి చట్టం గురించి అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ తమ గ్రామాల్లో రైతులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు, కలెక్టర్ మహిళా స్వయం సహాయక సంఘాలకు సబ్సిడీ రూ. 2.50 లక్షల చెక్కును అందజేశారు. సదస్సులో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వొడితెల ప్రణవ్బాబు, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఇతర అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పాల్గొన్నారు. జూన్ 2నుంచి అన్నీ గ్రామాల్లో సదస్సులు ప్రజలు కార్యాలయాలకు వెళ్లనక్కర లేదు దరఖాస్తు సహా అన్ని అధికారులు చేస్తారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -
అబద్ధాలు మాట్లాడడంలో కేసీఆర్ దిట్ట
హన్మకొండ : అబద్ధాలు మాట్లాడడంలో కేసీఆర్ దిట్ట అని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు ఎద్దేవా చేశారు. సోమవారం హనుమకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు మాట్లాడడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు. ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని, దేశ సరిహద్దులో పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడరని, ఇప్పుడు ఆపరేషన్ కగార్పై స్పందించడం హాస్యాస్పదమని విమర్శించారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ స్థాపించి 25 ఏళ్లు అయ్యిందా, బీఆర్ఎస్ స్థాపించి 25 ఏళ్లు అయ్యిందా అని రజతోత్సవ సభ నిర్వహించారని కేసీఆర్ను ప్రశ్నించారు. ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచేందుకు పోటీ నుంచి తప్పుకున్న మీరు ముస్లింలకు మద్దతు ఇస్తున్నావా.. హిందువులకు మద్దతు ఇస్తున్నావా అని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ మాట్లాడడం సిగ్గు చేటని విమర్శించారు.మహాలక్ష్మి స్వరూపులైనా ఆడపిల్లలను ఆడపోరీలు అని అవమాన పరిచిన కేసీఆర్ మహిళలకు బహిరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లభ వెంకటేశ్వర్లు, నాయకుడు పగడాల కాళిప్రసాద్ పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు -
కేయూలో విద్యార్థుల ఆందోళన
కేయూ క్యాంపస్ : వేసవి సెలవుల నేపథ్యంలో 1వ తేదీనుంచి కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్లు, మెస్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ సర్క్యులర్ కూడా ఇటీవలనే జారీచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ కేయూలోని హాస్టళ్లు, మెస్లను యథావిధిగా కొనసాగించాలని మూసివేయవద్దని, సెలవులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పీజీ కోర్సుల విద్యార్థులు పరిపాలన భవనంలో ఆందోళనకు దిగారు. కొంతమంది విద్యార్థులతో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, పాలకమండలి సభ్యుడు బి.సురేష్ లాల్ వివిధ యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్స్ చర్చించారు. వేసవిలో హాస్టళ్లు, మెస్లను మూసివేస్తారని వారు విద్యార్థులకు తెలియజేశారు.తాము వివిధ పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నామని అందువల్ల హాస్టళ్లను, మెస్లను కొనసాగించాలని విద్యార్థులు కోరారు. ఈనెల 30న అన్ని విభాగాల అధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వీసీ విద్యార్థులకు తెలియజేయడంతో వారు ఆందోళన విరమించారు. హాస్టళ్లు, మెస్లను మూసివేయొద్దని డిమాండ్ -
జయశంకర్ను విస్మరించడం బాధాకరం
హన్మకొండ చౌరస్తా : స్వరాష్ట్ర తెలంగాణ కోసం జీవితాన్నే త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ను బీఆర్ఎస్ సభలో కేసీఆర్ విస్మరించడం బాధాకరమని వరంగల్ పశ్చిమ, పరకాల, ఘన్పూర్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రూ.400ల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సభలో అయ్యా కొడుకుల ఫొటోలు తప్పితే ఎవరివీ లేకపోవడం, మరొకరి ప్రసంగం లేకుండా ఒక్కడే మాట్లాడడం కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు నిదర్శనమన్నారు. జైల్లో పెడుతారనే భయంతోనే బీజేపీతో కుమ్మకై ్క గత ఎన్నికలలో తటస్థంగా ఉన్నారని ఆరోపించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటున్న కేసీఆర్, బీఆర్ఎస్ బీ ఫాంతో గెలిచిన 38 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పిన కేసీఆర్ తన హయాంలోనూ మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరిగాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగణన, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ఘ నత సీఎం రేవంత్రెడ్డిదని అన్నారు. సభకు హా జరయ్యే ముందు కేసీఆర్కు బ్రీతింగ్ ఎనలైజర్ ప రీక్షలు చేస్తే బాగుండని ఎద్దేవా చేశారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. కేసీఆర్ది డెకాయిట్ల కుటుంబమని, గొర్రెల పథకంలో అక్రమంగా సంపాదించి బీఆర్ఎస్ నాయకులు గొర్రెల మాదిరిగా తయారయ్యారని అన్నారు. సమావేశంలో వరంగ ల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బ స్వరాజు సారయ్య, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాసరా వు, ఈవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు సభ నిదర్శనం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధ్వజం -
రైల్వే ట్రాక్పై బీఆర్ఎస్ కార్యకర్తలు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో ఆదివారం నవజీవన్ ఎక్స్ప్రెస్కు అంతరాయం ఏర్పడి నిలిచిపోయింది. కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ సి.చటర్జీ సోమవారం విలేకరులకు తెలిపిన కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి చైన్నె వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉప్పల్ రైల్వే స్టేషన్ మీదుగా పోతుండగా గేటు మూసి ఉంది. దీంతో గేట్ వద్ద వాహనాలు ఆగిఉన్నాయి. ఈ సమయంలో ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభకు వెళ్లిన కార్యకర్తలు తిరుగు ప్రయాణంలో అధిక సంఖ్యలో ట్రాక్ దాటుతుండగా గమనించిన నవజీవన్ ఎక్స్ప్రెస్ లోకో పైలెట్ ప్రమాదం జరగకుండా రైలుని నిలిపి వేశారు. దీంతో సాయంత్రం 6:14 నుంచి 6:24 గంటల వరకు రైలుకు అంతరాయం ఏర్పడి నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ, పోలీసులతో కలిసి ఉప్పల్ స్టేషన్కు వెళ్లి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఘటనకు బాధ్యులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలు దాటుతూ నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు అంతరాయానికి కారకులుగా ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చటర్జీ పేర్కొన్నారు. ఉప్పల్లో నవజీవన్ ఎక్స్ప్రెస్ నిలిపివేత కేసు నమోదు చేసిన కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు -
రేవంత్రెడ్డి కుట్ర.. పోలీసుల అమలు
హన్మకొండ : రజతోత్సవ సభను విఫలం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్రలను పోలీసులు అమలు చేశారని బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూజర్ చార్జీలు వసూలు చేసిన పోలీసు శాఖ అరకొరగా సిబ్బందిని కేటాయించిందని, గతంలో ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ వద్ద యూజర్ చార్జీలు వసూలు చేసిందా అని ప్రశ్నించారు. 2,000 మంది పోలీసు సిబ్బందిని కేటాయిస్తామని చెప్పి 20 మందిని కూడా ఇవ్వలేదన్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి వెళ్లి తాను ట్రాఫిక్ క్లియర్ చేశామన్నారు. సభకు రైతులు స్వచ్ఛందంగా స్థలం ఇచ్చారన్నారు. ఆ భూములను తిరిగి యథావిధిగా తయారు చేసి రైతులకు అప్పగిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ను ప్రజలు గుండెలో పెట్టుకున్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఏ రోజు డ్యూటీలు చేయని రవాణా శాఖ అధికారులు ఆదివారం సెలవు రోజైనా రోడ్లపైకి వచ్చి సభకు వస్తున్న వాహనాలను తనిఖీ చేసి అడ్డంకులు సృష్టించారని ధ్వజమెత్తారు. హనుమకొండ, ములుగు రోడ్డులో తనిఖీలు చేశారని అదే సమయంలో తానుంటే వారిని బట్టలూడదీసి ఉరికించేవాడినని మండిపడ్డారు. సమావేశంలో నా యకులు పులి రజనీకాంత్, భీరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి, పోలంపల్లి రామ్మూర్తి, బి.వీరేందర్, రవీందర్ రావు. పానుగంటి శ్రీధర్, దూలం వెంకన్న, నయిముద్దీన్ పాల్గొన్నారు. రజతోత్సవ సభ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి -
వసంతోత్సవానికి వేళాయె
కాజీపేట : స్వయంభుగా ప్రకాశితమై.. వేలాది మంది భక్తుల కోరికలను తీరుస్తూ.. ఇంటి ఇలవేల్పుగా భాసిల్లుతున్న శ్వేతార్క మూలగణపతి కాజీపేట పట్టణంలో కొలువై 27 ఏళ్లు పూర్తయ్యాయి. నిర్వీఘ్న పూజాలందుకుంటున్న శ్వేతార్కుడిని దర్శించి తరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దాతలు అందజేసిన రూ.3.5 కోట్లకు పైగా ఆర్థికసాయంతో ఒకే ప్రాంగణంలో శ్వేతార్కుడితోపాటు శైవ, వైష్ణవ సంప్రాదాయ పద్ధతుల్లో నిర్మితమైన ఆలయాల్లో 29 దేవతామూర్తులు కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న శ్వేతార్కాలయంలో రేపటినుంచి 4వ తేదీవరకు ఐదు రోజుల పాటు వసంతోత్సవ వేడుకలు కనుల పండువగా జరుగనున్నాయి. ఆలయానికి ఇలా చేరుకోవాలి శ్వేతార్కుడిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. భక్తులు కాజీపేట రైల్వే జంక్షన్లో రైలు, ప్రధాన రహదారిపై బస్సు దిగి చౌరస్తాకు వచ్చి 300 మీటర్ల దూరం సోమిడి రోడ్డు వైపు నడిస్తే చాలు శ్వేతార్క ఆలయం కన్పిస్తోంది. పండుగలతోపాటు ప్రతి మంగళవారం, శనివారం విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఉత్సవాల వివరాలు ఉత్సవాలను 30వ తేదీన లాంఛనంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ ప్రారంభిస్తారు. తాడూరి రేణుక బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. 1న లక్ష్మినారాయణుల కల్యాణం, సుదర్శన హోమం, లక్ష తమలపాకులతో అర్చన, పరవస్తు హరిషత నాగిని బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 2న ఆలయంలో శ్వేతార్క మూలగణపతికి పుట్టిన రోజు వేడుకలు జరిపించనున్నారు. 3న స్వామి వారికి గంగా జలం, నల్ల ద్రాక్ష రసంతో అభిషేకం, మృత్యుంజయ పాశుపాత, ఆయుష్య హోమం, శ్రీవల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం నిర్వహిస్తారు. లక్ష దమన అర్చన, బాలలచే కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. 4న పూర్ణాహుతి, సిద్దిబుద్ది సమేత శ్వేతార్కుడికి కల్యాణ వేడుకలతో ఉత్సవాలు ముగించడం జరుగుతుందని ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ పేర్కొన్నారు.శ్వేతార్క ఆలయం ముస్తాబు రేపటి నుంచే వేడుకలు ప్రారంభం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల రాక చారిత్రక నేపథ్యం.. ఆలయ వ్యవస్థాపకుడు, ఇటీవల శివైక్యం చెందిన ఐనవోలు అనంత మల్లయ్య శర్మకు 1999లో గణపతి దేవుడు స్వప్నంలో సాక్షత్కారించి నల్లగొండ జిల్లాలోని మాడా ప్రభాకర్శర్మ ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు మొదలులో ఉన్నట్లుగా చెప్పి అదృశ్యమయ్యాడు. ఉదయం లేచి తర్వాత పెద్దలకు విషయం తెలిపి జిల్లెడు చెట్టు వేరులో ఉన్న స్వామివారి మూర్తిని గ్రహించి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కాజీపేటలో ప్రతిష్ఠించారు. 2009లో పద్దెనిమిదిన్నర కిలోల వెండి కవచాన్ని శ్వేతార్కుడికి తొడిగి స్థిర ప్రతిష్ఠచేశారు. 2010లో దేశ చరిత్రలోనే స్వామివారికి గణాధిపత్యయోగ పట్టాభిషేకం జరిపించారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శిల్పుల చేతిలో శ్వేతార్క ఆలయం రూపుదిద్దుకుంది.ఆలయ శిఖరంపైకి చేరుకుని గుడి వెనక భాగం వైపు చూస్తే గణపతి దేవుడి వాహనమైన ఎలుకను పోలిన కొండ కన్పిస్తోందని భక్తులు చెబుతుంటారు. -
వేసవి సెలవుల్లో జాగ్రత్తలు తప్పనిసరి
మాహబూబాబాద్ రూరల్: వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆది వారం తెలిపారు. పిల్లలు వేసవిలో చల్లదనం కోసం గ్రామాల్లోని చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎటువంటి రక్షణ సదుపాయాలు లేనిచోట ఈతకు వెళ్లనీయొద్దని చెప్పా రు. వేసవి సెలవుల్లో ప్రజలు తమ సొంత ఊర్లు, విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ఇంటి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును లాకర్లలో భద్రపరచాలి లేదా తమ వెంట తీసుకెళ్లాలన్నారు. ఇంటి తలుపులకు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి లోపల, బయట లైట్లు వెలిగేలా చూసుకోవాలన్నారు. ఇంటి బయట తాళం వేసే ప్రసక్తి లేకుండా లోపల నుంచి గొళ్లెం వేసుకోవాలని, ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మొబైల్ ద్వారా పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు, వాచ్మెన్లను నియమించాలని, ఊర్లకు వెళ్లిన రోజుల్లో పేపర్, పాల డెలివరీలను నిలిపివేయడం మంచిదని, ఇంటి పరిసరాల్లో కొత్తవారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్ 100కు లేదా దగ్గరలోని పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. ఇంటి పరిధిలోని పోలీస్స్టేషన్, ఏరియా కానిస్టేబుల్ సెల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. మైనర్లకు వాహనాలను ఇవ్వడం చట్టపరంగా నిషిద్ధమని, అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగం, బెట్టింగ్ లాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు యుద్ధ ప్రాతిపదికన రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నారని, ప్రజలు కూడా తమ భద్రత కోసం పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ప్రసంగిస్తున్న కేసీఆర్, అభివాదం చేస్తున్న కేసీఆర్ఎల్కతుర్కి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలుసాక్షిప్రతినిధి, వరంగల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్రోడ్లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది 6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్ఎస్పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు. వైఎస్సార్ పాలనను.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు. సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు.. పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరిన్ని సభా విశేషాలు కట్టిపడేసిన ఆటాపాట.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. గులాబీ వనంగా మారిన ఎల్కతుర్తి రోడ్లపైనే కిలోమీటర్ల మేర వాహనాలు ఆపరేషన్ కగార్ను ఆపాలి, నక్సల్స్తో చర్చించాలి.. తీర్మానానికి సభ ఆమోదం అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ శ్రేణుల్లో జోష్..చప్పట్లు, కేరింతల నడుమ సాగిన కేసీఆర్ ప్రసంగం మృతులకు నివాళి అర్పించి.. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మహబూబాబాద్ అర్బ న్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాల ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆదివారం లయన్స్ భవన్లో జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అ ధ్యక్షతన సంఘం జిల్లా ఉద్యమ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి ఇ–కుబేర్లో పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ రుణాలు, మెడికల్ రీయింబర్స్మెంట్, పెన్షన్ బకాయిలు అన్ని రకాల పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయలన్నారు. ఐదు డీఏలను ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను తెప్పించుకొని 30శాతం ఫిట్మెంట్ తగ్గకుండా అమలు చేయాలన్నారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు 010పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల టీచర్లకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, కేజీబీవీలకు మినిమం టైం స్కేల్ చెల్లించాలని, అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్, ఉపాధ్యక్షులు స్వప్న, వెంకటేశ్వర్లు, కోశాధికారి నాగమల్లయ్య, కార్యదర్శులు రమేశ్, భద్రునాయక్, వివేక్, మంజుల, హుస్సేన్, నర్సింహారావు, హరినాయక్, మండలాల బాధ్యులు కుమార్, రాజశేఖర్, ప్రవీణ్, చైతన్య, శైలజ, రమ్య, జయ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో రైతులకు ప్రయోజనాలు
కురవి: భూభారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. ఆదివారం సీరోలు మండలం కాంపెల్లి రైతు వేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. నూతన చట్టంతో రైతుల భూములకు భరోసా కల్పిస్తుందన్నారు. ఏమైనా ఇతర అంశాలు, సమస్యలున్నా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందన్నారు. భూసమస్యలు తెలుసుకుని సులభతరంగా పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందన్నారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. కాగా నూతన చట్టంపై సాంస్కృతిక సారఽథి సభ్యులు పాడిన పాటలు రైతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, ఏడీ సర్వేల్యాండ్ నరసింహమూర్తి, తహసీల్దార్ శ్రీనివాస నారాయణమూర్తి, ఎంపీడీఓ ఎండి.గౌస్, ఏఓ ఛాయ, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
గులాబీ వాహనాల జాతర
జనగామ: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దళం ఉద్యమ కెరటం కదిలింది. నాగర్కర్నూల్ నుంచి జనగామ వరకు వేలాది వాహనాలు వరంగల్–హైదరాబాద్ నేషనల్ హైవేపై కదులుతుంటే చీమల దండును తలపించింది. సెకనుకు 50 వాహనాల చొప్పున.. రోడ్డుపై గ్యాబ్ లేకుండా రయ్ రయ్ మంటూ పరుగెత్తాయి. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట ఏసీపీల పర్యవేక్షణలో సీఐ, ఎస్సై, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టాయి. నాగర్కర్నూల్, వనపర్తి, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట, జనగామ జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఎల్క తుర్తి బహిరంగ సభకు వెళ్లాయి. రఘునాథపల్లి మండలం కోమళ్ల, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ల వ ద్ద ఎలాంటి రుసుం తీసుకోకుండా గేట్లను తెరిచి ఉంచారు. దీంతో కొంత మేర ట్రాఫిక్ను నియంత్రించగలిగారు. సభ ముగిసిన తర్వాత అర్థరాత్రి వరకు హైవేపై వాహనాల రద్దీ కొనసాగింది. పోలీసులు, నిఘా వర్గాలు తెల్లవారు జాము వరకు నేషనల్ హైవేపై బందోబస్తు చర్యలు చేపట్టారు.హైవేపై సెకనుకు 50కి పైగానే.. అడుగడుగునా పోలీసు నిఘా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనం -
మెడికల్ కళాశాలకు భౌతికకాయం అందజేత
నెహ్రూసెంటర్: సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మండల వెంకన్న సతీమణి అరుణశ్రీ మృతి చెందగా ఆమె మృతదేహాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆదివారం అందజేశారు. మెడికల్ విద్యార్థుల పరిశోధన కోసం అనాటమి డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భరత్కు భౌతికకాయం అప్పగించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, పిల్లి సుధాకర్, వడ్డెబోయిన శ్రీనివాస్, మైస శ్రీనివాస్, సాదుల శ్రీనివాస్, అవయవదాతల సంఘం రాష్ట్ర కార్యదర్శి పరికిపండ్ల అశోక్, జిల్లా కన్వీనర్ పర్కాల రవీందర్రెడ్డి, పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉరకలెత్తి
నాడు పిడికిలెత్తి.. ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం● ‘తెలంగాణ’కు ఊపిరిలూదిన ఓరుగల్లు ● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ.. 25 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక ● ఓరుగల్లులో బీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంసాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీ(టీ)ఆర్ఎస్ ఆధ్వర్యంలో పురుడుపోసుకున్న ఉద్యమం ఓరుగలుల్లో ఉవ్వెత్తున ఎగిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్న చారిత్రక ఓరుగల్లు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి ఊపిరులూదింది. వరంగల్ ఉద్యమ నేపథ్యం, స్ఫూర్తిని పదేపదే ప్రస్తావించే ఉద్యమనేత, మాజీ సీఎం కేసీఆర్.. 25 ఏళ్ల పార్టీ రజతోత్సవ సభకు ఇక్కడే వేదిక చేశారు. చారిత్రక వరంగల్ మరోసారి కీలక గులాబీ జెండా పండుగకు వేదికై ంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆవిర్భావం, ఓరుగల్లు పోరు, ఉద్యమ ప్రస్థానం, రాష్ట్రసాధన తదితర అంశాలు గుర్తుకు వస్తున్నాయి. ఓరుగల్లులో ఇదీ పార్టీ ప్రస్థానం... వరుస సభలు.. రగిలిన ఉద్యమం..హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో మొదటి భారీ బహిరంగ సభ 2001 జూన్ 21న జరిగింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2002 అక్టోబర్ 28న భూపాలపల్లిలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. 2003 ఏప్రిల్ 27న వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించగా.. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవగౌడ, అప్పటి కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి అజిత్సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభ సందర్భంగా ఒక్కరోజు ముందు సిద్దిపేట నుంచి వరంగల్ వరకు 100 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 2003 అక్టోబర్ 22న మేడారంలో పల్లెబాట కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 2003 డిసెంబర్ 5న జనగామలో ఓరుగల్లు వీరగర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు రాజీనామా చేసిన తర్వాత 2005 జూలై 17 వరంగల్లో మొదటి సభ, భారీ బహిరంగ సభ నిర్వహించగా అప్పటి కేంద్ర మంత్రి శరద్పవార్ హాజరయ్యారు. 2007 ఏప్రిల్ 27 తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో టీఆర్ఎస్ ఆరో వార్షికోత్సవం జరిగింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో 2009 నవంబర్ 23న కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల జేఏసీ బహిరంగ సభ, 14 విద్యార్థి సంఘాలతో సమావేశం, స్వరాష్ట్రం కోసం ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో నినాదం’ ప్రకటన చేశారు. 2010 సెప్టెంబర్ 3న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. 2010 డిసెంబర్ 16న తెలంగాణ మహాగర్జన పేరుతో నగరంలోని ప్రకాశ్రెడ్డిపేటలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఆర్య సమాజ్ అధ్యక్షుడు స్వామి అగ్నివేశ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభగా రికార్డు అయింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడగా.. 2017 ఏప్రిల్ 27న నగరంలోని ప్రకాశ్రెడ్డిపేటలో ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా, బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ కూడా ఇక్కడే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సభలు, విజయోత్సవ సభలు.. పాతికేళ్లలో ఒడిదుడుకులు..తెలంగాణ సాధన ఉద్యమ సభలతోపాటు ఎన్నికలు, విజయోత్సవ సభలకు ఓరుగల్లు వేదికై ంది. 2004 సాధారణ ఎన్నికల్లో వరంగల్, హనుమకొండ లోక్సభ స్థానాలతోపాటు హనుమకొండ, స్టేషన్ఘన్పూర్, చేర్యాల, నర్సంపేట, పరకాల, చెన్నూరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలుచోట్ల సభలు నిర్వహించారు. 2008 జూన్ 1న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగా హనుమకొండ లోక్సభ, చేర్యాల స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. 2009 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవగా, 2010 ఫిబ్రవరి 7న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొనగా అభ్యర్థి గెలిచాడు. 2012లో స్టేషన్ఘన్పూర్ ఉపఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొనగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 2014 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం.. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ.. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాల్లో టీ(బీ)ఆర్ఎస్ విజయం దక్కింది. 2015 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిచారు. 2015 నవంబర్ 24న వరంగల్ లోక్సభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2015 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 2016 మార్చి 9న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 58 డివిజన్లలో 44 స్థానాలను పార్టీ గెలుచుకుంది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని 11 స్థానాల్లో గెలవగా, 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో విజయం సాధించారు. 2019 మేలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఆరు జెడ్పీలు, 98 శాతం ఎంపీపీలు గెలవగా, 2019 జూన్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఘనవిజయం సాధించారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో గెలవగా, 2021 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో రెండే స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఇక్కడినుంచే..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వరంగల్ అంటే ప్రత్యేక అభిమానం. ఇక్కడినుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది సక్సెస్ అవుతుందన్న నమ్మ కం ఆయనది. కాకతీయుల ఏలుబడి.. సమ్మక్క–సారక్కల పోరాట తెగువ.. కాళోజీ నారాయణ రావు, ఆచార్య జయశంకర్లను స్ఫూర్తిగా చెప్పుకుంటారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల తెగువను తరచూ ప్రస్తావిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన బీ(టీ)ఆర్ఎస్.. 14 ఏళ్ల ఉద్యమ సమయంలో పడుతూ లేస్తూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. పడినప్పుడ ల్లా లేచేందుకు పురుడుపోసుకున్న ఆలోచనలతో ఉద్యమం ఓరుగలుల్లో ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమాలకు కేరాఫ్.. పోరాటాల ఖిల్లాగా ఉన్న చారి త్రక వరంగల్ జిల్లా బీఆర్ఎస్లో కీలక ఘట్టాలకు వేదికై ంది. అందుకే పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రతీ కార్యక్రమం ఓరుగల్లు నుంచే మొదలెట్టడం కేసీఆర్కు రివాజుగా మారింది. ఇదే క్రమంలో బీ ఆర్ఎస్ సిల్వర్జూబ్లీ వేడుకలకు మరోసారి ఓరుగల్లును వేదికగా మార్చుకున్నారన్న చర్చ ఉంది. -
కాంగ్రెస్ ఇక ఖతమే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మోసాలు, తీర్చలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పని ఇక ఖతమైనట్లే, ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ఆదాయం పడిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏమీ చేయలేని ప్రభుత్వంపై ఏడాది న్నర కాలంలోనే ప్రజలు మండిపడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. సరిపడ నీళ్లున్నా.. పంటలు ఎండిపోయాయని, రైతులను నిండాముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ఎల్కతుర్తిలో నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రగా బయలుదేరారని, కేసీఆర్ను చూడాలని, ఆయన మాటలు వినాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలంటే తెలంగాణ ప్రజలకు పండుగలాంటిదన్నారు. 14 ఏళ్ల ఉద్యమంలో ఉన్నా.. పదేళ్లు పరిపాలనలో ఉన్నా.. ఏడాదిన్నరగా ప్రతిపక్షంలో ఉన్నా.. బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షమేనన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎల్కతుర్తి కేంద్రంగా నిర్వహించే రైతుసభకు లక్షలాదిగా జనం తరలివస్తారని అంచనాలు తేలిపోతున్నాయని, కానీ ట్రాఫిక్ నియంత్రణ పేరిట ఈ ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉందని, నాయకులు, కార్యకర్తలు స్వీయ నియంత్రణ చేపట్టి అధిక సంఖ్యలో సభకు తరలివచ్చేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీష్కుమార్, నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవ సభ చరిత్రాత్మకంగా నిలుస్తుందిఎల్కతుర్తి: రజతోత్సవసభ చరిత్రాత్మకంగా నిలు స్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. చింతలపల్లి సమీపంలో సభా ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని అప్పటి కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పిందని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రాన్ని సీఎంగా కేసీఆర్ దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. నాయకులు పిట్టల మహేందర్, గోల్లె మహేందర్, తంగెడ మహేందర్, ఎల్తూరి స్వామి, వేముల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్రావు -
లబ్ధిపొందాను.. నడిచే వెళ్తాను
నెక్కొండ: మాజీ సీఎం కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఓ వృద్ధుడు చేపట్టిన పాదయాత్ర శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చేరింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామం చంద్రుతండాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు భూక్య గంగ్యానాయక్ చేతితో కేసీఆర్ ఫ్లెక్సీ పట్టుకుని పాదయాత్ర చేపట్టాడు. భగభగ మండుతున్న ఎండను లెక్క చేయకుండా అభిమానంతో పాదయాత్రగా సభాస్థలికి వెళ్తున్నాడు. ఈసందర్భంగా గంగ్యానాయక్ మాట్లాడుతూ.. తన కుటుంబానికి రైతు బంధు, తన కుమారుడు మృతి చెందితే రైతు బీమా రూ.5 లక్షలు వచ్చాయన్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో తన కుటుంబానికి లబ్ధి చేకూరిందని.. అందువల్ల పాదయాత్రగా సభకు వెళ్తున్నట్లు చెప్పాడు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు కొమ్ము రమేశ్యాదవ్, మారం రాము, సంగని సూరయ్య, కారింగుల సురేశ్, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, మహ్మద్ ఖలీల్, ఈదునూరి వెంకన్న తదితరులు గంగ్యానాయక్ను సన్మానించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పాదయాత్రగా వెళ్తున్న వృద్ధుడు 75 ఏళ్ల వయస్సులో తన అభిమానాన్ని చాటుతున్న గంగ్యానాయక్ -
అంతర్జాతీయ భారత్ సమ్మిట్లో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: హైదరాబాద్ నోవ హోటల్లో శనివారం జరిగిన అంతర్జాతీయ భారత్ సమ్మిట్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ సమాఖ్య అభివృద్ధిపై సమగ్ర భారత నిర్మాణంలో యువత పాత్రపై తన అభిప్రాయం వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే.. దేశ భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను బలంగా నిరోధించాలన్నారు. దేశ విభజన కోరే శక్తులకు కఠినంగా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించారు. -
పశువైద్యుల సేవలు అమూల్యమైనవి
● జగన్మోహన్ రావుహన్మకొండ: మూగజీవాలకు సేవలందిస్తున్న పశువైద్యుల సేవలు అమూల్యమైనవని, దేశ జీడీపీలో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ పాత్ర ప్రముఖమైందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆడిటోరియంలో తెలంగాణ వెటర్నరీ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ పశు వైద్యదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. పశు వైద్యవృత్తి చేసే వారికి సరైన గుర్తింపు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ రీఆర్గనైజేషన్ చేయడానికి జేఏసీ డిమాండ్లో ఈ అంశాన్ని పొందుపరుస్తామని చెప్పారు. ఎంజీఎం సమీపంలోని వెటర్నరీ అసోసియేషన్ బిల్డింగ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వెంటర్నరీ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ రాము మాట్లాడారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన పశు వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి కిరణ్ కుమార్, హ నుమకొండ జిల్లా అధికారి డాక్టర్ విజయభాస్కర్, ములుగు జిల్లా అధికారి డాక్టర్ కొమురయ్య, టీజీఓ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అ ధ్యక్షుడు డి.మురళీధర్ రెడ్డి, తెలంగాణ వెటర్న రీ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి డాక్టర్ బాలోజీ, డాక్టర్ ప్రవీణ్ కుమార్, కృష్ణమూర్తి, ప్రకాశ్, శ్రీనివాస్, రవికుమార్, గోపాల్ రావు, వినయ్, రాజేష్, నరేష్, విజయ, నాగమణి, ఊర్మిళ, మాలతి పాల్గొన్నారు. ప్రశాంత సమాజ స్థాపనకు కృషి చేయాలినయీంనగర్: ప్రస్తుత సమాజంలో భార్యభర్తలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య తగాదాలు పెరుగుతున్నాయని.. వీటికి కమ్యూనిటీ మధ్యవర్తిత్వం మెరుగైన పరిష్కారమని, ప్రశాంతమైన సమాజ స్థాపనకు పెద్దలు నడుం బిగించాలని ఫస్ట్ ఏడీజే జడ్జి బి.అపర్ణ దేవి అన్నారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లుగా శిక్షణ పొందిన పరికిపండ్ల వేణు, తేరాల యుగంధర్, పాశం సంజీవరెడ్డి, తూడి విద్యాసాగర్ రెడ్డి, యాదగిరి 53వ డివిజన్ ఆదర్శకాలనీలో నిర్వహించనున్న ఆదర్శ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ఆమె శనివారం ప్రారంభించారు. అనంతరం జడ్జి అపర్ణ దేవి మాట్లాడుతూ సమాజంలోని వ్యక్తులు, సమూహాల మధ్య ఏర్పడే వివాదాలను కమ్యూనిటీ మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుతంగా పరిష్కరించగలిగితే సత్ఫలితాలు ఉంటాయన్నారు. 2023 లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందన్నారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లుగా శిక్షణ పొందిన పరికిపండ్ల వేణు, తేరాల యుగంధర్, పాశం సంజీవరెడ్డి, తూడి విద్యాసాగర్ రెడ్డి, యాదగిరి, హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరి క్షమాదేశ్ పాండే, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ సాయికుమార్, ఎస్ఐ సదానందం, దామెర నరసయ్య, దామోదర్, విద్యాసాగర్ రెడ్డి, నరసింహస్వామి పాల్గొన్నారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలి కేయూ క్యాంపస్: సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ చిన్నాల బలరాములు అన్నారు. ఆ విభాగంలో పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై నిర్వహిస్తున్న తరగతుల్లో భాగంగా ఆయన శనివారం పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సామాజిక సమస్యలపై పరిశోధనలు చేసి సానుకూల పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. సమావేశంలో విభాగం అధిపతి ప్రొఫెసర్ పెదమళ్ల శ్రీనివాస్ రావు, బీఓఎస్ చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీనివాసులు, అధ్యాపకులు చీకటి శ్రీను, బుర్రి ఉమాశంకర్, ఒడపెల్లి మోహన్, స్కాలర్స్ పాల్గొన్నారు. -
వడదెబ్బతో ట్రాలీ డ్రైవర్ మృతి
కమలాపూర్: మండలంలోని ఉప్పల్కు చెందిన కొయ్యడ చంద్రమౌళి (45) అనే ట్రాలీ ఆటో యజమాని, డ్రైవర్ వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాలీ ఆటో నడుపుతూ జీవనం సాగించే చంద్రమౌళి శనివారం వ్యవసాయ కూలీలను తీసుకొచ్చేందుకు వెళ్తున్న క్రమంలో ఎండ తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురయ్యాడు. ఈ క్రమంలోనే దేశరాజుపల్లి చెరువు కట్టపై చెట్టు నీడన ట్రాలీ ఆటోను నిలిపి సేదదీరుతుండగా వడదెబ్బతో ట్రాలీ ఆటోలోనే మృతి చెందాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చంద్రమౌళికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
పాలకుర్తి టౌన్: కొడకండ్ల మండలం రేగులతండాలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ మహేందర్రెడ్డి శని వారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగులతండాకు చెందిన గుగులోతు శ్రీను(48) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే తండాకు చెందిన గుగులోతు జయరాం 20 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం వెళ్లి హనుమకొండలోని రెడ్డికాలనీలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆటో కొనుక్కొని హనుమకొండలో నడుపుతున్నాడు. కాగా.. రేగులతండాలో శ్రీను, జయరాం ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. జయరాం హనుమకొండలో ఉండడంతో తండాలోని ఆయన ఇంటి వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో శ్రీను పశువులను కట్టేస్తుండేవాడు. ఈవిషయంలో పలుమార్లు ఇరువురు తండాలో తగాదా పడ్డారు. తన స్థలంలో పశువులను కట్టేస్తున్న శ్రీనును ఎలాగైనా అంతమొదించాలని నిందితుడు అనుకున్నాడు. ప్రణాళిక ప్రకారం ఈనెల 20న తండాకు వచ్చిన జయరాం రాత్రి 10 గంటల సమయంలో శ్రీనుతో గొడవపడి వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతిపై పలుమార్లు పొడిచాడు. శ్రీను తీవ్రగాయాలతో అరవడంతో కుటుంబ సభ్యులు రావడంతో నిందితుడు ఆటోలో పారిపోయాడు. శ్రీను రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆటో, హ్యతకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హనుమకొండ, కొడకండ్ల పోలీస్సేష్టన్లో గతంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు చేధించిన కొడకండ్ల ఎస్సై రాజు, పోలీసులు రవీందర్రెడ్డి, వెంకటేష్, ఇమ్రాన్, రఘుపతి, అశోక్, అరుణ్, శ్రీకాంత్, సల్మాన్లను జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు. వివరాలు వెల్లడించిన సీఐ మహేందర్రెడ్డి -
‘సుమతిరెడ్డి’లో సందడి
హసన్పర్తి: నగర శివారులోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులు సందడి చేశారు. కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన శ్రీథమ్–25 కార్యక్రమం శనివారం ముగిసింది. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా హైదరాబాద్కు చెందిన ఎలిజియం బ్యాండ్ ప్రదర్శన హోరెత్తాయి. తొలుత నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ.. క్రమశిక్షణ పట్టుదలతో చదివితే ఉన్నతశిఖరాలు అధిరోహిస్తారని చెప్పారు. విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనా త్మక శక్తులను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాన్నారు. అనంతరం సావనీర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్సార్ విద్యాసంస్థల సెక్రటరీ మధుకర్రెడ్డి, డైరెక్టర్ సాధనారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి, ఏఓ వేణుగోపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. హోరెత్తిన ఎలిజియం బ్యాండ్ బృంద ప్రదర్శన ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు -
రామప్ప కార్వింగ్స్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప కార్వింగ్స్ బ్యూటిఫుల్ అంటూ మిస్ వరల్డ్ ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా కొనియాడారు. శనివారం సాయంత్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా టూరిజం అధికారి శివాజి, టూరిజం కార్పొరేషన్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు ఆమెకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో ఫొటో షూట్ నిర్వహించిన అనంతరం రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆమె పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్ ఆమెకు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. టూరిజం గైడ్ విజయ్కుమార్ ద్వారా రామప్ప ఆలయ విశిష్టత తెలుసుకుంటా రామప్పలోని ప్రతి శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సరిగమపలికే పొన్నచెట్టు శిల్పం, నీటిలో తేలాడే ఇటుకలను ఆసక్తిగా తిలకించారు. రామప్ప శిల్పకళా సంపద ధ్వంసం కావడానికి గల కారణాలను గైడ్ను అడిగి తెలుసుకున్నారు. మే 14న మిస్ వరల్డ్ కాంటెస్ట్ టీం సందర్శించనున్న నేపథ్యంలో రామప్ప ఆలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. మే 14 లోపు మరోసారి రామప్ప ఆలయాన్ని సందర్శిస్తానని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ గిరిబాబు, ఎస్సై జక్కుల సతీష్, ఆర్ఐ విజేందర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా -
డిగ్రీ పరీక్షలు మళ్లీ వాయిదా..
● పరీక్ష ఫీజులు చెల్లించని ప్రైవేట్ కాలేజీలు ● మళ్లీ ఎప్పుడు అనేది వెల్లడించని కేయూ ● అయోమయంలో వివిధ సెమిస్టర్ల విద్యార్థులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లోని 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు, బ్యాక్లాగ్ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 28నుంచి నిర్వహిస్తామని చెప్పిన యూనివర్సిటీ అధికారులు శనివారం మళ్లీ వాయిదా వేశారు. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ వెల్లడించారు. ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులనుంచి పరీక్షల ఫీజులు వసూలు చేసినప్పటికీ పరీక్షల విభాగానికి చెల్లించలేదు. గత మూడేళ్లుగా ప్రభుత్వం తమకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదని పరీక్షల ఫీజులు సంబంధిత విభాగానికి చెల్లించలేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడించకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఫీజులు చెల్లించిన 153 కాలేజీలు కేయూ పరిధిలో 292 ప్రభుత్వ, గురుకుల, ప్రైవేట్, అటానమస్ కాలేజీలు ఉన్నాయి. అందులో కేవలం 153 కాలేజీలే విద్యార్థుల పరీక్షల ఫీజులు పరీక్షల విభాగానికి చెల్లించాయి. నామినల్ రోల్స్ను కూడా పరీక్షల విభాగానికి పంపించలేదు. అయోమయంలో విద్యార్థులు.. సుమారు లక్షా 70 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, సెమిస్టర్ల పరీక్షలు వాయిదా పడడం.. తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా డిగ్రీకోర్సుల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంది. వీరు పీజీ సెట్, ఎడ్సెట్, లా సెట్, టీజీ ఐసెట్ వంటి పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో తమకు పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విద్యార్థులు సైతం రోడ్లపైకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
కాజీపేట మీదుగా వాస్కోడగామ ఎక్స్ప్రెస్
● మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు కాజీపేట రూరల్: M>iõ³r f…MýSÛ¯ŒS Ò$§ýl$-V> §ýl„ìS׿-ిÛ׿ Ð]l$«§ýlÅ OÆð‡ÌôæÓ A«¨M>Æý‡$-Ë$ ÐéÝùP-yýl-V>Ð]l$ GMŠSÞ-{ò³-‹Ü™ø´ër$ ç³Ë$ OÆð‡âýæÏ¯]l$ §éÇ Ð]l$ãÏ…_ ¯]lyìl-í³-çÜ$¢-¯]l²r$Ï Ôèæ°ÐéÆý‡… OÆð‡ÌôæÓ A«¨M>Æý‡$-Ë$ Ôèæ°ÐéÆý‡… ™ðlÍ´ëÆý‡$. ç³Ë$ Æý‡*rÏÌZ °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² OÆð‡ÌôæÓ Ýë…MóS-†MýS AÀ-Ð]l–-¨® 糯]l$ÌS ¯ólç³-£ýlÅ…ÌZ Mö°² OÆð‡âýæÏ¯]l$ M>iõ³r Ò$§ýl$-V> ¯]lyìl-í³-çÜ$¢-¯]l²r$Ï ™ðlÍ´ëÆý‡$. OÆð‡âýæÏ ÑÐ]l-Æ>Ë$.. Ðól$ 9Ð]l ™ól©¯]l ÐéÝùP-yýl-V>Ð]l$-&-fíÙ¨ f…MýSÛ¯ŒS (17321) ÐðlâôæÏ GMŠSÞ-{ò³-‹Ü, Ðól$ 12Ð]l ™ól©¯]l fíÙ¨ f…MýSÛ¯ŒS-&ÐéÝùP-yýl-V>Ð]l$ (17322) ÐðlâôæÏ GMŠSÞ-{ò³-‹Ü¯]l$ Ð]lĶæ* M>iõ³r f…MýSÛ¯ŒSMýS$ ^ólÆý‡$-Mö° ÐðlâýæÏ-¯]l$-¯]l²r$Ï A«¨M>Æý‡$-Ë$ ™ðlÍ´ëÆý‡$. H{í³ÌŒæ 28Ð]l ™ól©¯]l §é¯éç³N-ÆŠ‡-&-^èl-Æý‡Ï-ç³-ÍÏ (07648) ÐðlâôæÏ ÒMìSÏ GMŠSÞ-{ò³-‹Ü, H{í³ÌŒæ 29Ð]l ™ól©¯]l Æý‡MøÞ-ÌŒæ-&^èl-Æý‡Ï-ç³-ÍÏ (07052) ÐðlâôæÏ ÒMìSÏ GMŠSÞ-{ò³-‹Ü, H{í³ÌŒæ 29Ð]l ™ól©¯]l Ð]l¬fçœÆŠ‡-ç³NÆŠ‡ f…MýSÛ¯ŒS-&^èl-Æý‡Ï-ç³-ÍÏ (05293) ÐðlâôæÏ GMŠSÞ-{ò³-‹Ü, Ðól$ 1Ð]l ™ól©¯]l ^èlÆý‡Ï-ç³-ÍÏ&Ð]l¬-f-çœÆŠ‡-ç³NÆŠ‡ (05294) GMŠSÞ-{ò³-‹Ü M>iõ³r f…MýSÛ¯ŒSMýS$ ^ólÆý‡$-Mö° ÐðlâýæÏ-¯]l$-¯]l²r$Ï OÆð‡ÌôæÓ A«¨M>Æý‡$-Ë$ ™ðlÍ´ëÆý‡$. -
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
● బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన రాయపర్తి: ఆర్ఎంపీ వేసిన ఇంజక్షన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధిత బంధువుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలకేంద్రానికి చెందిన ఓర్సు మల్లేష్(35) తన భార్యతోపాటు మరికొంత మందితో కొండూరు గ్రామంలో మట్టి తవ్వకానికి వచ్చారు. ఈ క్రమంలో మృతుడు ఒంట్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ క్రమంలో గ్రామంలోని పరమేశ్వర క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ వద్దకు వచ్చారు. ఆయన మల్లేష్కు ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతసేపటికి మల్లేష్ మృతిచెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరమేశ్వర క్లినిక్లో వేసి ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. ఆర్ఎంపీ పరారీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, వర్ధన్నపేట ఎస్సై రాజు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ట్రాక్టర్ బోల్తా.. 12 మంది కూలీలకు గాయాలు కమలాపూర్: కూలీ పనులకు వెళ్లిన కూలీలను తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో శనివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వంగపల్లికి చెందిన 19 మంది కూలీలు మిర్చి పంట ఏరేందుకు వెళ్లి పనులు ముగించుకుని తిరిగి ట్రాక్టర్లో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కమలాపూర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 8 మందిని స్కానింగ్, మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి, ఒకరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
ఒత్తిడి.. పనిభారం
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మహిళా కండక్టర్ల ఆవేదన హన్మకొండ: ఆర్టీసీ యాజమాన్యం.. మహిళా కండక్టర్ల భద్రతను గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయాన్నే పిల్లలను వదిలేసి విధులకు వచ్చిన వారు.. రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్తే .. ఇంత అర్ధరాత్రి డ్యూటీ ఏంటని భార్యాభర్తల మధ్య విబేధాలు వస్తుండడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి ఆర్థిక ఆసరా ఉంటామని ఉద్యోగం చేస్తుంటే కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలని చూడకుండా అర్ధరాత్రి వరకు డ్యూటీలు వేస్తూ అధికారులు వేధిస్తున్నారని ఉద్యోగుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనిపించని సమయపాలన నిబంధనల మేరకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మహిళా కండక్టర్లు విధులు నిర్వహించాలి. కానీ, వరంగల్ రీజియన్లోని వరంగల్–2 డిపోలో రాత్రి 12 నుంచి ఒంటి గంట వరకు డ్యూటీలు చేయాల్సి వస్తోందని మహిళా కండక్టర్లు వాపోతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఈసమస్య తారాస్థాయికి చేరింది. చార్జింగ్ పేరుతో 2 గంటలకు పైగా సమయాన్ని వృథాగా గడపాల్సి వస్తోంది. ఆ రెండు గంటలు అదనంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ విషయమై మహిళా ఉద్యోగుల్లో తీవ్రఅసహనం వ్యక్తమవుతోంది. సమయం వృథా.. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వరంగల్ రీజియ న్కు మొత్తం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. వీటి నిర్వహణ బాధ్యతలు జేబీఎం ఎకోలైఫ్ సంస్థ చూసుకుంటుంది. 107 బస్సులు రోడ్లపై పరుగులు పెడుతుండగా.. మిగతావి అత్యవసర సమయాల్లో వాడేందుకు డిపోల్లో నిలిపి ఉంచుతా రు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ బస్సులు ఒకసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు తిరుగుతాయి. బ స్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినా.. డ్రైవింగ్లో తేడా ఉన్నా.. చార్జింగ్ త్వరగా దిగిపోతుందని జేబీఎం ఉద్యోగులు చెబుతున్నారు. ఒక్క ట్రిప్పు వెళ్లి రాగానే డిపోలో చార్జింగ్ చేసుకోవాలి. చార్జింగ్ పెట్టిన ప్రతీసారి 2 గంటల సమయం పడుతుంది. చార్జింగ్ ఎక్కే వరకు కండక్టర్లు వేచి ఉండా లి. దీంతో అదనంగా మరో రెండు గంటలు విధులు నిర్వహించాల్సి వస్తోంది. కాగా.. నిరీక్షించిన సమయాన్ని ఆర్టీసీ యాజమాన్యం డ్యూటీగా పరిగణించకపోవడం తగదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ఒక్కోసారి ఒక ట్రిప్పులో మధ్యలోనే చార్జింగ్ తగ్గిపోతుండడంతో సమీపంలోని డిపోలో చార్జింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు కండక్టర్లు చెబుతున్నారు. మరింత సమయం విధుల్లోనే గడుపాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కుటుంబంలో కలహాలు.. చార్జింగ్ పేరిట అదనంగా విధులు నిర్వర్తించాల్సి వస్తుండడంతో ఇళ్లకు వెళ్లాక మహిళా ఉద్యోగులకు కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య గొడవలవుతున్నాయని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి డ్యూటీ దిగిన మహిళా కండక్టర్లు ఇంటికి చేరుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని తెలిపారు. ఆ సమయంలో బస్సులు ఉండవని, ప్రైవేటు వాహనాల్లో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిబందనల మేరకు మహిళ కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీ ముగిసేలా చూడాలని కార్మిక సంఘాలతో పాటు, మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. వరంగల్ రీజియన్లో ఇలా..మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు: 112 వీటిలో సూపర్ లగ్జరీ: 20 డీలక్స్: 22 ఎక్స్ప్రెస్: 70 మొత్తం మహిళా కండక్టర్లు: 99 మంది (విడతల వారీగా విధులు) నిర్ణీత సమయానికి మించి విధులు.. రాత్రి అవుతుండడంతో కరువైన భద్రత ఆలస్యంగా ఇంటికి వెళ్తుండడంతో కుటుంబంలో విభేదాలువరంగల్ నగరంలోని గోపాల్పూర్కు చెందిన ఓ మహిళా కండక్టర్ (పేరు చెప్పడానికి ఇష్టపడడం లేదు) రాత్రి 8 గంటల వరకు నిర్వహించాల్సిన విధులు రాత్రి 12.30 వరకు డ్యూటీ చేయాల్సి వస్తోంది. ఆ సమయానికి తమ రూట్లో బస్సులుండవు. ఆటోలు కూడా చాలా అరుదు. చివరికి ఏదైనా ఆటో దొరికితే ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ‘పనిభారం ఎక్కువైంది. మానసికంగా ప్రశాంతంగా ఉండలేక పోతున్నా’ అంటూ ఆ కండక్టర్ కన్నీటిపర్యంతమవుతోంది.ఎలక్ట్రిక్ బస్సుల డ్యూటీతో అనారోగ్యం పాలవుతున్నాం.. ఎలక్ట్రిల్ బస్సుల డ్యూటీలో అనారోగ్యం పాలవుతున్నాం. ఒక ట్రిప్పు వెళ్లి రాగానే బస్సుకు చార్జింగ్ పెడుతున్నారు. చార్జింగ్ కావడానికి రెండు గంటలు పడుతుంది. ఈ స్టాండింగ్ టైమ్ పేరుతో రెండు గంటలు ఎలాంటి పని లేకుండా వేచి చూడాల్సి వస్తోంది. దీంతో రెండు గంటలు ఆలస్యంగా డ్యూటీ దిగాల్సి వస్తోంది. దీంతో ఇంటిలో సమస్యలు నెలకొంటున్నాయి. తద్వారా మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నాం. ఈ రెండు గంటలు డ్యూటీ టైమ్లో లెక్కించడం లేదు. – వెంకటమ్మ (పేరు మార్చాం) కండక్టర్త్వరలో చార్ట్ మారుస్తాం.. మహిళా ఉద్యోగులు సమయానికి డ్యూటీ ముగించుకునేలా చార్ట్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాం. రెండో ట్రిప్పు వెళ్లడానికి చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించాం. వాటిన అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. – జ్యోత్స్న, మేనేజర్, వరంగల్–2 డిపో -
కర్రిగుట్టలో కాల్పులు నిలిపివేయాలి
నయీంనగర్: ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని ఊసురు కర్రిగుట్టలో కాల్పులు నిలిపివేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర నేత ప్రొఫెసర్ హరగోపాల్ కో రారు. శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మధ్యభారతంలో ఆదివాసీల హనణాన్ని ఆపివేయాలని కోరారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. బ్రిటీష్ కాలం నుంచి మావోయిస్ట్ పార్టీ ఉందని, ఆదివాసీలు బలవుతున్నారని అన్నారు. ఆదివాసీ ప్రజలు భయానక వాతావరణంలో ఉన్నారని, కేంద్రం శ్మశానంలో చర్చలు జరపాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. మధ్యభారతంలో అపారవిలువైన ఖనిజ వనరులను దేశ, విదేశీ వాణిజ్య సామ్రాజ్యవాదులు కార్పొరేట్లతో ఒప్పందాలు చేసుకొని అందులో భాగంగా ఆదివాసులు వారికి అండగా ఉన్న మావో యిస్టులను అంతంచేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించి పాలన సాగిస్తోందన్నారు. సమాజ కోరిక మేరకు కేంద్రం ముందుకు రావాలని, ఏకపక్ష హనణాన్ని దేశ ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారన్నారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఇన్నారెడ్డి, రవిచందర్, తిరుపతయ్య, కుమారస్వామి, ఎం.శంకర్, శాంతి, గంగా ధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులతో ప్రభుత్వాలు చర్చలు జరపాలి పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ -
బీజేపీ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
కేయూ క్యాంపస్: బీజేపీ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని మే 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక సంఘాల జిల్లాస్థాయి సదస్సులో తీర్మానించారు. కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ విభాగం సెమినార్హాల్లో శనివారం నిర్వహించిన ఈ సదస్సులో వివిధ కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందన్నారు. కార్మికులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని కార్మికులు, ఉద్యోగులంతా విజయవంతం చేయాలన్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్పావని, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, ఐఎఫ్టీయూ రాష్ట్రకార్యదర్శి శ్రీనివాస్, ఏఐసీటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎమ్మెస్రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, రాగుల రమేష్, రాంమూర్తి, కుసుమ శ్యాంసుందర్, మైముద, రాజేందర్, రవి, చక్రపాణి, అశోక్, సంపత్, రాజేశ్వరి, కల్పన పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాల జిల్లాస్థాయి సదస్సులో తీర్మానం -
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
కాంగ్రెస్ ఇక ఖతమే!● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. ● రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక – IVలోu -
నేడు చింతలపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు (ఆదివారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రజ తోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాల ను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో.. రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభను ఎల్కతుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి. బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి చూడముచ్చటగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక రెడీ అయ్యింది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకోసం పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు.. గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్ అవిశ్రాంతంగా శ్రమించారు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని చేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఎల్కతుర్తి: సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో ఎలాంటి అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 511 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు మిగతా డిస్ట్రిక్ట్ గార్డ్స్ను నియమించారు. మొత్తం 1,100 మందికిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ తదితర ప్రాంతాల్లో సేవలందించనున్నారు. వరంగల్ నగరం నుంచి ఎల్కతుర్తి వరకు ప్రదర్శనగా వెళ్తున్న ఆటోలుగంటకుపైగా ప్రసంగించనున్న కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న అధినేత కేసీఆర్ నేరుగా సభావేదికకు సుమారు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. సుమారు 5.30 గంటల సమయంలో వేదికపైకి చేరుకునే అవకాశం ఉంది. వేదికపై ఆయన సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. పాతికేళ్ల పండుగకు తరలుతున్న జనం ఉమ్మడి వరంగల్ టార్గెట్ 2.50 లక్షల మంది జన సమీకరణలో నాయకుల తలమునకలు సాయంత్రం 4.30 గంటలలోపు సభకు చేరేలా ప్లాన్ 5.30 గంటల సమయంలో వేదికపైకి అధినేత కేసీఆర్ -
‘భూ భారతి’తో భూ సమస్యలు పరిష్కారం
● నూతన చట్టంతో పకడ్బందీగా రెవెన్యూ రికార్డులు ● అవగాహన సదస్సులో కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఎమ్మెల్యే కోరం కనకయ్యబయ్యారం/గార్ల: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం దొరకుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శనివారం బయ్యారం, గార్ల మండలాల్లో ఏర్పాటు చేసిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొన మాట్లాడారు. భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత విప్లవాత్మకమైన, పారదర్శకంతో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఈ చట్టం ద్వారా సాధ్యమవుతుందన్నారు. వ్యక్తిగతంగా తప్పులు చేయడానికి అవకాశం లేకుండా వ్యవస్థను అవినీతి రహితంగా మార్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో భూ భారతి చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని, రైతులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అంతకుముందు ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల, సర్వే ల్యాండ్ ఏడీ నరసింహమూర్తి, ఏడీఏ శ్రీనివాసరావు, డీపీఓ హరిప్రసాద్, తహసీల్దార్ విజయ, ఎంపీడీఓలు విజయలక్ష్మి, మంగమ్మ, దుర్గాప్రసాద్, ఏఓ రాంజీ, సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి, నాగేశ్వరరావు, ప్రవీణ్కుమార్, వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలి మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చేందుకే ఈ పథకం ప్రవేశ పెట్టిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్టొప్పో, కె వీర బ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, గృహ నిర్మాణ పీడీ రాజయ్య, అధికారులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలి
● ఐటీడీఏ పీడీ చిత్రమిశ్రా మహబూబాబాద్ అర్బన్: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను పాఠశాలల పునఃప్రారంభమైయ్యే నాటికి ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సుందరంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీడీ చిత్ర మిశ్రా అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను శనివారం సందర్శించి మాట్లాడారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు, డైనింగ్, రూఫ్, కాంపౌండ్ వాల్, మైనర్, మేజర్ రిపేర్లు మరమ్మతు చేయించాలన్నారు. త్వరలో 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఉత్తమ విద్యార్థులను గుర్తించి అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు దేశీరాం, హెచ్ఎం కోటేశ్వరి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఏఐపై శిక్షణమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు విద్యారంగంలో కృత్రిమ మేథ (ఏఐ)పై శిక్షణను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన శాఖ అధికారి దేశిరామ్ నాయక్ శనివా రం తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న 360 మంది ఉపాధ్యాయులకు, 109 సీఆర్టీలకు విద్యారంగంలో కృత్రిమ మేథ పాత్రపై జూమ్/వెబెక్స్ ఆన్లైన్ వేది కల ద్వారా అవగాహన తరగతులను ఈనెల 28 నుంచి మే 30వరకు నిర్వహించనున్నట్లు తెలి పారు. జిల్లాలో మొత్తం 469 మంది ఉపాధ్యాయులను 15బ్యాచులుగా విభజించి ఒక్కో రోజు ఒక్కో బ్యాచ్కు 6 సెషన్ల చొప్పున ఉద యం 10గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నామని, తప్పనిసరి గా ఉపాధ్యాయులు హాజరు కావాలన్నారు. జడ్జి తిరుపతికి వీడ్కోలు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా మూడున్నర సంవత్సరాల పాటు పనిచేసి మేడ్చల్ మల్కాజిగిరికి బదిలీపై వెళ్తున్న జూనియర్ సివిల్ జడ్జి తిరుపతికి న్యాయశాఖ ఉద్యోగులు శనివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను కొనియాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ కోర్టులోనే కాకుండా లోక్ అదాలత్లో వేలా ది కేసులను పరిష్కరించి ప్రత్యేక స్థానాన్ని ఏ ర్పరచుకున్నారన్నారు. ఈకార్యక్రమంలో సీని యర్ సివిల్ జడ్జి శాలిని శాకెల్లి, జిల్లా కోర్టు పరి పాలనాధికారి క్రాంతికుమార్, సీనియర్ సూపరిండెంట్లు శైలజ, మూర్తి, సంతోష్ కుమార్, డోలి అనిల్, వెంకన్న, అమరేందర్, పూస శ్రీని వాస్, పోలేపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. చట్టబద్ధ దత్తతతోనే పిల్లలకు హక్కులునెహ్రూసెంటర్: పిల్లలను చట్టబద్ధ దత్తతతోనే హక్కులు లభిస్తాయని బాలల సంరక్షణ అధి కారి నరేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీపూజిత నర్సింగ్లో శనివారం సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ అధికారి నరేష్, డాక్టర్ ఇంద్రాసేనారె డ్డి మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేయడం నేరమని, పిల్లలు వద్దు అనుకునే వారు ప్రభుత్వానికి అప్పగించవచ్చన్నారు. అనంతరం దత్తతకు సంబంధించిన కరపత్రాలను ఆస్పత్రి సి బ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలిపెద్దవంగర: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్ధతు ధర పొందాలని జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి నర్సింహరావు, ఆర్డీఓ గణేష్ అన్నారు. శనివారం మండలంలోని చిట్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు వేర్వేరుగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. -
మానుకోటలో ఏసీబీ అధికారుల సోదాలు
మహబూబాబాద్ రూరల్: సస్పెన్షన్కు గురైన జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషాపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న గౌస్ పాషా ఇంటికి ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ తన బృందంతో చేరుకుని విస్తృత సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఉంటున్న గౌస్ పాషా బంధువుల ఇళ్లలో ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.3.51 కోట్ల రూపాయల విలువైన వాహనాలు, వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, భవనాలకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ ఇంకా అధికంగా ఉంటుందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో, హైదరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ఉంటున్న బంధువు ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఏసీబీ అధికారుల సోదాల్లో గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావు, పలువురు ఏజెంట్లు, జూనియర్ అసిస్టెంట్ రవీందర్ వద్ద అదనంగా ఉన్న రూ.895, కిటికీలో పడేసిన రూ.300, మొత్తంగా రూ.62,795 నగదు, నూతన లైసెన్సులు, రెన్యువల్స్, ఫిట్ నెస్ కు సంబంధించిన కాగితాలు, పలు వాహనాల తాళం చేతులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో 2024 మే 28న జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా సస్పెన్షన్ కు గురయ్యారు. ఇప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే పలు ఆరోపణలు రావడంతో మాజీ జిల్లా రవాణా శాఖ అధికారి ఇంట్లో, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సస్పెండ్ అయిన డీటీఓ గౌస్ పాషాపై కేసు -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
నర్సంపేట రూరల్: నర్సంపేటలోని మల్లంపలి రోడ్డులో శుక్రవారం ఉరేసుకుని వివాహిత ఆత్మహ త్య చేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన హర్షియాబేగం (28) భర్త అబ్దుల్ గణితో కలిసి న ర్సంపేటలోని మల్లంపల్లి రోడ్డులో జీవనం సాగి స్తోంది. వీరి ఒక పాప. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హర్షియా బేగంను పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు కింద పడి ఒకరు.. ఖిలా వరంగల్/కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కోమటిపల్లి తండాకు చెందిన బా నోతు రమేశ్ (36) కుటుంబకలహాలతో గురువారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా డు. తాళ్ల పూసలపల్లి కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య బడి తండా సమీపాన ఈ ఘటన జరిగింది. రమేశ్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. జీవితంపై విరక్తి చెందిన గురువారం రాత్రి కేసముద్రం తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బడి తండా సమీపాన ఆఫ్లైన్పై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ కిందపడి బానోతు రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి బానోతు బీమా ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ భాస్కర్ తెలిపారు. వృద్ధురాలు.. గుర్తు తెలియని వృద్ధురాలు రైలు కింద పడి ఆత్మహ త్య చేసుకుంది. రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సు దర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 65 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వృద్ధురాలు వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో 377/41 మైలు రాయి వద్ద గుర్తు రైలు కింద పడి ఆత్మహత్య కు పాల్పడింది. ఈఘటనలో ఆమె తలకు శరీర భా గాలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. వృద్ధురాలు ఆకుపచ్చ రంగు, డిజైన్ గల చీర, ప సుపు రంగు జాకెట్ ధరించి ఉందని, ఆమె 5.2 ఎ త్తు ఉందని, గుండ్రని ముఖం ఉన్నట్లు తెలపిరాఉ. కాగా మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వరంగల్ రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీ ఎం మార్చురీలో భద్రపరిచినట్లు హెడ్కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు వరంగల్ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్ స్టేష న్, లేదా 97017 47014 ,87126 58585 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. -
శ్రీఽథమ్–25 వేడుకలు షురూ
హసన్పర్తి: నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సుమతిరెడ్డి మహిళా ఇంజనీరిగ్ కళాశాలలో ‘శ్రీథమ్–25’ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడారు. దేశ సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు. క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని.. విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మహేందర్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ శ్రీవాణి, ఏఓ వేణుగోపాల్తో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
కాళేశ్వరం: పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాన్సాయిపేటకు చెందిన కుడుదుల అనిల్(21) పల్సర్ బైక్పై కాళేశ్వరం వస్తుండగా.. అన్నారం మూలమలుపు వద్ద కిందపడి తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. అనిల్ మూలమలుపు వద్ద పడగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ యువకుడిని ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేక అదుపు తప్పి బైక్పై నుంచి పడి మృతి చెందాడా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి ఫోన్ ఆధారంగా అతడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. వర్ధన్నపేట: చనిపోయిన దున్నపోతును చూద్దామని రోడ్డుపైకి వెళ్లిన ఓ వృద్ధురాలిని అతి వేగంతో వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన రడపాక కొమురమ్మ(59) ఇల్లంద గ్రామ కమ్యూనిటీ హాల్లో నివాసం ఉంటోంది. శుక్రవారం ఉదయం జాతీయ రహదారిపై దున్నపోతు చనిపోయి ఉండడంతో చూడడానికి రోడ్డుపైకి వచ్చిన కొమురమ్మను ఖమ్మం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతి వేగంతో ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికులు కొమురమ్మను 108 ద్వా రా వరంగల్ ఎంజీంకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి మనవడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వర్ఘన్నపేట ఎస్సై రాజు తెలిపారు. శుభకార్యానికి వెళ్లొస్తుండగా.. మహబూబాబాద్ రూరల్: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం వేపచెట్టు తండాకు చెందిన హలావత్ మోహన్ (31) మహబూబాబాద్ మండలం అమంగల్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మోహన్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామ పరిధిలో తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఈనెల 23న వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గురువారం రాత్రి బైక్పై మహబూబాబాద్ మీదుగా ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాడు. ఈక్రమంలో మోహన్ ద్విచక్ర వాహనం మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారు మీదుగా వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈప్రమాదంలో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపిక తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. -
దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోంది
ఎల్కతుర్తి: దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోందని, ఈనెల 27న పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ రాజకీయ పార్టీ సమావేశం కాదని, రాష్ట్ర ప్రజలందరి పండుగ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు చింతలపల్లి సమీపంలో రజతోత్సవ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి సభ ఏర్పాట్లు పరిశీలించారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 50 వేల మంది తరలివస్తారని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వెల్లడించారు. పరిశీలించిన వారిలో పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు పేర్యాల రవీందర్రావు ఉన్నారు. నేతల తాకిడి.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాజ్యాసభ సభ్యులు మద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, ఉమ్మడి ఖమ్మం నుంచి రేగా కాంతారావు, హరిప్రియ, కామారెడ్డి నుంచి జాజుల సురేందర్ తదితర నేతలు సభాస్థలికి రాగా వారికి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్, నాగుర్ల వెంకన్న ఏనుగుల రాకేశ్రెడ్డి తదితరులు సభా ప్రాంగణంలో ఏర్పాట్ల గురించి తెలిపారు. వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలను చూపించారు. దండులా కదిలిరావాలి.. రజతోత్సవ సభకు ప్రజలు దండులా కదిలి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాకు కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభాస్థలి పరిశీలన -
మిర్చి రైతులకు మెరుగైన ధర ఇవ్వాలి
● జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు నాణ్యత ప్రకారం మెరుగైన ధరల్ని ఇచ్చేందుకు వ్యాపారులు కృషి చేయాలని వరంగల్ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మిర్చి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మిర్చి ధరలపై సుధీర్ఘంగా చర్చించారు. తేజ రకం మిర్చిని జిల్లాలోని రైతులు ఖమ్మం మార్కెట్కు తరలించడంపై అధికారులు స్పందించి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా తేజ రకం మిర్చి ధరలు వరంగల్, ఖమ్మం మార్కెట్లో వ్యత్యాసం ఎక్కువగా ఉందని, రైతుల నుంచి వచ్చిన ఆరోపణలను వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి నంబర్–1 క్వాలిటీ వెళ్తుందని, ఇక్కడికి 2, 3 రకం వస్తున్నందున ఈపరిస్థితులున్నట్లు వ్యాపారులు చెప్పారు. ఖమ్మం మార్కెట్ నుంచి తెచ్చిన షాంపిళ్లను వారి ముందు పెట్టి వరంగల్కు వచ్చిన మిర్చి ఒకేలా ఉన్నా ఎందుకు ధరల్లో వత్యాసం ఉందని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి వ్యాపారులు ఘాటు తక్కువ ఉందని, కలర్ తక్కువ ఉందని వివిధ కారణాలు చెప్పినా.. అధికారులు సంతృప్తి చెందలేదని తెలిసింది. వరంగల్ మార్కెట్కు వచ్చే మిర్చికి నాణ్యతా ప్రమాణాల ప్రకారం.. మెరుగైన ధరలు చెల్లించేలా చాంబర్ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జేడీఎం సూచించారు. సోమవారం నుంచి ఈసమస్యను పరిష్కరించేందుకు సహకారం అందిస్తామని వ్యాపారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. సమావేశంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జి.రెడ్డి, చాంబర్ ప్రతినిధులు బొమ్మినేని రవీందర్రెడ్డి, వేద ప్రకాశ్, రాజు కరాణి తదితరులు పాల్గొన్నారు. -
కుల దూషణ కేసులో ఒకరికి జైలు
వరంగల్ లీగల్: వరంగల్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిని బెదిరించి కులం పేరుతో దూషించిన నేరంలో నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామానికి చెందిన నేరస్తుడు యం.మోహన్రెడ్డి, ఆరు నెలల జైలు శిక్ష మూడు వేల జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి మనీష శ్రావణ్ ఉన్నమ్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2010 మార్చి 29న అప్పటి జెడ్పీ చైర్పర్సన్ అయిన లకావత్ ధన్వంతి తన అధికార బాధ్యతల నిర్వహణలో భాగంగా కార్యాలయంలో ఉన్న సమయంలో నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామానికి చెందిన మోహన్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ధన్వంతి వద్దకు వచ్చి తనను తాను కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిగా పరిచయం చేసుకున్నాడు. అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చాడు. పరిశీలించిన చైర్పర్సన్ ప్రస్తుతం నిధులు లేవు మరోసారి చేస్తానని చెప్పగా.. గట్టిగా అరుస్తూ ‘నువ్వెంత? నువ్వు గెలిచావు.. నేను ఓడిపోయాను.. ఇద్దరం సమానమే నాకు నిధులు ఇవ్వాల్సిందే’ అని గట్టిగా అరుస్తూ టేబుల్పై కొట్టగా అది విన్న పోలీసులు, గన్మెన్, సిబ్బంది చైర్పర్సన్ గదిలోకి వచ్చారు. అందరి ఎదుటనే రిజర్వేషన్ వల్ల లంబాడీ కులం నుంచి వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టించారని బెదిరించాడు. కులం హోదాను అవమానిస్తూ దూషించాడు. దీనిపై చైర్పర్సన్ ధన్వంతి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్తుడు యం.మోహన్రెడ్డి, ఆర్నెళ్ల జైలు శిక్ష.. రూ.3 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. కేసును పీపీ సంతోశ్ వాదించగా సాక్ష్యులను కానిస్టేబుల్ చందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులకు బెయిల్భూపాలపల్లి అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో పలువురు నిందితులకు భూపాలపల్లి జిల్లా ప్రధాన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 19న జరిగిన హత్య కేసులో పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపగా.. ఇద్దరు వ్యక్తులకు గత నెలలో బెయిల్ వచ్చింది. కొత్త హరిబాబు, రేణుకుంట్ల కొమురయ్యకు మినహా మిగితా 8 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. హరిబాబు, కొమురయ్య హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. హైకోర్టు నుంచి బెయిల్ రావాల్సి ఉంది. దంపతుల అదృశ్యం.. కేసు నమోదుకాజీపేట: దాదాపు 5 రోజులుగా భార్యాభర్తలు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. కాజీపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హనుమకొండ జవహర్ నగర్ కాలనీకి చెందిన అయిత సందీప్, మానస ఈనెల 21న ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఇళ్లలో ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. గురువారం రాత్రి వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో బైక్ లభించడంతో సందీప్ తండ్రి సంపత్కుమార్ కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ చేపట్టినట్లు వివరించారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి అంటే కూల్చేవాడని, అది హైడ్రాతో అర్థమైందన్నారు. ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ధైర్యాన్ని కల్పించేందుకే బీఆర్ఎస్ సభ జరుగుతుందన్నారు. మానుకోట నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలన్నారు. సభకు 10లక్షల మందికి పైగా జనాలు రానున్నారని, అందుకోసం 15లక్షల వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారన్నారు. కొంత మంది ప్రైవేట్ పాఠశాలల యజమానులు బస్సులు కిరాయికి ఇచ్చేందుకు సహకరించడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 27న పార్టీ జెండా ఆవిష్కరణ చేసి సభకు తరలిరావాలన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు మారుతా యని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అనంతరం నాయకులకు పార్టీ కండువాలు, సామగ్రిని పంపిణీ చేశారు. సమావేశంలో నాయకులు రవి, మురళి, రంజిత్రెడ్డి, జనార్దన్, రాజు, అశోక్, ఫరీద్, ప్రభాకర్, రావిశ్, సలీం, జానీ తదితరులు పాల్గొన్నారు. సభతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు బీఆర్ఎస్ రజతోత్సవ సభతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీలోని వెంకటేశ్వర బజార్లో శుక్రవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ ఽశంకర్నాయక్ ఇంటింటా ప్రచారం చేశారు. మాజీ మంత్రి మహిళలకు కుంకుమ బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. నాయకులు లూనావత్ అశోక్, నాయిని రంజిత్రెడ్డి, గద్దె రవి, గోగుల రాజు, చిట్యాల జనార్దన్, సలీం పాల్గొన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ కురవి: ప్రతీ ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలను నివారించి మలేరియాకు అడ్డుకట్ట వేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రం నుంచి గుడి సెంటర్ వరకు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల దోమలు వస్తాయని తెలిపారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్బాల్స్ వేయాలని, ప్రతీ శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించాలని సూచించారు. పీహెచ్సీ డాక్టర్ విరాజిత, మలేరియా ప్రోగ్రాం అధికారి సుధీర్రెడ్డి, ప్రసాద్, పురుషోత్తం, గోపిచంద్, శ్రీహరి, గౌసీద్దున్, స్వా మి, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
మహబూబాబాద్
శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025చలో ‘రజతోత్సవం’ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో అంగరంగ వైభవంగా ఉద్యమ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించేందుకు వేదిక సిద్ధమైంది. సభకోసం సూర్యాపేట జిల్లానుంచి ఎడ్లబండ్లపై బయలుదేరిన గులాబీ శ్రేణులు శుక్రవారం సాయంత్రానికి వరంగల్ నగర శివారుకు చేరుకున్నాయి. శనివారం ఉదయం ఎల్కతుర్తికి బయలుదేరనున్నాయి. Iశుక్రవారం ఉష్ణోగ్రతలు( డిగ్రీ సెల్సియస్)42.6ఖిలావరంగల్హన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవ డం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్, రూఫ్ గార్డెన్ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితులనుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడు తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్ షేడ్నెట్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, కషాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. – చేరాల రాకేశ్, వరంగల్ ఉద్యాన అధికారి (టెక్నికల్) పనులు పూర్తి చేయాలి కొత్తగూడ: ఆశ్రమ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని స్పోర్ట్స్ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా పీఓ మాట్లాడుతూ.. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సిన పనులను చేయాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయాలని, కావాల్సిన పనులకు నివేదికలు పంపాలని ఏఈ రవికి సూచించారు. ఆమె వెంట ఏటీడీఓ భాస్కర్, అధికారులు ఉన్నారు. కేసీఆర్ను ప్రజలు నమ్మరు.. మహబూబాబాద్ అర్బన్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండుసార్లు అఽధికారం ఇస్తే నిర్బంధాలు, దోపిడీ, కుటుంబ పాలన సాగించిన మాజీ సీఎం కేసీఆర్ను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని తెలంగాణ ఉద్యమాకారుల రాష్ట్ర వేదిక చైర్మన్ కూరపాటి వెంకట్నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఎంతో మంది అమరుల త్యాగంతో తెలంగాణ సాధిస్తే.. సెంటిమెంట్తో కేసీఆర్ పదవులు చేపట్టి దళితులు, బహుజనులను నిర్బంధించి తమ నిజ స్వరూపాన్ని చాటుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభను ఉద్యమాకారులు వ్యతిరేకిస్తున్నామన్నారు. కె.శంకర్, కృష్ణారావు, అనిల్, మల్లేశ్, భిక్షం ఉన్నారు. జూనియర్ సివిల్ జడ్జిల బదిలీవరంగల్ లీగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి చండీశ్వరదేవిని యాదాద్రి భువనగిరికి బదిలీ చేయగా.. ఆస్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.పూజను నియమించారు. ఖాళీగా ఉన్న నర్సంపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెండో జూనియర్ సివిల్ జడ్జి ఎస్.అంకిత్ను నియమించారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లింగం శాలినిని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బదిలీ చేయగా.. ఆస్థానంలో ఎల్బీనగర్ రెండో జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్ను నియమించారు. మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా హైదరాబాద్కు చెందిన జూనియర్ సివిల్ జడ్జి ఎం.స్వాతిని నియమించారు. మహబూబాబాద్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతిని రెండో జూనియర్ సివిల్ జడ్జిగా మల్కాజ్గిరికి, ఆయన స్థానంలో హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్వపల్లి కృష్ణతేజ్ను నియమించారు. తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి మట్టా సరితను పెద్దపల్లి జిల్లా నందిమేడారం కోర్టుకు, ఆస్థానంలో షాద్నగర్ కోర్టుకు చెందిన జడ్జి ధీరజ్కుమార్ను నియమించారు. భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.రాంచందర్రావును సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కు, ఆయన స్థానంలో మేడ్చల్ కోర్టుకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్నాయక్ను బదిలీ చేశారు. ములుగు జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్నను నియమించగా.. ములుగు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌఖ్యను హైదరాబాద్కు బదిలీ చేశారు. సభకు భారీగా తరలిరావాలిగార్ల: హనుకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పిలుపునిచ్చారు. శుక్రవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. నాయకులు పి.రాధాకృష్ణ, లింగాల ఉమేశ్, మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, బి.మురళి, ధరావత్ సక్రు, ఎండి ఖదీర్, గాజుల గణేశ్, బి.లక్ష్మారెడ్డి, మీగడ శ్రీనివాస్, బాలునాయక్ పాల్గొన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలిమరిపెడ రూరల్: రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డీఆర్డీఓ మధుసూదన్రాజ్ అన్నారు. శుక్రవారం మరిపెడ మండలం వీరారం, పురుషోత్తమాయగూడెం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏపీఎం బానోతు రాములు, సీసీలు రుక్మిణి, చందూలాల్, సీఏ రాణి, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.42.4సీరోలు (మానుకోట)42.9ములుగు రోడ్డు42.8జఫర్గడ్43.2కన్నాయిగూడెం42.5ములుగుఎంజీఎం : వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఎం. పవన్కుమార్ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకోవా ల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు. ● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది. ● తేలిగ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి ● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి. ● అహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది. ● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు. బీపీ, షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్, ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్స్) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. ● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్ సలహా తీసుకోవాలి. ● డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. ● డాక్టర్ సలహా లేకుండా మందులు మానేయరాదు. ● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. – డాక్టర్ ఎం.పవన్కుమార్, ఎండీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, భూపాలపల్లిఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలుఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోల్బెల్ట్ ఏరియా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మే నెలలో 46డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం.. ● ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన వైనం ● వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు ● పక్షులు, పశువులకు తాగునీరు అందుబాటులో ఉంచుదాం.. ● వాహనాల బ్యాటరీపై అధిక లోడ్ ఉండకుండా చూసుకోవాలి.. ● ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు– ఎండీ జాఫర్, సీనియర్ మెకానిక్ ఖిలా వరంగల్: వేసవిలో ఏ వాహనమైన ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజనాయిల్ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి. అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్ క్లాత్ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్ ఆయిల్ చెక్చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్ వేడి తగ్గి కూల్ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పార్కింగ్ చేయడం మంచిది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బైక్ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్ పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్ సర్క్యూట్కు ఆస్కారం ఉంటుంది. చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్ – డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్ ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్కు గురవుతారు. హీట్ స్ట్రోక్ లక్షణాలు.. ● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది ● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు. ● పసిపిల్లలు డల్గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి. ● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. ● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి. ● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి. మూగజీవాలకు తాగునీరు అందిద్దాం – నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేట జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్ల వెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి. ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి – కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్ నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలిగిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండెలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్కు చూపించాలి. గూడూరులో నిర్వాహకులు కూర్చునేందుకు వేసిన పాకఎండకు ఎండుతూ.. గూడూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మాయిశ్చర్ వచ్చేందుకు రైతులు రోజుకు రెండు, మూడుసార్లు ధాన్యాన్ని తిరగబోస్తున్నారు. ఈక్రమంలో కాసేపు సేదదీరడానికి టెంట్ ఏర్పాటు చేయలేదు. తాటిపత్రితో నిర్వాహకుల కోసం పాక వేశారు. అందులోకి వెళ్తే తాటిపత్రి నుంచి వేడి వచ్చి అక్కడ ఉండలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం ధాన్యం తిరగబెట్టేటప్పుడు నీడ కోసం చూస్తే ఎక్కడ కనిపించడం లేదని, అనారోగ్యానికి గురవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నీడ లేక ఇబ్బందులు పడుతున్నాం పది రోజుల క్రితం వడ్లు అమ్మడానికి తీసుకొచ్చాను. తేమశాతం లేదనడంతో ఆరబెట్టాం. మాయిశ్చర్ రావడం కోసం రోజుకు నాలుగుసార్లు వడ్లను తిరగబెడుతున్నా. మండుటెండలో కూడా ఆరబోసిన గింజలను నేర్పాల్సి వస్తుంది. కొద్దిసేపు నీడలో ఉందామని చూస్తే, నిర్వాహకులు వేసుకున్న పాకలో ఎండ వేడిమి తప్పడం లేదు. నీడ కోసం పాకలు వేస్తే బాగుంటుంది. వేడి గాలికి క్యాన్లోని మంచి నీళ్లు కూడా తాగలేని పరిస్థితి. నిర్వాహకులను అడిగితే.. తాముండడానికే నీడ, చల్లని నీళ్లు లేవని అంటున్నారు. – ఓర్సు వెంక్నన్న, రైతు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉందని రైతులు పేర్కొన్నారు. టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ధాన్యం ఆరబెట్టిన అనంతరం సమీపంలోని చెట్లనీడలో కూర్చుంటున్నారు. అలాగే ఇళ్ల నుంచి మంచినీరు వెంట తెచ్చుకుని తాగుతున్నారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు. మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం మా గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల క్రితం 15 పుట్ల ధాన్యాన్ని ఆరబోసుకున్నాం. ఇక్కడ తాగునీరు ఏర్పాటు చేయలేదు. ఇంటి వద్ద నుంచి మంచినీరు తెచ్చుకుని తాగుతున్నాం. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ధాన్యం ఆరబోసి నీడపట్టున ఉండి కాపాలా కాయాల్సి వస్తుంది. – కొమ్ము కట్టయ్య, రైతు, జమాండ్లపల్లి టెంట్లు ఏర్పాటు చేయలేదు.. నేను పది రోజుల క్రితం ఆరుపుట్ల ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో ఆరబోశాను. మాకు ఇక్కడ ఎలాంటి టెంటు సౌకర్యం ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నం సమీపంలోని చెట్ల నీడలో ఉంటున్నాం. మండే ఎండలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాలను గుర్తించి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. – అజ్మీరా విజేందర్, కౌలురైతు, సీత్లాతండా●సభకు ఇలా వెళ్లొద్దాం..రూట్మ్యాప్ వివరాలు– IIలోuఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలిన్యూస్రీల్వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త..వాహనాలు జరభద్రం.. చెట్టు నీడే దిక్కు..పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కరువు అందుబాటులో లేని టెంట్లు, తాగునీరు చెట్ల కిందే సేదదీరుతున్న రైతులు -
అఫ్లియేషన్ కోసం తనిఖీలు నిర్వహిస్తాం
● కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు 2025–26 విద్యాసంవత్సరానికి అఫ్లియేషన్ ఇచ్చేందుకు కమి టీలతో తనిఖీ చేయిస్తామని కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల కళాశాలల కరస్పాండెట్లు, ప్రిన్సిపాల్స్తో క్యాంపస్లోని పరి పాలనాభవనం సెనెట్హాల్లో గురువారం అఫ్లియేషన్, అకాడమిక్ అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలల్లో ల్యాబ్స్, లైబ్రరీ, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. కళాశాల విద్యార్థులకు ‘ఆపార్ ఐడీ’ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పోతే పోండి.. తమకు ప్రభుత్వంనుంచి ఫీజురీయింబర్స్మెంట్ గత మూడేళ్లుగా ఇవ్వలేదని అందుకే పరీక్షల ఫీజు లు చెల్లించడంలేదని ఈనెల 28నుంచి నిర్వహించనున్న డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలను వాయిదావేయాలని ప్రైవేట్ కళాశాలల యాజామాన్యాలు కోరాయి. ఈ సమావేశం కేవలం అఫ్లియేషన్ కోసం అకడమిక్ పరంగా విషయాలను మాట్లాడేందుకే నిర్వహిస్తున్నామని ప్రతాప్రెడ్డి చెప్పడంతో.. తాము సమావేశాన్ని బహిష్కరిస్తామని ప్రైవేట్ యాజమాన్యాల బాధ్యులు అన్నారు. దీంతో వీసీ ప్రతాప్రెడ్డి స్పందిస్తూ పోతే పొండి.. ఉన్నవారితోనే మాట్లాడుతానని అన్నారు. దీంతో సమావేశం రసాభాసాగా మారింది. రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోయేషన్ బాధ్యుడు ఒకరు కలుగజేసుకుని సమావేశం నిర్వహించాలని కోరడంతో అంతా సద్దుమణిగింది. పరీక్షలు జరగనివ్వం.. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేవరకు ఫీజులు చెల్లించకపోగా.. పరీక్షలు సైతం నిర్వహించనివ్వమని ప్రైవేట్ కళాశా లల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో స్పందించిన కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. కే యూ పరిధిలో లక్షా 70 వేలకుపైగా డిగ్రీ విద్యా ర్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందని వారికి ఇ బ్బంది కలగనీవొద్దని కోరారు. టైంటేబుల్ ప్రకారం పరీక్షల ఫీజులు చెల్లించిన కళాశాలలకు పరీక్షలకు నిర్వహిస్తామని వీసీ పేర్కొన్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సీడీసీ డీన్ వరలక్ష్మి, అకడమిక్ డీన్ హనుమంతు పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలు చేపట్టాలి
● ఎస్సార్ వీసీ డాక్టర్ దీపక్గార్గ్ హసన్పర్తి: సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టాల ని ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దీపక్గార్గ్ అన్నారు. నగ ర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో యంత్ర–25 ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి డాక్టర్ దీపక్గార్గ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ‘వివిధా హబ్’ ప్రాజెక్ట్ భవిష్యత్లో కంటెంట్ గ్లోబలైజేషన్ను నిర్ధేశం చేస్తోందన్నారు. ప్రపంచ అవసరాలకనుగుణంగా విద్యార్థులు ఆవిష్కరణలు ఉండేలా ప్రోత్సహించాలన్నారు. జ్యూరీ అధ్యక్షుడు నాగేంద్రకుమార్ మా ట్లాడుతూ ‘వివిధా హబ్’ను మెరుగు పరిచి పాఠశాలలు, యూ నివర్సిటీలు, సామాజిక సేవా సంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్కు అనుగుణంగా సదుపాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు సమాయత్తం కావా లని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి టీజీ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ కో డైరెక్టర్, సీఈలు, 16 సర్కిళ్ల ఎస్ఈలతో రాబోయే 5, 10 సంవత్సరాల కాలానికి సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రా బోయే 5, 10 సంవత్సరాల కాలానికి సంబంధించి ట్రాన్స్ కో, డిస్కం పరిధిలో కొత్తగా నెలకొల్పే సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త పవర్ టాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై ట్రాన్స్కో సీ ఈలు, ఎస్ ఈలను అడి గి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సబ్ స్టేషన్లకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కొత్తగా సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి సెక్షన్ ఏఈ వారానికోసారి పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. త్వరలోనే డాష్ బోర్డు ప్రారంభించే డాష్ బోర్డు ద్వారా ప్రతి ఒక్కరూ సమగ్ర సమాచారాన్ని చూసుకునే సౌకర్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ట్రా న్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు అశోక్ కుమార్, సదర్ లాల్, మధుసూదన్, ట్రాన్స్కో సీఈలు శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్, డిస్కం సీఈలు తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, బికం సింగ్, ఎస్ఈలు పాల్గొన్నారు. -
ఇంటర్ తర్వాత ఎటు..
ఇంజనీరింగ్.. ఇంటర్లో ఎంపీసీ చదివిన వారు ఇంజనీరింగ్ కోర్సుకు అర్హులు. ఎంసెట్లో వచ్చిన మార్కులు/ ర్యాంక్ ఆధారంగా ఇందులో ప్రవేశం లభిస్తుంది. ప్రధానంగా ఈసీఈ, కంప్యూటర్స్ సైన్స్ విభాగాలు మేలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్తో కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయంటున్నారు.పిల్లల భవిష్యత్పై తల్లిదండ్రుల ఆలోచన ● కోర్సుల ఎంపికపై తర్జనభర్జన ● విద్యార్థుల ఆసక్తి, ప్రణాళిక ముఖ్యమంటున్న నిపుణులు ● అందుబాటులో రెగ్యులర్తోపాటు పలు వృత్తి విద్యా కోర్సులుకామర్స్.. ప్రస్తుతం కామర్స్ కోర్సులకు మంచి భవిష్యత్ ఉంది. ఇంటర్లో ఎంఈసీ, సీఈసీ చదివిన వారు బీకాం కంప్యూటర్స్, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో చేరొచ్చు. దేశంలోని వివిధ ప్రైవేట్ కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఎన్నో జాతీయ బహుళ జాతి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఈ కోర్సుతో మెండుగా ఉన్నాయి.ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఇకపై ఏ కోర్సులు చదివిస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనలో పడ్డారు తల్లిదండ్రులు. రెగ్యులర్ కోర్సులకు భిన్నంగా వృత్తి విద్య లేదా.. మరేదైనా కోర్సు.. మొత్తానికి తమ పిల్లలు తక్కువ సమయంలో అభివృద్ధిలోకి వచ్చేలా చదువు ఉండాలని తల్లిదండ్రుల ఆలోచన.. ఇలాంటి సమయంలో ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు ఉంటాయి.. ఏ కోర్సుతో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే అంశాలపై ప్రత్యేక కథనం. – ఖిలా వరంగల్బీఎస్సీ డిగ్రీ.. ప్రస్తుతం బీఎస్సీ డిగ్రీ చదివే వారికి క్యాంపస్ ఎంపికల ద్వారా మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇందులో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంపీఈ, ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సులు ఉన్నాయి. ఇవి పూర్తి చేసిన వారు సులభంగా ఉద్యోగాలు సాధించొచ్చు. వైద్య కోర్సులు.. ఇంటర్లో బైపీసీ చదవిన వారు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా వైద్య కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మసీ, బీహెచ్ఎంఎస్, నర్సింగ్ వంటి కోర్సులు చేయొచ్చు. ఈకోర్సుల్లో చేసిన వారికి వివిధ ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. సాంకేతిక కోర్సుల్లో మంచి మార్కులు పొందిన వారు ట్రిపుల్ ఐటీ, జేఈఈ, ఎన్ఐటీ రాసేందుకు అర్హులు. బిట్స్ పిలానిలో ప్రవేశం కోసం బీట్శాట్ రాయాలి. స్పేస్ సైన్స్ అభ్యసించాలంటే శాట్ రాయాల్సి ఉంటుంది. న్యాయ కోర్సులు ఇంటర్లో ఏ గ్రూపు చదివిన వారైనా ఐదేళ్ల లా కోర్సుకు అర్హులే.. లా సెట్ ద్వారా ఇందులో ప్రవేశం ఉంటుంది. ప్రస్తుతం వివిధ కంపెనీలు లా చదవిన వారిని ప్రాధాన్యతనిచ్చి కొలువులు కల్పిస్తున్నాయి. లీగల్ అడ్వైజర్స్గా కంపెనీల్లోనూ అవకాశం ఉంది. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.కోర్సుల ఎంపికే కీలకం విద్యార్థుల భవితకు కోర్సుల ఎంపిక కీలకం. తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలనుకోవడం తల్లిదండ్రులు తప్పుకాదు. కానీ, పిల్లల ఆసక్తి తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. ఎక్కువశాతం తమకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో పిల్లలను చేర్పిస్తున్నారు తప్పితే.. భిన్నమైన కోర్సుల్లో జాయిన్ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థులు భవిష్యత్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున ఇంటర్ తర్వాత విద్యార్థులు చదవాల్సిన కోర్సులపై కొంత పరిశోధన చేయడం లేదా విద్యావంతుల సలహాలు తీసుకోవడం మేలు.వ్యవసాయ కోర్సులు.. వ్యవసాయ శాఖతోపాటు, వెటర్నరీ పరిశోధన రంగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ఇంటర్ బైపీసీ చేసిన విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఏబీఎస్సీలో అగ్రికల్చర్, హార్టీకల్చర్, అక్వాకల్చర్, సిరి కల్చర్, డెయిరీ టెక్నాలజీ, డెయిరీ మేనేజ్మెంట్ తదితర కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు పొందొచ్చు. ఒకేషనల్ కోర్సులు పలు ఒకేషనల్ (వృత్తి విద్య) కోర్సులు సైతం ఇంటర్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా త్వరగా స్థిరపడే అవకాశం ఉంది. దీంతోపాటు యానిమేషన్, గ్రాఫిక్స్, మీడియా, జర్నలిజం, తదితర కోర్సుల ద్వారా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. కాగా, హైదరాబాద్, హనుమకొండ వంటి నగరాల్లో ఈ ఒకేషనల్ కోర్సులను అందించే కళాశాలలు, ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి.విద్యార్థుల ఆసక్తి ముఖ్యమే..విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది ఇంటర్ తర్వాత చదివే కోర్సు. ఈసమయంలో కోర్సు ఎంపిక, విద్యార్థుల ఆసక్తి ముఖ్యం. ఏ రంగం ఎంచుకుంటే భవిష్యత్ బాగుంటుందో ముందే నిర్ణయించుకోవాలి. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేసుకుని అడుగువేయాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. – సత్యనారాయణ, నవోదయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, వరంగల్ బీఏ డిగ్రీ.. పోటీ పరీక్షలకు బీఏ కోర్సు తోడ్పాటునిస్తుంది. సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు బీఏలో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, చరిత్ర, స్పెషల్ తెలుగు వంటి కోర్సుల ఎంతగానో తోడ్పడతాయి. డైట్ సెట్ ద్వారా డీఈడీ చేయొచ్చు. ఇంటర్ తర్వాత సీఏ, సీఎస్ (కంపెనీ సెక్రటరీ)లకు వాణిజ్య వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. పలు రకాల బ్యాంకు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆర్ఆర్బీ ( రైల్వే), గ్రూపు–4, పోలీస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలను పొందొచ్చు. బ్యాంకుల చేయూత ప్రతిభావంతులకు ఆర్థిక అడ్డంకులు తొలగించేందుకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఉన్నత విద్యకు రూ.10 లక్షల వరకు ఇస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనే వారికి రూ.25 లక్షల వరకు రుణ సదుపాయం ఉంది. థర్డ్పార్టీ హామీతో రూ.7 లక్షలు, ఎటువంటి హామీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.● -
చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమిది..
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 16 నెలలు గడుస్తున్నా నేటికీ చిన్న కార్యక్రమం కూడా చేపట్టిని చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని తేలిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత అన్నారు. ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆమె గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. మమ్మల్ని, మా కేసీఆర్ను జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి పలు కార్యక్రమాలు రూపొందించే స్థాయికి మాపార్టీ ఎదిగిందని అన్నా రు. తెలంగాణ ప్రజల ఆశ్వీరాదంతో దేశ వ్యాప్తంగా సేవలు కొనసాగించేందుకు బీఆర్ఎస్గా రూపాంతరం చెందినట్లు తెలిపారు. ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. రా బోయే రోజుల్లో బీఆర్ఎస్ మహిళా నాయకత్వాన్ని పటిష్ట పరుస్తామన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ భావితరా లకు ప్రజలకు, యువతకు తమ పార్టీ ఉద్యమం కొ సాగింపు విషయాలపై దిశానిర్దేశం చేసేందుకు ప్రజ లు సభకు రాబోతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభు త్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్, నరేందర్, రవిశంకర్, మాలోతు కవిత, చంద్రావతి, లలితా యాదవ్, శ్రీదేవి, హరిరమాదేవి, సుశీలారెడ్డి, రుద్ర రాధ, మాధవి, ప్రసన్న, చారులత, శాలిణి, స్వప్న, హర్షిణి, వసంత, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన.. రజతోత్సవ సంబురాల ఏర్పాట్లను గురువారం సాయంత్రం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు పరిశీలించారు. సభాస్థలిని పరిశీలించిన సీపీ రజతోత్స సభా స్థలాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఏర్పాట్లు, బారీకేడ్లు, హెలీప్యాడ్, వీఐపీ పార్కింగ్, వాహనాల పార్కింగ్ రూట్లు, ప్రధాన వేదిక తదితర విషయాలను బీఆర్ఎస్ నాయకులు సీపీకి మ్యాప్ ద్వారా వివరించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ రూట్లను ఏర్పాటు చేసుకోవాలని, అంబులెన్స్లు, అందుబాటులో ఉంచుకోవాలని సీపీ సూచించారు. ఆయన వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఏఆర్ అడిషనల్ ఎస్సీ సురేష్, ఏఆర్ ఏసీపీ అనంతయ్య, కాజీపేట ఏసీపీ తిరుమల్ ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెకిలి మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత -
జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇన్చార్జ్ డీన్గా వెంకన్న
విద్యారణ్యపురి: హైదరాబాద్లోని సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, చిత్రవాణి స్టూడియో ఇన్చార్జ్ డైరెక్టర్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం వెంకన్నను వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇన్చార్జ్ డీన్గా (పీఠాధిపతి)నియమించారు. ఈ మేరకు అక్కడినుంచి బదిలీ చేస్తూ గురువారం ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో వెంకన్న అక్కడే రిజిస్ట్రార్ కె.హనుమంతురావుకు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. ఈనెల 25నుంచి వరంగల్లో గిరిజన విజ్ఞాన పీఠంలో విధులను నిర్వర్తించనున్నారు. వరంగల్ గిరిజన విజ్ఞాన పీఠాధిపతిగా ఇప్పటివరకు బాధ్యతలను నిర్వర్తించిన ప్రొఫెసర్ బాబురావును శ్రీశైలంలోని చరిత్ర, సాంస్కృతిక పురావస్తు శాస్త్ర పీఠాధిపతిగా బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
వాగ్దేవి కళాశాల పీజీ సెమిస్టర్ ఫలితాల విడుదల
హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల (అటానమస్) పీజీ ఒకటో సెమిస్టర్ ఫలితాలను గురువారం విడుదల చేశారు. పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించగా.. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.శేషాచలం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హరీందర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిషన్స్ సి.దత్తాత్రేయ గురువారం హనుమకొండ నయీంనగర్లోని కళాశాలలో ఫలితాలను విడుదల చేశారు. వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మొత్తం 112 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 95 మంది (84.82% ) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఎంకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), ఎమ్మెస్సీ (న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్)లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఎమ్మెస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) 97.06 శాతం, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) 87.50 శాతం, ఎమ్మెస్సీ (డేటా సైన్స్) 85.71 శాతం, ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ) 84.62 శాతం ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ శేషాచలం అభినందనలు తెలిపారు. ఆర్ట్స్ కాలేజీలో పాలమూరు సాహితీవేత్తలు కేయూ క్యాంపస్: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 22మంది తెలుగు సాహితీవేత్తలు గురువారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సందర్శించారు. వరంగల్లోని ప్రముఖ సాహిత్యకారుల జన్మస్థలాలు, నివాసస్థలాల సందర్శనలో భాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రాయపోలు సుబ్బారావు పనిచేసిన చోటును సందర్శించినట్లు వారు తెలిపారు. సాహిత్యకారుల వెంట మాజీ ప్రిన్సిపాల్, రిటైర్డ్ ఆచార్యులు బన్న అయిలయ్య, సాహితీవేత్తలు రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీ గొప్పతనాన్ని బన్న అయిలయ్య వారికి వివరించారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి విద్యాకేంద్రమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నారు. అంతకుముందు పాలమూరు సాహితీవేత్తలకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ గిరిప్రసాద్, డాక్టర్ ఆదిరెడ్డి, డాక్టర్ హరికుమార్ తదితరులు ఉన్నారు. -
వేసవి తీవ్రతతో మార్కెట్ వేళల్లో మార్పు
● 30వ తేదీ నుంచి ప్రతి బుధవారం బంద్ వరంగల్: వేసవి ఎండల తీవ్రత పెరగడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించే బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28(సోమవారం నుంచి 11జూన్ తేది వరకు) మిర్చి బీటు ఉదయం 7–05 గంటలకు, పత్తి బీటు ఉదయం 8–05గంటలకు, పల్లికాయ ఉదయం 8–15, పసుపు బీటు 8–30లకు, అపరాలు, ధాన్యం బీటు ఉదయం 8–45 గంటలకు ఉంటుందని తెలిపారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరంగల్ గ్రేయిన్ మార్కెట్ గుమస్తా సంఘం కోరిక మేరకు 30–04–2025 బుధవారం నుంచి 11–06–2025 బుధవారం వరకు వచ్చే ప్రతి బుధవారం మార్కెట్ యార్డ్కు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మార్పులను రైతులు, అడ్తి వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది, కార్మికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. వడదెబ్బతో ఒకరి మృతి జనగామ: జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ ప్రాంతానికి చెందిన కార్మికుడు అలిసెరి ప్రసాద్(63) గురువారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాణాపురంలోని తన కుమారుడు శ్రవన్ ఇంటి వద్దకు ఈ నెల 23న కాలినడకన వెళ్లగా, వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ప్రసాద్ను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకు రాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు కుమారుడు స్పష్టం చేశారు. నకిలీ నక్సలైట్ల అరెస్ట్ జనగామ: జనగామ మండలంలో ఓ భూవివాదం కేసులో నక్సలైట్ల పేరు చెప్పి బె దిరించిన ఇద్దరితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు సీఐ దామోదర్రెడ్డి తెలిపారు. సీఐ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓబుల్కేశ్వాపూర్కు చెంది న మద్దుల మల్లారెడ్డి, మద్దుల తిరుమల్రెడ్డి మధ్య భూవివాదం ఉంది. భూ వివాదం పరి ష్కారం కోసం తిరుమల్రెడ్డి కొత్తగూడెంకు చెందిన మెరుగు శ్యాంబాబు, జిలుగు సోమెన్ రాజు, టవర్ సాంబ అలియాస్ కంకణాల రా జరెడ్డి అలియాస్ శ్యామ్కుమార్ను సంప్రదించారు. ముగ్గురు వ్యక్తులు మల్లారెడ్డి వద్దకు వచ్చి నక్సలైట్ల పేరు చెప్పి, భూ వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేశా రు. మల్లారెడ్డి తమకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్పీడీసీఎల్ ఉద్యోగి మద్దుల తిరుమల్రెడ్డితో పాటు నకిలీ నక్సలైట్లు భద్రాద్రి కొత్తగూడెం శివారు సన్యాసి బస్తీకి చెందిన మెరుగు శ్యాంబాబు, జీలుగు సోలోమన్ రాజును రిమాండ్కు పంపించగా, టవర్ సాంబ పరారీలో ఉన్నాడు. కాగా.. భూవివాదం పరిష్కరిస్తామని కొత్త వ్యక్తులు లేదా నక్సలైట్ల పేరు చెప్పి డబ్బులు డి మాండ్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా 100కు డయల్ చేసి తెలియజేయాలని సీఐ సూచించారు. -
మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ గార్ల: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. గురువారం గార్ల సీహెచ్సీని ఆయన సందర్శంచారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గార్ల ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వెళ్లిందని, ఉత్తమ సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో డిప్యుటేషన్ వ్యవస్థను రద్దు చేశామని, సిబ్బంది గతంలో పని చేసిన పీహెచ్సీకి వెళ్లాలని ఆదేశించినట్లు తెలిపారు. డిప్యుటేషన్ల వల్ల మారుమూల ఏజెన్సీ మండలాల్లోని పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో ప్రజలకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ అయిన తర్వాత, మిగిలిన వైద్యులు, సిబ్బందిని వైద్య విధాన పరిషత్ పరిధిలో కొనసాగుతున్న సీహెచ్సీలకు డిప్యుటేషన్పై పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం గార్ల సీహెచ్సీలో వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేసి మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీపీఎం జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాసరావు, అలు వాల సత్యవతి డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేశారు. వైద్యులు హనుమంతరావు, సిబ్బంది స్వాతి, రమాదేవి ఉన్నారు. -
డీసీసీలకు కొత్త సారథులు
‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టి సారించిన అధిష్టానండీసీసీ పీఠం కోసం పోటాపోటీ..సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీ కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లాకు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. మే 20 టార్గెట్గా సమావేశాలు.. జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మల్ల య్య, కై లాష్లు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారంనుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీ కమిటీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాలనుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్ రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డిలు ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడినుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్ రాజు, నమిండ్ల శ్రీనివాస్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళి రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడ వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీల పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డిలు కీలకం కానున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్నే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రా రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడినుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధలు కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిల నిర్ణయం కీలకం కానుంది. -
డబుల్ లొల్లి
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లోuఅనుశ్రీని అభినందించిన ఎస్పీమహబూబాబాద్ రూరల్: ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన హోంగార్డు తిరుపతి కూతురు అనుశ్రీని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం అభినందించారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డు విధులు నిర్వహిస్తున్న మదాసు తిరుపతి కూతురు అనుశ్రీ ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 468 మార్కులు సాధి ంచింది. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో విద్యార్థిని అనుశ్రీని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్లో ఉన్నత చదువులు చదివి మంచిస్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు భాస్కర్, సోములు, హోంగార్డు యూనియన్ సిబ్బంది పాల్గొన్నారు. జడ్జిని కలిసిన కలెక్టర్మహబూబాబాద్ రూరల్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి జిల్లాకు సంబంధించిన పలు అంశాల గురించి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల తనిఖీడోర్నకల్: డోర్నకల్తో పాటు పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ ఆర్డీఓ మురళీధర్రాజు గురువారం తనిఖీ చేశారు. డోర్నకల్, వెన్నారం, తహసీల్దారు బంజర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో అసరమైన పరికరాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్ లు, సీసీలు సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శంకర్నాయక్, సీసీలు పాల్గొన్నారు. నిట్లో వరల్డ్ డీఎన్ఏ డే వేడుకలు కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ(సీఆర్ఐఎఫ్), యునైటెడ్ బయోలాజికల్ అండ్ థర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థల సౌజన్యంతో గురువారం వరల్డ్ డీఎన్ఏ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లైఫ్ సైన్సెస్ అండ్ మాలిక్యూలర్ బయోలాజీ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జిబిషన్ను డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ శ్రీనివాసాచార్య ప్రారంభించి మాట్లాడారు. డీఎన్ఏ పరిశోధనల్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాల ఉపయోగంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకునేందుకు ఈ ఎగ్జిబిషన్ తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు వీరేష్బాబు, పీవీ శ్రీలక్ష్మి, రవికుమార్ పాల్గొన్నారు.సాక్షి, మహబూబాబాద్: గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అధికారికంగా కేటాయించకపోవడంతో లొల్లి మొదలైంది. కాగా, ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న వాటిని కొత్త లబ్ధిదారులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, గత ప్రభుత్వం నామమాత్రంగా కేటాయించిన లబ్ధిదా రులు అందోళనకు దిగుతున్నారు. తమకు కేటాయి ంచిన ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పోనూ రూ.2లక్షల మేరకు ఖర్చు చేశామని, ఇప్పుడు కాదంటే ఎలా.. చావనైనా చస్తాం.. ఇల్లు మాత్రం విడిచి పెట్టబోమని ఆందోళనకు చేస్తున్నారు. 975 ఇళ్లు నిరుపయోగంగా... పేదలకోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పలుచోట్ల పంపిణీ చేయలేదు. దీంతో ఆ ఇళ్లలో సర్కారు తుమ్మలు, పిచ్చి మొక్కలు మొలచి అడవిని తలపిస్తున్నాయి. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం మహబూబాబాద్ జిల్లాకు రూ. 287.24కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 5,415 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 2,773 ఇళ్లు పూర్తికాగా..1,798 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించారు. ఇందులో 1,728 కుటుంబాలు ఇళ్లలోకి చేరగా.. 975 ఇళ్లు నిర్మాణం పూర్తి అయినా నిరుపయోగంగా మారాయి. కట్టుకొమ్మన్నారని.. పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో జీప్లస్టు భవనాలు నిర్మించి లాటరీ పద్ధతిన పేదలకు కేటాయించారు. గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలు, లేదా ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, ఇతర పార్టీ పెద్దలు, అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. నామమాత్రంగా ఇళ్లను కేటాయించారు. దీంతో తమకు కేటాయించిన ఇంటికి అదనంగా రూ. 2లక్షల మేరకు కాంట్రాక్టర్కు ఇచ్చి తమకు నచ్చినట్లు నిర్మించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ లబ్ధిదారులు చెప్పిన విధంగా ఎత్తు పెంచడం, ఇతర మెటీరియల్ వినియోగించి నిర్మించారు. అయితే నిర్మాణాలు పూర్తి అయినా ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ వచ్చేలోపు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారికంగా కేటాయించని డబుల్ బెడ్రూం ఇళ్లను ఎవరికి ఇవ్వవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయలేదు. అయితే గతంలో నామమాత్రంగా పేర్లు ప్రకటించిన వారు తమ పేరునే డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించారని, అదనంగా మాకు ఖర్చు కూడా అయిందని ఇప్పుడు మాకే ఇల్లు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. అదే విధంగా కొందరు గ్రీవెన్స్లో కలెక్టర్కు అర్జీలు కూడా అందజేశారు. అయితే చివరికి ఇళ్లను ఎవరికి కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పోలీసులను అడ్డుకుంటున్న బాధితులు● వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆదేశం ● ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు ● నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు... ● ఆరు జిల్లాలనుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు ● అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులుజిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్విహించి నివాళులర్పిస్తున్న ఐఎంఏ సభ్యులు నెహ్రూసెంటర్: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలో ఐఎంఏ, కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నివాళులర్పించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, పహల్గాం మృతులకు నివాళులర్పించారు. న్యూస్రీల్ఇళ్ల వద్ద ఉద్రిక్తత.. చిన్నగూడూరు: గత ప్రభుత్వం హయాంలో మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన పలువురు తాళాలు వేసి ఉన్న డబుల్బెడ్రూం ఇళ్లలోకి ఎలాంటి అనమతుల లేకుండా గురువారం ప్రవేశించారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ మహబూబ్ అలీ, ఎస్సై ప్రవీణ్కుమార్ అక్కడికి వెళ్లి ఖాళీ చేయాలని ఆదేశించారు. గతంలో తాము డబ్బులు చెల్లించామని, చావనైనా చస్తాం కానీ ఇళ్లు ఖాళీ చేయమని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఇళ్లు నిర్మించి ఇంటి తాళాలు ఇచ్చారు. ఇప్పుడు ఇళ్లలోకి వెళ్తే ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో బాధితులు పెట్రోల్ డబ్బాలతో నిరసన చేపట్టారు. దీంతో భారీగా జనం గుమిగూడడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ కృష్ణకిషోర్, సీఐ రాజ్కుమార్ డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఇళ్లలో ఉన్న వారి వివరాలను సేకరించారు. ఈ విషయమై డీఎస్పీ కృష్ణకిషోర్ను వివరణ కోరగా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శిక్షార్హులు అవుతారు. సమాజంలో ఉన్నప్పుడు చట్టాలను పాటించాలి. చట్టం ఎవరికీ చుట్టం కాదు. తహసీల్దార్ చెప్పినప్పుడు వినకపోతే ఎలా.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి ఇళ్లు ఇచ్చేలా న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. కాదని అక్రమంగా ఇళ్లలోకి ప్రవేశిస్తే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు.కొత్త కేటాయింపులు చేయలేదు గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అప్పుడు కేటాయించి ఆర్డర్ ఇచ్చిన వారికే హక్కు ఉంటుంది. ఆర్డర్ ఇవ్వకుండా ఇల్లు మాది అనడం సరికాదు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. – వీరబ్రహ్మచారి, అదనపు కలెక్టర్ -
‘భూభారతి’తో భూహక్కులకు రక్షణ
డోర్నకల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టంతో భూహక్కులకు పూర్తి రక్షణ లభిస్తుందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలంలోని గొల్లచర్ల గ్రామంలో గురువారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాల కాలంగా భూసమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటన్న ప్రజలకు భూభారతి చట్టంతో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. భూభారతి చట్టాన్ని రూపొందించేందుకు మేధావులు, పలువురు రాష్ట్ర మంత్రులు చాలా రోజులు కసరత్తు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి చట్టంతో భూసమస్యలు పెరిగాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలోనూ గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే సామర్థ్యం ఉన్న వారే నిర్మాణాలు ప్రారంభించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికార పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాల అమలును నిత్యం పర్యవేక్షించాలని, కార్యకర్తలు అవకతవకలకు పాల్పడి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దన్నారు. కలెక్టర్ అద్వైత్సింగ్కుమార్ మాట్లాడుతూ.. భూసమస్యల సత్వర పరిష్కారంతో పాటు భూమి హక్కులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తుందని తెలిపారు. చట్టంపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, త్వరలో చట్టంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, డీఏఓ విజయనిర్మల, మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, తహసీల్దార్ కె.కృష్ణవేణి, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, డీటీ వీరన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ -
షాపింగ్ చేసి వస్తూ.. అనంతలోకాలకు..
కురవి : శుభకార్యం నిమిత్తం ఓ యువకుడు.. తల్లి, తమ్ముడితో కలిసి షాపింగ్ చేశాడు. అనంతరం బైక్పై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని మొగిలిచర్ల సమీపంలో జరిగింది. కురవి ఏఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. మండలంలోని రాజోలు శివారు పోలంపల్లి తండా గ్రామానికి చెందిన భూక్య ఈశ్వర్(17) మంగళవారం సాయంత్రం తన తల్లి సుజాత, తమ్ముడు ప్రభాస్తో కలిసి శుభకార్యం నిమిత్తం షాపింగ్ చేయడానికి బైక్పై మహబూబాబాద్ వెళ్లారు. షాపింగ్ పూర్తయిన అనంతరం మహబూబాబాద్ నుంచి మొగిలిచర్ల వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో అదే మార్గంలో ఓ కోళ్ల వ్యాన్ డోర్నకల్ వైపునకు వెళ్తోంది. మొగిలిచర్ల గ్రామంలోని పెట్రోల్బంక్ సమీపంలో కోళ్ల వ్యాన్ డ్రైవర్ సడన్బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న ఈశ్వర్ బైక్ను ఆపే ప్రయత్నంలో వ్యాన్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఈశ్వర్కు తీవ్రగాయాలు కావడంతో 108లో మాహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకన్న బుధవారం పేర్కొన్నారు. -
పెళ్లిరోజు వేడుకకు వెళ్తూ.. మృత్యుఒడికి
● ఆటో, బైక్ ఢీ.. ఇద్దరు బాలికల దుర్మరణం ● మరో ఇద్దరి పరిస్థితి విషమం కొత్తగూడ: పెళ్లి రోజు వేడుకకు వెళ్తూ ఇద్దరు బాలికలు మృత్యుఒడికి చేరారు. ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం బుధవారం రాత్రి మండలంలోని పెగడపల్లి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్ర కారం.. మండలంలోని పొగుళ్లపల్లికి చెందిన స్నేహితుడు గువ్వ ప్రేమేశ్ తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుకలో పాల్గొనేందుకు మండలంలోని లక్ష్మీపురం గ్రా మానికి చెందిన అన్నదమ్ముళ్ల పిల్లలు జంగ మౌనిక(17), జంగ నవ్య (17), జూల కార్తీక్, గువ్వ ప్రేమేశ్తో కలిసి బైక్పై పొగుళ్లపల్లికి వెళ్తున్నారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కరుణాకర్ ట్రాలీ ఆటో కిరాయి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెగడపల్లి సమీపంలో ట్రాలీ ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో మౌనిక, నవ్య అక్కడికక్కడే మృతి చెందగా కార్తీక్, ప్రేమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరిని 108లో నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. నవ్య తల్లిదండ్రులు ఎల్లయ్య–రజిత, మౌనిక తల్లిదండ్రులు సంపత్–ఎలేంద్ర ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన సంతోషం ఒక్కరోజు కూడా నిలువలేదంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కుశకుమార్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
3,374 ఎకరాల్లో పంట నష్టం
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, బొప్పాయి, వరి, మొక్కజొన్న పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. అలాగే కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. ఈమేరకు వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు పంటలను పరిశీలించడంతో పాటు రైతుల నుంచి నష్టపోయిన పంటల వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 3,374.30 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు నిర్ధారించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కాగా ప్రభుత్వం అందించే నష్టపరిహారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 2,855 ఎకరాల్లో వరికి, 76.30 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం.. ఈదురుగాలుల బీభత్సం, గాలివాన, వడగండ్ల కారణంగా జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు మొత్తంగా 2,859 మంది రైతులకు సంబంధించి 2,931.30 ఎకరాల్లో నష్టంవాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. ఇందులో 2,855 ఎకరాల్లో వరి పంట, 76.30 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని మండలాల పరిధిలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేశారు. జిల్లాలోని మహబూబాబాద్, నెల్లికుదురు, ఇనుగుర్తి, పెద్దవంగర, కేసముద్రం, కొత్తగూడ మండలాల పరిధిలో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. 443 ఎకరాల్లో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం.. అకాల వర్షం వల్ల జిల్లాలో 443 ఎకరాల్లో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా ఇద్దరు రైతులకు చెందిన ఐదు ఎకరాల బొప్పాయి తోటకు వర్షం కారణంగా తీవ్ర నష్టం చేకూరినట్లు తెలిపారు. 128 మంది రైతులకు చెందిన 438 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు.‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది కేసముద్రం మండలం క ల్వల గ్రామానికి చెందిన రైతు పాల శ్రీనివాస్. నాలుగు ఎకరాల మేరకు వరి పంట సాగుచేశాడు. అకాల వర్షంతో పంట ఈనె దశలో మొత్తం నేలవాలిపోయింది. అదే విధంగా రెండు ఎకరాల మేరకు మొక్కజొన్న సాగుచేయగా వడిచుట్టుకుపోయింది. వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రూ.3లక్షల మేరకు నష్టంవాటిల్లిందని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.’ అకాల వర్షంతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు -
గ్రామస్థాయి నుంచే భూ సమస్యల పరిష్కారం
నెల్లికుదురు: భూ భారతి చట్టం ద్వారా గ్రామస్థాయి నుంచి భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు పడిన ఇబ్బందులను తొలగించడానికే ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టంలో జూన్ మొదటివారం నుంచి ప్రతీ గ్రామంలో గ్రామ పాలన అధికారి (జీపీఓ) ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి విచారణ జరిపి అక్కడే సమస్య పరిష్కరిస్తారని, లేకుంటే తహసీల్దార్ వద్ద, అక్కడ కాకుంటే ఆర్డీఓ వద్ద, ఇంకా సమస్య పెద్దది అయితే కలెక్టర్ వద్ద ధరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపు ప్రతి భూ సమస్య పరిష్కారం కోసమే ప్రభుత్వం పకడ్బందీగా చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, తొర్రూరు ఆర్డీఓ గణేష్, తహసీల్దార్ కె.రాజు, ఎంపీడీఓ బాలరాజు, డిప్యూటీ తహసీల్దార్ తరంగిణి, ఏడీఏ పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి నర్సింహులపేట: భూభారతి చట్టాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతిచట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రైతులకు పారదర్శకంగా సులభతరమైన విస్తృత సేవలు అందుతాయని తెలిపారు. రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు.అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ గణేష్, ఏడీఏ శ్రీనివాస్, తహసీల్దార్ నాగరాజు, ఎ ంపీడీఓ యాకయ్య, ఏఓ వినయ్కుమార్ ఉన్నారు. సమస్యల పరిష్కారం.. కేసముద్రం: భూభారతి చట్టం ద్వారా ఎన్నోఏళ్లుగా పేరుకుపోయిన భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. బుధవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఈ చట్టంలో ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ హరిప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
వాతావరణం
ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోత ఉంటుంది.మహిళా సాధికారతే లక్ష్యం ● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కొత్తగూడ: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో సీ్త్ర శక్తి క్యాంటీన్ను ప్రారంభిచారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. అదే బస్సులకు మహిళలను ఓనర్లుగా చేస్తూ కొత్తగూడ మండల సమాఖ్యకు బస్సును కేటాయించినట్లు తెలిపారు. సీ్త్ర శక్తి క్యాంటీన్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి.. కశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. కుల, మత ప్రాతిపదికన హత్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. రాజకీయంగా మాట్లాడటం కన్నా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 29న రాజ్యాంగ రక్షణ సభమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్లో ఈ నెల 29న ఉదయం 10గంటలకు రాజ్యాంగ రక్షణ సభ నిర్వహిస్తున్నామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా చైర్మన్ డోలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో బుధవారం ఉద్యమకారులు, ప్రజా, కుల సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రాజ్యాంగ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాగం రక్షణ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరవుతున్నారన్నారు. -
మహబూబాబాద్ పీసీసీ అబ్జర్వర్లుగా పొట్ల, రవళిరెడ్డి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పీసీసీ అబ్జర్వర్లుగా మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు, పీసీసీ స్పోక్స్పర్సన్ కూచన రవళిరెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నాటరాజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వారు పని చేయనున్నారు. ప్రధానంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేయడంలో కీలక భూమిక పోషించనున్నారు. వీరిద్దరికి జిల్లాపై మంచి అవగాహన ఉండడం, జిల్లా నాయకులతో సత్సంబంధాలు ఉండడంతో పార్టీ కమిటీలు వేయడం, ఇతర కార్యక్రమాలు విజయవంతం చేయడం సులభం అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అదేవిధంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు బెల్లయ్యనాయక్ నాగర్ కర్నూల్, ఎమ్మెల్యే మురళీనాయక్ సూర్యాపేట జిల్లాల పరిశీలకులుగా నియమితులయ్యారు. ఎడ్లబండ్లకు స్వాగతం పలికిన సత్యవతిరాథోడ్ దంతాలపల్లి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సూర్యాపేట జిల్లా నుంచి తరలివెళ్తున్న ఎడ్లబండ్లకు బుధవారం మండల కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండ్లతో వెళ్తున్న రైతులకు ఆమె తినుబండారాలు అందజేశారు. సభకు వెళ్తున్న రైతులు మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా ఎస్.ఆత్మకూరు మండలంలోని రామోజీతండా, నసీంపేట గ్రామాలకు చెందిన 18ఎడ్లబండ్లను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారన్నా రు. తమకు అవసరమైన సరుకులను రెండు వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బండ్ల భిక్షం రెడ్డి, దొర యాకన్న, గుండగాని లింగయ్య, మాద వెంకన్న, గండి సతీష్, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా జడ్జిగా అబ్దుల్ రఫీ బాధ్యతల స్వీకరణ మహబూబాబాద్ రూరల్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహమ్మద్ అబ్దుల్ రఫీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా జడ్జిగా పనిచేస్తున్న మహమ్మద్ అబ్దుల్ రఫీ బదిలీపై వచ్చి మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జిగా విధుల్లో చేరారు. జడ్జిని కలిసిన ఎస్పీ.. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు సంబంధించిన శాఖాపరమైన పలు అంశాలపై చర్చించారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ సరవయ్య, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, ఎస్సై జీనత్ కుమార్, కోర్టు డ్యూటీ అధికారులు ఉన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలిమహబూబాబాద్ అర్బన్: ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని డీఈఓ రవీందర్రెడ్డి తల్లిదండ్రులను కోరారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని శనిగపురం జెడ్పీహెచ్ఎస్లో బుధవారం విద్యా సంవత్సరం ముగింపు తల్లిదండ్రుల సమావేశానికి డీఈఓ హాజరై మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య, ఉచిత భోజనవసతి, పుస్తకాలు, బుక్కులు, స్కూల్ యూనిఫాంలు పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దాశరథి, ఉపాధ్యాయులు పాఠశాల చైర్మన్ అరుణ, మాజీ కౌన్సిలర్ హరిసింగ్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, మానిటరింగ్ అధికారి ఆజాద్చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు వెంకన్న, పర్వతాలు, చైతన్య, ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో పాఠశాల ముగింపు కార్యక్రమానికి జీసీడీఓ విజయ కుమారి హాజరై మాట్లాడారు. -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘బీఆర్ఎస్ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటలలోపే చేరుకుంటారని, ఆలోగా ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్ చేయాలన్నారు. ఒక్కొక్కరిగా జనసమీకరణపై ఆరా... మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జ్లు పాల్గొన్న ఈ సమీక్షసమావేశంలో జనసమీకరణపై ఇప్పటివరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న నేతలను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బందిపడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్చార్జ్ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసమీకరణ, జనం తరలింపుపై ఫోన్ల ద్వారా సమీక్షించడం జరుగుతుందని, ఆందరూ తమ లక్ష్యాలను మించాలని కోరారు.సభా ఏర్పాట్లపై అభినందనలు.. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్ష సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్నాయ క్, నన్నపునేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.జనసమీకరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం ఓరుగల్లు ప్రతి ఇంటి నుంచి జనం కదలాలే సిల్వర్ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు... రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష... కీలక అంశాలపై చర్చ సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అభినందనలు -
వాన ‘గండం’
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యంసాక్షి, మహబూబాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే మోసపోతారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సకాలంలో ధాన్యం కొనేందుకు నానా కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. ఉదయం అంతా నిప్పులు కురిసేలా ఎండ.. తీరా సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతం కావడం, ఉరుములు, మెరుపులు, జల్లులు, గాలిదుమారం రావడంతో కల్లాల్లో ధాన్యం పోసుకున్న రైతులు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. కేంద్రాల్లో నిండిన ధాన్యం గిట్టుబాటు ధరతోపాటు, సన్న ధాన్యానికి బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. యాసంగిలో 23,633 ఎకరాల దొడ్డురకం వరి, 1,12,603 ఎకరాల్లో సన్న రకాలు మొత్తం 1,36,236 ఎకరాల్లో వరి సాగుచేశారు. కాగా 2,63,577 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని లెక్కించారు. ఇందులో 84,577 మెట్రిక్ టన్నులు రైతులు, కూలీల అవసరాలకోసం వినియోగించవచ్చు. అదే విధంగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేస్తారు. ఇవి పోగా మిగిలిన 1.79లక్షల మెట్రిక్ టన్నుల ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నారు. అయితే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతోపాటు, బోనస్ కూడా ఇవ్వడంతో గతం కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఐకేపీ 61 సెంటర్లు, పీఏసీఎస్ 162, ఇతర సెంటర్లు 16 మొత్తం 239 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పుటి వరకు 170 సెంటర్లు ప్రారంభించారు. దీంతో రైతులు పంట పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినట్టు అంచనా. మరో వారం రోజుల్లో వరి కోతలు పూర్తయి మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని రైతులు చెబుతున్నారు. కొనుగోలులో కొర్రీలు ఒకవైపు ఎప్పుడు అకాల వర్షం కురుస్తుందో అని భయ పడుతున్నామని, మరోవైపు నిర్వాహకులు కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆ రోపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి 170 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా ఇప్పటి వరకు 63 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు. మిగిలిన చోట్ల తేమ శాతం 17కు లోపు ఉన్నా, జల్లెడ పట్టి మట్టి, చెత్త లేకుండా ధాన్యం శుభ్రం చేసినా.. కావాలనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొన్ని చోట్ల హమాలీల కొరత, మరికొన్ని చోట్ల లారీలు రావడం లేదని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. కొనే కేంద్రాల్లో కూడా నాయకులో, అధికారులో చెప్పిన ధాన్యం మాత్రమే కొంటున్నారని, సామాన్య రైతులను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే విధంగా 40.700 తూకం వేయాల్సిన బస్తాను 41.300 తూకం వేసి రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేంటి అంటే లారీలు వచ్చేవరకు మరింత బరువు తగ్గుతాయి, అలా అయితే ఇక్కడ అమ్మండి లేకపోతే తీసుకెళ్లండి అని బెదిరిస్తున్నారు. ఇలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 15రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు 4,454 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. నెత్తురోడిన రహదారులు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. – 10లోuన్యూస్రీల్జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు వివరాలు కొర్రీలతో కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న నిర్వాహకులు ఎప్పుడు వర్షం వస్తుందోనని రైతుల ఆందోళన వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షణ -
పుష్కరాల పనుల్లో వేగం పెరగడం లేదు
కాళేశ్వరం: ఆశించిన స్థాయిలో పుష్కరాల అభివృద్ధి పనుల్లో వేగం పెరగడం లేదని, పనులను అధికారులు, కాంట్రాక్టర్లు సీరియస్గా తీసుకోవాలని దేవా దాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. బుధవారం సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, దార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి కాళేశ్వరంలో పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించారు. వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద పుష్కర ఘాట్ విస్తరణ పనులు చూశారు. గోదావరి నీటిమట్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇరిగేషన్ ఇంజనీర్లు తెలిపారు. గోదావరి వద్ద భక్తుల కోసం చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. సరస్వతి విగ్రహం ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, 86 గదుల గెస్ట్హౌస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్లతో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని మూడు గంటల పాటు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న పది రోజులు చాలా ముఖ్యమని, ప్రతి రోజూ పనుల్లో ప్రగతి రావాలన్నారు. పనుల వివరాలు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాలని సూచించారు. మే 10వ తేదీ వరకు అన్ని పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుపుతున్న కార్యక్రమమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణ రావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్నాయక్,ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, డీపీఓ నారాయణరావు, ఈఓ మహేశ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఈఈ కనక దుర్గాప్రసాద్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూ ఎస్ఈఈ నిర్మల, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. పనులు సీరియస్గా చేయండి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ క్షేత్రస్థాయిలో పనుల పురోగతి పరిశీలన మూడు గంటల పాటు అధికారులతో సమీక్ష -
రన్నింగ్ రూంలో సకల సదుపాయాలు
● ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ డోర్నకల్: డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలో ఏర్పాటు చేసిన రన్నింగ్ రూంలో లోకో పైలెట్లు, ట్రైన్ మేనేజర్ల కోసం సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) ఆర్. గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం నిర్వహించిన త్రైమాసిక సమావేశం సందర్భంగా రన్నింగ్ రూంలోని వసతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం మాట్లాడుతూ లోకో పైలెట్లు, ట్రైన్ మేనేజర్లు, అసిస్టెంట్ లోకోపైలట్లతో కూడిన రన్నింగ్ సిబ్బంది సురక్షిత ఉద్యోగ నిర్వహణ కోసం రన్నింగ్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే మార్గంలో 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఒకటి చొప్పున సికింద్రాబాద్ డివిజన్లో 22 రన్నింగ్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధుల్లో భాగంగా దూరప్రాంతాల నుంచి వచ్చే రన్నింగ్ సిబ్బంది ఇక్కడ సేదదీరేందుకు ఏసీ గదులు, రుచికర ఆహారం, యోగా, రీడింగ్ రూంతోపాటు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, డోర్నకల్లో పలు రైళ్ల హాల్టింగ్కు సంబంధించి తమకు ప్రతిపాదనలు అందాయని వీటిని పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కోసురు చైతన్య, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చరణ్నాయక్, స్టేషన్ సూపరింటెండెంట్ శోభన్ప్రసాద్, డీఆర్యూసీసీ సభ్యుడు ఖాదర్ పాల్గొన్నారు. -
వడదెబ్బతో ముగ్గురి మృతి
కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలోని బస్టాండ్లో బుధవారం ఓ గుర్తుతెలియని వృద్దుడు వడదెబ్బతో మృతి చెందాడు. రైల్వే పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉంటాయని, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్రపర్చినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలకు 87126–85122 నంబర్కు ఫో చేయాలని సీఐ కోరారు. తిమ్మంపేటలో మహిళ .. దుగ్గొండి: వడదెబ్బతో ఓ మహిల మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిమ్మంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన నాంపల్లి రవళి అలియాస్ కల్పన (35) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన ఇంటి పెరటితోటలో పనులు చేసింది. అనంతరం ఇంట్లోకి వచ్చిన కొద్ది సమయం తర్వాత అస్వస్థతకు గురైంది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి భర్త రాజేందర్, ఇద్దరు కూతుళ్లు జ్యోతిప్రియ, లక్ష్మీప్రసన్న ఉన్నారు. ఘన్పూర్లో మరో మహిళ.. స్టేషన్ఘన్పూర్: వడదెబ్బతో ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన పులి రమ(50) మృతిచెందింది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. రమ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్తతకు గురైంది. దీంతో కుటుంబీకులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొన్న కారు.. వృద్ధుడి దుర్మరణం
లింగాలఘణపురం: కారు.. బైక్ ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల సమీపం కాటన్మిల్లు వద్ద జరిగింది. ఎస్సై శ్రవణ్కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నారపల్లికి చెందిన తీగల సోమనర్సయ్య(80), తన భార్య అన్నపూర్ణ, కుమారుడు శ్రీధర్, కోడలు ప్రణీతతో కలిసి కారులో తుంగతుర్తిలో బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో కారు నెల్లుట్ల సమీపంలో జనగామ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న రఘునాథపల్లి మండలం బాంజీపేటకు చెందిన హరీశ్ను ఎ దురుగా ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న సోమనర్సయ్యతోపాటు కుటుంబ సభ్యులు, ద్విచక్రవాహనదారుడు హరీశ్ గాయపడగా 108 సిబ్బంది నరేశ్, బిల్లా రాజు జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమనర్సయ్య మృతి చెందాడు. గాయాలైన అన్నపూర్ణ, శ్రీధర్, ప్రణీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హరీశ్ జనగామ ఏరియా ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్కుమార్ వివరించారు. కాగా, జనగామ – సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల పరిధిలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్ర మాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఐ దు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
‘వడదెబ్బ’ బాధితులకు భరోసా!
సంగెం/కాజీపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను ప్రత్యేక విపత్తుగా పరిగణించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నివారణ విభాగం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో వడదెబ్బతో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఇందుకోసం త్రిసభ్య కమిటీ పనిచేస్తోంది. ఈ కమిటీ వడదెబ్బతో చనిపోయిన వారి వివరాల నివేదికను కలెక్టర్కు పంపిస్తుంది. కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల పరిహారం చెల్లిస్తుండగా, ప్రభుత్వం ఇటీవల ఆ మొత్తాన్ని రూ. 4 లక్షలకు పెంచింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అవగాహన లోపంతో పరిహారానికి దూరం.. వేసవిలో ఎండల తీవ్రతకు ఏటా పలుచోట్ల వృద్ధులు, రైతులు, హమాలీలు, ఉపాధిహామీ, వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందక పలువురు మృతి చెందుతున్నారు. వీరికి గతంలో ప్రభుత్వం ఆపద్భందు పథకం కింద రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించేది. అధికారులు అందజేసిన నివేదిక ఆధారంగా అర్హుల జాబితా వరుస క్రమంలో నిధుల లభ్యతను బట్టి సాయం అందించేవారు. ఆపద్భందు పథకం కింద ప్రమాదవశాత్తు మరణించినా, వివిధ కారణాలతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు దరఖాస్తులు చేసుకునేవారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోయిందనే చెప్పొచ్చు. సాయం అందకపోవడం, పరిహారం తక్కువ ఉండడం, పోస్టుమార్టం వ్యయప్రయాసాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం పరిహారం పెంచిన నేపథ్యంలో బాధితుల కుటుంబసభ్యులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. కాగా, వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి పేరిట రైతుబీమా ఉంటే రెండింటిలో ఒక పరిహారం పొందే అవకాశం ఉంటుంది. మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు గతంలో రూ. 50 వేలు.. ప్రస్తుతం రూ.4లక్షలు పోస్టుమార్టం రిపోర్టు తప్పనిసరి మృతిపై సమాచారం అందించాలి త్రిసభ్య కమిటీ, కలెక్టర్ నివేదిక ఆధారంగా పరిహారం చెల్లింపులుఇవీ నిబంధనలు... వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందించడం మృతుల కుటుంబాలకు కాస్త ఊరట కలిగించే అంశమే. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి వడగాలులు వీస్తున్న రోజులనే ప్రత్యేక విపత్తుగా పరిగణనలోకి తీసుకుంటారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై మరణిస్తే తహసీల్దార్, వైద్యాధికారి, ఎౖస్సైతో కూడిన మండలస్థాయి త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలి. మృతుల కుటుంబ సభ్యులు ముందు ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలి. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీస్ శాఖ అనుమతితో మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలి. ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందు వైద్యాధికారి ధ్రువీకరించాలి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి సమీపంలోని ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించాలి. పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీసుస్టేషన్కు అందజేస్తే ఎఫ్ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. అనంతరం డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలను మండల కమిటీకి అందించాలి. పూర్తిస్థాయిలో విచారణ చేసి మండలస్థాయి కమిటీ సిద్ధం చేసిన నివేదికలను జిల్లా వైద్యాధికారి పరిశీలించి కలెక్టర్కు సమర్పించాలి. ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే పరిహారం అందుతుంది.వడదెబ్బపై అవగాహన కల్పిస్తున్నాంవడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పరిహారం పెంచింది. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు, ఉపాధిహామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. వైద్యశాఖ ద్వారా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా వడదెబ్బతో మృతి చెందితే త్రిసభ్య కమిటీకి తెలపాలి. నిబంధనల మేరకు బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తాం. –గనిపాక రాజ్కుమార్, తహసీల్దార్, సంగెం -
దక్షిణ మధ్య రైల్వే జోన్లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ను హైదరాబాద్లోని రైలు నిలయంలో బుధవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్య కలిశారు. పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. కాజీపేట బస్టాండ్ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని, అమృత్భారత్ పథకం కింద వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, రైల్వే క్రూలింక్ల తరలింపు విషయంలో వివరణ, రైల్వే యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరించాలని జీఎంను కోరారు. మూడు రోజుల్లో నాయకులతో సమావేశం కానున్నట్లు జీఎం చెప్పారని ఎంపీ తెలిపారు. కాజీపేట లోకోరన్నింగ్ డిపో సిబ్బందిని విజయవాడ డిపోనకు బదిలీ చేయడం, కాజీపేటలో కొత్త పోస్టుల భర్తీకి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై జీఎంను వివరణ కోరినట్లు తెలిపారు. కాజీపేటలో 709 మంది ఉద్యోగులకు 526మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారని, రన్నింగ్స్టాఫ్లో 184 కొత్త పోస్టింగ్లు మంజూరైన పోస్టుల భర్తీకి ఎలాంటి ప్రయత్నాలూ లేవని, దీంతో ఉద్యోగులపై పనిభారం పడుతుందని జీఎంకు వివరించారు. 2022 జూలై 14న రైల్వే అధికారులతో జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో రైల్వే అథారిటీ ఇచ్చిన హామీలను ఉల్లంఘించి కృష్ణా, ఎల్టీటీ, కోణార్క్, గౌతమి ఎక్స్ప్రెస్ల ను కాజీపేట నుంచి విజయవాడ డిపోనకు తరలిస్తున్నారన్నారు. కాజీపేట డివిజన్కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని జీఎంను కోరినట్లు తెలిపా రు. ప్రస్తావించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని జీఎం హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. ఎంపీలు రఘురాంరెడ్డి, కిరణ్ కుమార్రెడ్డి పాల్గొన్నారు. ప్రాణం తీసిన చుట్ట.. ● చుట్ట కోసం ఐరన్రాడ్ రంధ్రంలో చెయ్యి పెట్టిన వృద్ధురాలు.. ● విద్యుత్షాక్కు గురై మృతి కురవి: ఆ వృద్ధురాలికి రోజూ ఉదయం చుట్ట తాగే అలవాటు.. కొంత తాగిన అనంతరం మిగతా భాగాన్ని రేకుల షెడ్డుకు ఉన్న ఐరన్ రాడ్ రంధ్రంలో పెట్టే అలవాటు.. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం నిద్రలేచిన ఆ వృద్ధురాలు.. చుట్ట కోసం ఐరన్ రాడ్ రంధ్రంలో చేయి పెట్టింది. ఈ క్రమంలో ఐరన్రాడ్కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై మృతి చెందింది. ఈ ఘటన కురవి మండలం రాజోలు శివారు స్టేషన్గుండ్రాతిమడుగులో చోటు చేసుకుంది. ఏఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన జర్పుల చిలికి(62) అలియాస్ చి లుకమ్మ ఇంటి ఎదుట రేకుల షెడ్డుకు ఐరన్ రాడ్ అ మర్చి ఉంటుంది. ఆ ఐరన్ రాడ్కు ఫ్యాన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిలికి చుట్ట తాగిన అనంత రం మిగతా భాగాన్ని ఐరన్ రాడ్ రంధ్రంలో పెడుతుంది. బుధవారం ఉదయం నిద్ర నుంచి లేచిన చి లికి.. చుట్ట కోసం ఐరన్ రాడ్ రంధ్రంలో చెయ్యి పె ట్టింది. అయితే ఫ్యాన్కు అమర్చిన విద్యుత్ తీగ తెగి ఐరన్రాడ్కు ఆనుకుని ఉండడంతో చిలికి చెయ్యి పె ట్టగానే షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు అగ్గి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకన్న తెలిపారు. ● రైల్వే జీఎంను కోరిన వరంగల్ ఎంపీ కడియం కావ్య -
ఇంటర్లో అద్భుత ఫలితాలు సాధించాం
హసన్పర్తి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి అన్నారు. సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతోపాటు ఐఐటీ, జేఈ మెయిన్స్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బుధవారం 55వ డివిజన్ కోమటిపల్లిలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ విద్యాసంస్థలకు దీటుగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు తక్కువ ఫీజుల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నాయన్నారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో కళాశాలకు చెందిన జె. అంజనా 997 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఎంపీసీ విభాగంలో కె. రుత్విక్ 996 మార్కులు, సేవితా 994 మార్కులు, కీర్తన 994 మార్కులు, జి.వర్షిణి 993 మార్కులు, సాత్విక 992 మార్కులు, పల్లవి 992 మార్కులు, గాయత్రేణి 992 మార్కులు, కె. హాసిని 992 మార్కులు సాధించినట్లు తెలిపారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో జి. తరుణ్ 468 మార్కులు, ఎ.నిచిత 468 మార్కులు, కె. సహస్ర 467 మార్కులు, శ్రీవర్షిణి 467 మార్కులు, పి.సిరిచందన 467 మార్కులు, దేషిమి 467 మార్కులు, కె.వర్షిత 467 మార్కులు, సాత్విక 467 మార్కులు, కె. శ్రీకాంత్ 467 మార్కులు, బన్ని 467 మార్కులు, ఎ.ధీరజ్ 467 మార్కులు, కె. గీతాంనిహారి 467 మార్కులు, హాసిని 467 మార్కులు, సాయినాథ్ 466 మార్కులు, బైపీసీ విభాగంలో తారీమ్ 438 మార్కులు, సామఫి రాధోస్ 438 మార్కులు, హాసిని 437 మార్కులు, మస్విని 436 మార్కులు సాధించారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి -
రజతోత్సవానికి ముస్తాబు
భారత రాష్ట్ర సమితి పాతికేళ్ల పండుగకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి – చింతలపల్లి శివారులో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, సభకు హాజరయ్యే జనం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేందుకు బారికేడ్లు అమర్చారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్ శివార్లలో 1,200 ఎకరాలకు పైగా భూసేకరణ చేశారు. ఇందులో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పార్కింగ్ కోసమే కేటాయించారు. వేదికకు ఇరువైపులా కేసీఆర్, కేటీఆర్ నిలువు కటౌట్లతో రజతోత్సవ చిహ్నాలు ఏర్పాటు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పైర్’కు ప్రథమ ర్యాంకు
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పైర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియ 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్కు పోటెత్తిన ధాన్యం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు మంగళవారం ధాన్యం పోటెత్తింది. అలాగే మక్కల రాశులతో మార్కెట్ ప్రాంగణం కళకళలాడుతూ కనిపించింది. మార్కెట్ ఆవరణలోని కవర్ షెడ్డుతో పాటు ఇతర షెడ్లన్నీ ధాన్యం, మక్కలతో నిండిపోయాయి. స్థలం సరిపోకపోవడంతో రైతులు తాము తీసుకువచ్చిన ధాన్యం, మక్కలను వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశాల్లో రాశులుగా పోసుకున్నారు. వ్యాపారులు 2,877 బస్తాల (1,869 క్వింటాళ్లు) ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే 3,668 బస్తాల (2,201 క్వింటాళ్లు) మక్కలను కొన్నారు. కాగా మార్కెట్ షెడ్లన్నీ నిండి ఉన్నాయని, బుధవారం ధాన్యం, పత్తి, మక్కలు, అపరాలను తీసుకురావద్దని, మిర్చి క్రయవిక్రయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. -
సివిల్స్లో మెరిశారు..
ఐదో ప్రయత్నంలో ఐఏఎస్.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రజంటేటివ్ పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబైలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి సొంతంగా ప్రిపేర్.. ● సివిల్స్లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
● ఒకరి దుర్మరణం ● ఉప్పల్లో ఘటనకమలాపూర్: రాంగ్ రూట్లో వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ద్విచక్రవాహనదారుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండలం రాములపల్లి (కన్నూరు)కు చెందిన వంటకాల రాంరెడ్డి (52) ద్విచక్రవాహనంపై ఉప్పల్లోని ప్రభుత్వాస్పత్రికి వస్తున్నాడు. బస్టాండ్ వద్ద యూటర్న్ తీసుకుని వెళ్తున్న క్రమంలో ఉప్పల్కు రాంగ్ రూట్లో వస్తున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంతో సహా రాంరెడ్డి బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ హరికృష్ణ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతుడి కుమారుడు ప్రణయ్ ఫిర్యాదు మేరకు రేగొండ మండలానికి చెందిన బస్సు డ్రైవర్ మంతెన శ్రీకాంత్పై కేసు నమోదు చేసినట్లు సీఐ హరికృష్ణ తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారైనట్లు స్థానికులు తెలిపారు. -
‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వె లువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షణ్ముక ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్రెడ్డి, మధుకర్రెడ్డి,ఎం.సతీశ్కుమార్ అభినందించారు. -
మిర్చి ధర తగ్గించారంటూ రైతుల ఆందోళన
● కేసముద్రం మార్కెట్లో ఘటన కేసముద్రం: కొందరు వ్యాపారులు కుమ్మకై ్క మిర్చి ధరను అమాంతం తగ్గించి, తమను మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహించిన సంఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరిగింది. మార్కెట్కు మంగళవారం సుమారు 700 మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈ మేరకు వ్యాపారులు టెండర్లు వేయగా, పలువురు రైతులు తీసుకువచ్చిన మిర్చికి క్వింటాకు రూ.6 వేల వరకే ధర పడింది. దీంతో రైతులంతా ఆగ్రహానికి లోనై నిన్నటి వరకు మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.12వేల వరకు ఉండగా, ఇప్పుడు సగానికి సగం ధరను ఎలా తగ్గిస్తారంటూ ఆందోళనకు దిగారు. ధరతోపాటు, తూకంలో మోసం చేస్తున్నారని, క్యాష్ కటింగ్ పేరుతో తమను దోచుకుంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తమ మిర్చికి టెండర్లు వేయాలంటూ వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సెకండ్ ఎస్సై కరుణాకర్ పోలీస్సిబ్బందితో మార్కెట్ యార్డుకు చేరుకుని, రైతులతో మాట్లాడారు. ధర పడని బస్తాలకు తిరిగి బుధవారం టెండర్లు వేయిస్తామని రైతులను శాంతింపజేశారు. -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్రెడ్డి అభినందించారు. -
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
తొర్రూరు: వడదెబ్బపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనారోగ్యం బారిన పడితే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్యాధికారులు, సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్స్ జ్వలిత, మీరాజ్, ప్రియాంక, నందన, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం ఆరబోస్తూ రైతు మృతినెల్లికుదురు: ధాన్యం ఆరబోస్తూ ఓ రైతు కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని మధనతుర్తి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వెంకన్న (52) తనకున్న వ్యవసాయ భూమిలో సాగు చేసిన వరి పంట కోత కోశాడు. పొలం వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టాడు. కాగా, ధాన్యాన్ని నేర్పుతున్న క్రమంలో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. -
వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకొని దోచుకున్నారు..
మహబూబాబాద్ అర్బన్: దేశంలో వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకొని కొంత మంది నాయకులు దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. జిల్లా కేంద్రంలోనీ బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వక్ఫ్బోర్డు సరవణ చట్టం ప్రయోజనాల గురించి వివరించడానికి బీజేపీ దేశావ్యాప్తంగా వక్ఫ్ సుధార్ జనజాగరన్ అభ్యాస్ ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. మే 5వరకు ప్రచారం కొనసాగుతుందన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ప్రతి పేద ముస్లింకు న్యాయం జరుగుతుందన్నారు. ముస్లింల ఇంటింటికీ వెళ్లి చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు ముస్లిం ఓట్లు మాత్రమే అవసరమా.. మిగిలిన వారి ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వక్ఫ్బోర్డు ఆదాయం ఎక్కడికి పోతుందనే విషయాన్ని అసదుద్దీన్, అక్బరుద్దీన్, కాంగ్రెస్ పాలకులు చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్సుందర్ శర్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రరావు, జిల్లా నాయకలు రాంబాబు, వెంకన్న, ఇందుభారతి, సందీప్, సత్యనారాయణ, ముస్తఫా, వక్ఫ్ సంస్కరణల కోకన్వీరన్ తుంపిళ్ల శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు. -
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
ధరణి పోర్టల్ సీతానగరం రైతులకు శాపం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సీతానగరంతో పాటు సమీప గ్రామాల రైతులకు శాపంగా మారింది. ఇప్పటి మా సాగు భూములను 1954–1970 మధ్యలో మా తాత, ముత్తాతలు ఇక్కడి ఒక ముస్లిం వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. తెలంగాణ రాక ముందు వరకు మా భూములు రెవెన్యూలో మా పేర్లపై ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఏర్పడిన ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో మా పేర్లు మాయమయ్యాయి. ఈ సమస్యపై ఎన్నో ఏళ్లుగా ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నాం. మా పేర్లపై ఉన్న కాగితాలు ఉన్నాయి. మా సమస్యకు వెంటనే పరిష్కార మార్గం చూపాలి. – ఆకుల రమేశ్, రైతు, సీతానగరం -
ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని రాష్ట్ర రెవె న్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, హౌసింగ్శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి చట్టంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శంకగా జరగాలన్నారు. అధికారులు భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో విప్లవాత్మక మార్పులు
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ గూడూరు: భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మండలంలోని భూపతిపేట రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్లో ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, దీంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు ఆధార్ లింకు ద్వారా భూధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా సీతానగరం గ్రామంలో నెలకొన్న రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వగా, అవసరమైతే తాను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మంచారి, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, డీఏఓ విజయనిర్మల, నెక్కొండ ఏఎంసీ వైస్ చైర్మన్ నరేష్రెడ్డి, ఏడీఏ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
మహబూబాబాద్
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సివిల్స్లో మెరిశారు..9● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్కు 255వ ర్యాంకు ● ఐఏఎస్ కావాలని లక్ష్యంతోనే ముందుకు.. ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతి భ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటిర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకులు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్వర్క్ – వివరాలు 10లోu -
అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి
నెహ్రూసెంటర్: మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైతే వెంటనే షీటీంకు తెలపాలని షీటీం ఎస్సై సునంద అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళల భద్రత, రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, డ్రగ్స్, మత్తు పదార్ధాలపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఈవ్టీజీంగ్, పని ప్రదేశాల్లో వేదింపులకు గురైతే వెంటనే షీటీంకు లేదా 100 డయల్ చేయవచ్చని, షీటీం నంబర్ 87126 56935 ఫోన్ చేసి చెప్పాలన్నారు. టీసేఫ్ యాప్ ట్రావెలర్ యాప్ అని ట్రావెలింగ్ చేసే ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, ఏఓ గఫర్, షీ టీం ఉమెన్ పీఎస్ ఎస్సై ఆనందం, షీటీం సిబ్బంది అరుణ, పార్వతి, రమేశ్, ఏహెచ్టీ సిబ్బంది సుప్రజ, భరోసా సిబ్బంది బేబీ, తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలలో సౌకర్యాలు కల్పించాలి
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని సామాజికవేత్త డాక్టర్ వివేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీఎంసీని సోమవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలలో భవనాలు, హాస్టల్ భవనాలు, ఆసుపత్రికి సంబంధించిన పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భవనాలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమానాయక్, విష్ణు, శాంతికుమార్, సాయికుమార్, సూర్యప్రకాశ్, శివవర్మ పాల్గొన్నారు. -
రైతు సేవకే పునరంకితం కావాలి
మరిపెడ రూరల్: ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కమిటీదేనని, ఆత్మ కమిటీ రైతు సేవకే పునరంకితం కావాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. సోమవారం మరిపెడ మండలంల గిరిపురం గ్రామ రైతు వేదికలో మరిపెడ డివిజన్ వ్యవసాయ అధికారి విజయ్ చందర్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికై న మరిపెడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్రెడ్డితో పాటు 23 మంది కమిటీ డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంటికొమ్ము యుగేందర్రెడ్డి, నూకల అభినవ్రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరరెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, కాలం రవీందర్రెడ్డి, కాలం శ్రీనివాస్రెడ్డి, అఫ్జల్, ఉపేందర్ పాల్గొన్నారు. -
తక్షణమే సస్పెండ్ చేయాలి
గంగారం: మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ దేశిరామ్ను సస్పెండ్ చేయాలని తుడుం దెబ్బ కార్యనిర్వాహక అధ్యక్షుడు పులసం మునేష్ కోరారు. గంగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలోఆయన మాట్లాడుతూ.. సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో పనిచేస్తున్న ఆదివాసీ, గిరిజన ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులపై ప్రైవేట్ వ్యక్తులతో, ఆయా పాఠశాలలు, ఆశ్రమ వసతి గృహాలలో సమస్యలు లేకపోయిన ఉన్నట్లుగా పేపర్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. తక్షణమే డీడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
క్రీడలతో మానసికోల్లాసం
తొర్రూరు: క్రీడలతో ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు. అనుమాండ్ల మాధవరెడ్డి స్మారకార్థం వాలీబాల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జట్లు పాల్గొనగా రఘునాథపల్లి జట్టు ప్రథమ స్థానంలో, మేడారం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గొడిశాల నగేష్, ఎంఈఓ బుచ్చయ్య, ప్రతినిధులు వాసిరెడ్డి ప్రవీణ్రెడ్డి, సూరం ఉపేందర్రెడ్డి, కొండం జనార్ధన్, హెచ్ఎం లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. -
మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్
తొర్రూరు రూరల్: గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన మేరుగు మల్లేశంగౌడ్ను నియమిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ అనంతుల రమేశ్గౌడ్ నియామక పత్రాన్ని సోమవారం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి గూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని జిల్లా నాయకుడు పొదిళ్ల నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2029ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందన్న నమ్మకాన్ని ఇప్పటి నుంచే కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాసమల్ల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ నాయిని ధర్మారెడ్డి, ఎంపీపీ చెల్పూరు వెంకన్న, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోతు రాంబాబు, శ్రీశైలం, విజయశ్రీ, నాగేశ్వర్రావు, పడాల నాగరాజు పాల్గొన్నారు. ఆర్థికసాయం మహబూబాబాద్: మానుకోట మండలంలోని కంబాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో 1988–89 పదో తరగతి బ్యాచ్కు చెందిన అక్బర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తోటి మిత్రులు సోమవారం రూ.37,500 ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో మిత్రులు నూకల సుధీర్రెడ్డి, కిరణ్రెడ్డి, భీముడు వెంకటప్పయ్య, జయపాల్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణకు కేంద్రం కుట్ర మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ ఆస్తులు అక్రమణకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జేఏసీ ఉద్యమ నేత చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీల ధరించి ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యమ, వామపక్ష, కుల, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వక్ఫ్ జాయిట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ సాహెబ్, ఫజల్, ఇబ్రహిం, రహీం, జాకీర్, నజీర్, జావీద్, నయీమ్, షకిల్, సత్తార్, యూసఫ్ పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పెద్దవంగర: పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు వహించాలని మండల పశువైద్యాధికారి రాజశేఖర్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కేతిరెడ్డి సోమనర్సింహరెడ్డి, సిబ్బంది సంధ్య, అనిల్, హసన్, ఉప్పలయ్య పాల్గొన్నారు. పూర్వ విద్యార్థి విరాళం మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్ధి శేరి వీరయ్య పాఠశాల అభివృద్ధి కోసం రూ.20వేలు సోమవారం విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం గుగులోత్ లక్ష్మి, ఉపాధ్యాయులు రవి, రాధిక, సువర్ణ, కవిత, శ్రీజ పాల్గొన్నారు. ఫ్రీజర్ బాక్స్ అందజేత దంతాలపల్లి: మండల కేంద్రానికి చెందిన సేను రాజేష్ తన భార్య మహేశ్వరి జ్ఞాపకార్థం, నెల్లూరి యాకయ్య తన తండ్రి నారాయణ జ్ఞాపకార్థం చెరో రూ.36వేల చొప్పున రూ.73వేల విలువ చేసే ఫ్రీజర్ను గ్రామ పంచాయతీ కార్యలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకన్న, ఎస్సై పిల్లల రాజు, నాయిని శ్రీనివాస్ రెడ్డి, సంపెట సురేష్, యాకయ్య పాల్గొన్నారు. నార్మల్ డెలివరీతో ఆరోగ్యం గార్ల: నార్మల్ డెలివరీలతోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని గార్ల సీహెచ్సీ డాక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం స్థానిక సీహెచ్సీ ఆసుపత్రిలో ఎస్.స్వప్నకు నార్మల్ డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కార్యక్రమంలో హెడ్ స్టాఫ్నర్సు స్వాతి, స్టాఫ్నర్సులు రమాదేవి, నాగమణి, పుష్పలత, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
అఽధిక ధరలను నియంత్రించాలి
మహబూబాబాద్: అధిక ధరలను వెంటనే నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. ధరలు పెరగడంతో పేదలపై తీవ్రభారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం మోదీ కేవలం కార్పొరేట్లకే ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్ సారథిరెడ్డి, శ్రీనివాస్, ఇక్బాల్, ఫరీద్ రియాజ్, చాంద్, పెరుగు కుమార్, నవీన్ పాల్గొన్నారు. -
అమెరికాతో ఒప్పందాలు విరమించుకోవాలి
తొర్రూరు: అమెరికాతో భారత్ ఒప్పందాలు విరమించుకోవాలని వామపక్ష సంఘాల నాయకులు పేర్కొన్నారు. భారత్కు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ రాకను నిరసిస్తూ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో సోమవారం డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో నిరసన తెలిపారు. అమెరికాకు లాభం చేకూర్చేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో నాయకులు ముంజంపల్లి వీరన్న, ఎండీ యాకూబ్, ఆలకుంట్ల సాయిలు, ఊడుగుల లింగన్న, జమ్ముల శ్రీను, యాకాంతం, వల్లపు సాయిలు పాల్గొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటనను నిరసిస్తూ ఆందోళన బయ్యారం: అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత పర్యటనను నిరసిస్తూ సోమవారం మండలకేంద్రంలో వామపక్ష ప్రజా, రైతుసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలో వ్యవసాయరంగంను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే అమెరికా ఉపప్రధాని పర్యటనను భారతదేశంలో నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, మండ రాజన్న, బిల్లకంటి సూర్యం, భిక్షం, పాల్గొన్నారు. -
ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించాలి
గార్ల: సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగునీటిని ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు అందించాలని కోరుతూ సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈధర్నాను ఉద్దేశించి న్యూడెమోక్రసీ పార్టీ మండల కార్యదర్శి జి.సక్రు మాట్లాడారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీరామ్కు అందజేశారు. కార్యక్రమంలో మాన్యా, సీహెచ్ గణేశ్, రైతులు పాల్గొన్నారు. -
తాగునీరు రావడం లేదని రాస్తారోకో
నెల్లికుదురు: వారం రోజుల నుంచి తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులతో మొరపెట్టుకున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయడం లేదని సీపీఎం మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లాని పాపారావు, బీఆర్ఎస్ నాయకుడు బైస రమేశ్ అధికారులపై మండిపడ్డారు. మండలంలోని మునిగలవీడు గ్రామంలో 10రోజుల నుంచి తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సోమవారం రాస్తారోకో చేపట్టారు. గ్రామంలో మంచినీటి కొరత లేదని ఎంపీఓ పద్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
పోస్టుమార్టం గది ప్రారంభమెప్పుడో?
గార్ల: గార్ల కమ్యూనిటీ హెల్త్సెంటర్ (సీహెచ్సీ)లో నూతన పోస్టుమార్టం భవనం నిర్మాణం పూర్తయి 8నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రారంభించక పోవడంతో మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించడం లేదు. సీహెచ్సీ వైద్యులు మాత్రం సరిపడా సిబ్బంది ఉన్నా ప్రమాదవశాత్తు చనిపోయిన, పురుగుమందు తాగి మృతిచెందిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం లేదు. దీంతో మృతదేహాల పోస్ట్మార్టం కోసం నిరుపేదలు రూ.10,000 ఖర్చు పెట్టుకొని వాహనం మాట్లాడుకొని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. గార్లలో 6ఏళ్ల క్రితం సకల సౌకర్యాలతో నాటి ప్రభుత్వం రూ.5కోట్లు వెచ్చించి 30పడకల ఆస్పత్రిని నిర్మించింది. కాని ఆస్పత్రిలో పోస్ట్మార్టం భవనంను విస్మరించింది. దీంతో మండలంలోని వామపక్ష పార్టీల నాయకులు సీహెచ్సీలో పోస్ట్మార్టం భవనం నిర్మించాలని పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా ఎట్టకేలకు ఆస్పత్రి వెనుకభాగంలో ప్రభుత్వం 8నెలల క్రితం నూతన పోస్టుమార్టం భవనం నిర్మాణం చేపట్టింది. కాని ఈ పోస్ట్మార్టం భవనంలో రైలు, రోడ్డు ప్రమాదాలు, పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకున్న మృతదేహాలకు సీహెచ్సీ వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించడంలో ఆసక్తి కనబర్చడం లేదు. మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తే సాక్ష్యం కోసం మాటిమాటికి వైద్యులు కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని, మనకెందుకు రిస్క్ అని వైద్యులు తప్పించుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా కలెక్టర్, జిల్లా డీసీహెచ్ఎస్ స్పందించి సకల సౌకర్యాలు ఉన్న స్థానిక సీహెచ్సీ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని వివిధ పార్టీల నాయకులు, మండల ప్రజలు డిమాండ్ చేశారు.ఆర్థికంగా నష్టపోతున్నారు.. గార్ల సీహెచ్సీలో వైద్యులు, వైద్యసిబ్బంది ఉన్నా మృతదేహాలకు పోస్ట్మార్టం చేయడం లేదు. వైద్యులు, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వలన, పోస్ట్మార్టం కోసం మృతదేహాలను రూ.10వేలు ఖర్చు పెట్టి వ్యాన్ తీసుకొని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వెళ్తూ నిరుపేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. కలెక్టర్ స్పందించి సీహెచ్సీలో పోస్ట్మార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. – ఇమ్మడి గోవింద్, గోపాలపురం నిర్మాణం పూర్తయి 8నెలలు.. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తూ ఆర్థికంగా నష్టపోతున్న పేదలు ప్రారంభించాలని కోరుతున్న ప్రజలు -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కురవి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. కురవి, సీరోలు మండలాల్లోని కందికొండ, చింతపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, రెండు మండలాల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్రెడ్డి, అంబటి వీరభద్రంగౌడ్, బండి శ్రీనివాస్, జెరిపోతుల మహేష్గౌడ్, దువ్వ సైదులు, చందూలాల్, సతీష్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి మరిపెడ రూరల్: మండలంలోని తానంచర్ల శివారు పాలేరు వాగు ఒడ్డును స్వయంభూగా వెలసిన గంగాభవాని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. జాతరకు ఎమ్మెల్యే హాజరై ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు మాజీ కమిషనర్ గుగులోతు శంకర్నాయక్, నాయకులు యుగేందర్రెడ్డి, పురుషోత్తమరెడ్డి, తాజుద్దీన్, ఐలమల్లు, కోట వెంకట్రెడ్డి, గుగులోతు రవి, పాశం నరేష్రెడ్డి, మచ్చ వెంకటనర్సు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మరిపెడ రూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొలగాని సతీష్ సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మరిపెడ మండలంలో అకేరు, పాలేరు వాగుల నుంచి ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా చెక్పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, మండలంలోని బీచ్రాజ్పల్లి గ్రామానికి చెందిన చిదుముల విజయ్, బాల్నిధర్మారానికి చెందిన గుడిమల్ల ఉపేందర్, చిన్నగూడూరు మండలం విస్సంపల్లికి చెందిన బొమ్మ రవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవాలి మరిపెడ/నర్సింహులపేట: పిల్లలు, మహిళలకు పోషకాహారాన్ని అందించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి గుగులోతు రవి అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మరిపెడలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు రాజ్యలక్ష్మీ, సీడీపీఓ ఎల్లమ్మ , అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశలు పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టం రద్దుకు పోరాడుదాం
మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ సవరణ చట్టం రద్దుకు ముస్లింలందరూ ఐక్యంగా పోరాడాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మాజీ మంత్రి సత్యవతి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, వామపక్షాల నాయకుల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో హిందూ ముస్లిం భాయి భాయి అని గాంధీ శాంతియుత ర్యాలీ చేసి భిన్నత్వంలో ఏకత్వమని నిరుపించారన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేవరకు మనమందరం కలిసి పోరాడాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ను బొందపెట్టాలన్నారు. రైతులు, క్రిస్టియన్లు, ముస్లిం వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ రాజ్యాంగంపై దాడులు చేస్తూ.. మానవ హక్కులను కూడా కాలరాస్తోందని మండిపడ్డారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టం రద్దుకోసం పార్లమెంట్లో గళం విప్పుతామన్నారు. శుక్రవారం 2 గంటల పాటు ముస్లింలు నిరసన పోరాటం చేయాలని, చట్టం రద్దు అయ్యేవరకు కలిసికట్టుగా పోరా డుదామని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వ పార్టీ అని పేద, మధ్య, బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్య చిచ్చుపెడుతుందని, వక్ఫ్ సవరణ చట్టాన్ని తుంగలో తొక్కాలన్నారు. ముస్లిం మత పెద్ద మహ్మద్ ఇక్బాల్, జిల్లా కన్వీనర్ ఎండీ. ఫరీద్, ఖలీల్, అలంగీర్, హఫీజ్ అబ్దుల్, అహ్మద్, రిజవి, షేక్ అక్రమ్ ఖలీద్, అక్బర్, వాహెద్, షేక్ చాంద్, అసద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
కొత్తగూడ/గంగారం: ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయి న భూ సమస్యలకు భూ భారతి చట్టంతో పరిష్కా రం లభిస్తుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అ న్నారు. సోమవారం కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ధరణి వల్ల భూరికార్డులు లేకుండా పోయాయని అన్నారు. మళ్లీ ప్రతీ భూమికి భూ భారతి ద్వారా రికార్డులు వస్తాయని అన్నారు. ప్రతీ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి భూమిపై ఎవరు సాగులో ఉన్నారు, ఎన్ని ఏళ్లుగా ఉన్నారు, హద్దులు, ఏమైనా సివిల్ తగాదాలు ఉన్నాయా లేదా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తయారు చేస్తారని చెప్పారు. రికార్డులు లేకుండా పోయిన పట్టా భూములకు పరిష్కారంతో పాటు మోఖా మీద ఎవరు ఉన్నారని తేలిపోతుందన్నారు. దీంతో రైతులకు సకాలంలో న్యాయం జరుగుతుందన్నారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్లు రమాదేవి, సత్యనారాయణ, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, అప్పరావు పాల్గొన్నారు. పహాణీల ద్వారా పంట రుణాలు ఇవ్వాలి: చల్ల నారాయణరెడ్డి, రైతు షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమికి పహాణీలు జారీ చేసి పంట రుణాలు ఇవ్వాలని రైతు చల్ల నారాయణరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో 1/70కి లోబడి ఉన్న భూములకు పహాణీల ద్వారా రుణాలు వచ్చాయని చెప్పాడు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి సమాధానం ఇస్తూ పట్టాలతో సంబంధం లేకుండా పహాణీల ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని భూ భారతిలో ప్రత్యేక నిబంధన ఉన్నట్లు తెలిపారు. ధరణిలో రద్దయిన పట్టాలను పునరుద్ధరించాలి: బిట్ల శ్రీనివాస్, రైతు ధరణి చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో రద్దయిన పట్టాలను పునరుద్ధరించాలని రైతు బిట్ల శ్రీనివాస్ కలెక్టర్ను కోరాడు. ఈవిషయమై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశాడు. కలెక్టర్ సమాధానం ఇస్తూ ఫారెస్ట్ శాఖను అనుసంధానం చేసుకుని సమస్య పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్దేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్దూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్దూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులో నుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్ఫర్ట్స్తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు -
అర్హుల నిరీక్షణ!
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘ఈ ఫొటోలోని మానసిక దివ్యాంగుడు మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన గంట శ్రీనివాస్–మౌనిక దంపతుల కుమారుడు రాజేందర్. పుట్టిననాటి నుంచి 15ఏళ్లుగా మానసిక స్థితి బాగాలేక లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయినప్పటికీ ఆయనలో మార్పులేకపోవడంతో సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2024 ఏప్రిల్ 19న వందశాతం అంగవైకల్యం ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల తల్లి మౌనిక మరణించడంతో తండ్రి కూలీ పనిచేస్తేనే కుటుంబం గడుస్తోంది. ఈ పరిస్థితిలో పింఛన్ వస్తే ఆసరాగా ఉంటుందని ఎదురు చూస్తున్నారు.’సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం అర్హులకు ఆత్మీయ భరోసా పింఛన్లు అందించి ఆసరాగా నిలుస్తోంది. అయితే 2022 ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలో మూడేళ్లుగా సుమారు 20వేల మందికి పైగా కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమేరకు పింఛన్ మంజూరు చేయాలని సదరం సర్టిఫికెట్ పట్టుకొని కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తుల వెల్లువ.. రాష్ట్ర వ్యాప్తంగా 2024 జనవరిలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా 17,111 మంది పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా మూడు సంవత్సరాలుగా ప్రమాదాలు, వ్యాధులతో పాటు ఇతర కారణాలతో అంగవైకల్యం పొందిన వారు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంగవైకల్యం ఉందని డాక్టర్లు నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేసిన వారు మరో 1700మంది వరకు ఉంటారని, 1800 మేరకు ఇటీవల అర్హత పొందిన వృద్ధులు, వితంతులు ఉంటారని అంచనా. ప్రస్తుతం 1.09లక్షల పింఛన్లు.. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1,09,240 మందికి ప్రతీ నెల రూ. 27.86కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తుంది. వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బోదకాలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ. 2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. అలాగే దివ్యాంగులకు నెలకు రూ. 3016 చొప్పున అందజేస్తున్నారు. న్యూస్రీల్మూడేళ్లుగా మంజూరు కాని కొత్త పింఛన్లు సదరం సర్టిఫికెట్ పట్టుకొని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అందని వైనం వృద్ధులు, వితంతులు, నేత, గీత కార్మికుల ఎదురుచూపు మంజూరు చేయాలని వేడుకోలు జిల్లాలో ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ల వివరాలు పింఛన్ రకం సంఖ్య వృద్ధాప్యం 45,707 వితంతు 41,500 చేనేత కార్మికులు 380 గీత కార్మికులు 2,938 బోదకాలు బాధితులు 375 బీడీ కార్మికులు 14 ఒంటరి మహిళ 3014 డయాలసిస్ పేషెంట్లు 74దివ్యాంగ 15,238 మొత్తం 1,09,240 -
ఏడేళ్ల తర్వాత తెరుచుకున్న బడి
● ఉపాధ్యాయుల ప్రయత్నంతో ప్రాథమిక పాఠశాల రీఓపెన్ బయ్యారం: బడీడు పిల్లల నమోదు లేక ఏడు సంవత్సరాలు మూత పడిన ప్రభు త్వ పాఠశాల ఎంఈఓ, ఉపాధ్యాయుల చొరవతో తిరిగి తెరుచుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్త ఇర్సులా పురం ప్రాథమిక పాఠశాలను విద్యార్థుల నమోదు లేకపోవడంతో ఏడేళ్లక్రితం మూసివేశారు. దీంతో ఆ గ్రామ విద్యార్థులు మండలం కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎంఈఓ దేవేంద్రాచారి సూచనతో ఉపాధ్యాయులు బానోత్ రాజు, బేబి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. వారి ప్రయత్నంతో 23 మంది విద్యార్థులను తల్లిదండ్రులు వచ్చే విద్యాసంవత్సరం(2025–26) పాఠశాలలో చదివించేందుకు అంగీకరించి అడ్మిషన్ తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాలను ఎంఈఓ దేవేంద్రాచారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భద్రునాయక్, శోభన్, రామకృష్ణ, రాజు, బేబి, గోవర్ధన్, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు ఐలయ్య, వీరన్న, కృష్ణ, నరేశ్, లింగన్న, లివిన్, విజయ, అరుణ, మైబూబి తదితరులు పాల్గొన్నారు. -
రజతోత్సవ సభతో బీఆర్ఎస్కు పూర్వ వైభవం
● మాజీ మంత్రి సత్యవతి రాఽథోడ్ మహబూబాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, ఆ సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం గూడూరు మండలం దామరవంచ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తి గా విఫలమైందన్నారు. కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారన్నారు. రజతో త్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు యాళ్ల మురళీధర్రెడ్డి, లూనావత్ అశోక్, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాల తనిఖీనెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు సోమవారం తనిఖీ చేశారు. నర్సింగ్ విద్యార్థులకు అందుతున్న క్లినికల్ ట్రైనింగ్, తరగతులు, ల్యాబ్లు, మ్యూజియం, పరీక్షలు, మౌలిక వసతులు, బిల్డింగ్ తదితర అంశాలను పరిశీలించారు. కళాశాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థుల క్లినికల్ ట్రైనింగ్, వార్డులను పరిశీలించారు. అర్బన్ హెల్త్ సెంటర్కు వెళ్లి నర్సింగ్ విద్యార్థుల ట్రైనింగ్ గురించి తెలుసుకున్నారు. అనంతరం నర్సింగ్ కళాశాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కేటాయించిన బిల్డింగ్, నర్సింగ్ కళాశాలలో ఉన్న ఫ్యాకల్టీ, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లీలా తదితరులు ఉన్నారు. అలాగే మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఫౌంటేన్ కాదు.. భగీరథ పైపులైన్ లీకేజీకురవి: ఇది ఫౌంటేన్ అనుకుంటే పొరపాటే.. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ. మండల కేంద్రం శివారు పెద్ద చెరువు సమీపంలో 365 జాతీయ రహదారి పక్కన భగీరథ పైపులైన్ లీకేజీతో నీళ్లు ఫౌంటేన్లా విరజిమ్ముతూ సోమవారం వృథాగాపోయాయి. దీంతో ఆ రహదారి వెంట వెళ్లే వాహనదారులు వృఽథాగా పోతున్న నీటిని చూసి అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. తాగునీటిని వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై భగీరథ సూపర్వైజర్ను వివరణ కోరగా వేరే చోట పైపు పగిలిపోవడంతో ఎయిర్వాల్వ్ను విప్పి నీటిని బయటకు పంపించి పగిలిన పైపు మరమ్మతులు చేసినట్లు సూపర్వైజర్ వెంకటరెడ్డి తెలిపారు. గణితంతోనే అన్ని విభాగాల్లో పరిశోధనలు ● నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఉమామహేశ్ కాజీపేట అర్బన్: గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్ సెమినార్హాల్ కాంప్లెక్స్లోని హామిబాబా హాల్లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్రీచ్మెంట్ వర్క్షాప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మా ట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. వారం రోజుల వర్క్షాప్ వేదికగా నిలవాలన్నారు. నిట్ మ్యా థమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు ఉన్నారు. -
ఆకట్టుకున్న రైతు దామోదర్రెడ్డి స్టాల్●
● నిజామాబాద్ రైతు మహోత్సవంలో ఏర్పాటు ● 17 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మూడురోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. వివిధ జిల్లాలకు చెందిన పలపలు పంటలు పండించే రైతులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సుభాష్ పాలేకర్ విధానంలో పూర్తిగా ప్రకృతి విధానంలో వ్యవసాయం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన రైతు గంట దామోదర్రెడ్డి ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. గంట దామోదర్రెడ్డి 1974లో బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేశారు. 1978 నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అయితే గత 17 ఏళ్లుగా సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 11 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మొదట 4 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టగా మొదట్లో అంతగా దిగుబడులు రాలేదు. తరువాత 3వ సంవత్సరం నుంచి దిగుబడులు వచ్చాయి. ప్రస్తుతం దామోదర్రెడ్డి 22 రకాల పసుపు పంట పండిస్తున్నారు. అదేవిధంగా వేరుశనగ, పప్పుదినుసులు, గోధుమ, జొన్న పండిస్తున్నారు. పసుపు, కంది, వేరుశనగ సాగులో సుభాష్ పాలేకర్ విధానంలో మల్చింగ్ షేడ్ వేస్తున్నారు. ఇక అతికష్టం మీద మెట్ట వరిలో సైతం మల్చింగ్ షేడ్ వేస్తున్నారు. ఇందుకు గాను జాతీయ అవార్డు సాధించారు. దామోదర్రెడ్డి ఉత్పత్తులకు వ్యవసాయ శాఖ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. దీంతో మార్కెటింగ్కు ఢోకా లేకుండా పోయింది. పసుపుతో క్యాన్సర్కు ఔషధం ఇస్తున్నట్లు దామోదర్రెడ్డి తెలిపారు. -
వడదెబ్బపై అవగాహన కల్పించాలి
మహబూబాబాద్ రూరల్: వైద్యాఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది వేసవికాలం దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ భూక్య రవిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వేసవికాలం దృష్ట్యా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్లను ఏర్పాటు చేయాలని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా సకాలంలో గర్భిణుల వివరాలను నమోదు చేయాలని, వ్యాధి నిరోధక టీకాలను వందశాతం పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సాగర్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, ఆరోగ్య విద్యా బోధకులు రాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మేరీ, ఎంపీహెచ్ఈఓ నరేశ్, సూపర్వైజర్లు చక్రి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భూక్య రవిరాథోడ్ -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్ వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నా రు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ఆ వినతుల గడువులోపే పరిష్కరించి ప్రజలకు నమ్మకం కల్పించాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నారని, వెంటనే విచారణ చేయాలని మానుకోట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మట్టూరి నాగేశ్వర్రావు వినతి పత్రం అందజేశారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీని రద్దు చేసి గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రజావాణిలో 63 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, తొర్రూరు ఆర్డీఓ గణేశ్, సీపీఓ సుబ్బారావు, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ప్రజావాణిలో 63 వినతులు -
‘పట్టు’.. రాయితీ కొట్టు..
డోర్నకల్ : రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం మల్బరీ సాగు, పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ‘సిల్క్ సమగ్ర పథకం’ ద్వారా అన్నదాతలకు మేలు చేకూర్చడానికి రాయితీలు కల్పిస్తోంది. ప్రతీ సంవత్సరం పట్టు గూళ్ల ధర పెరుగుతుండడంతోపాటు జనగామ, హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రైతులకు ఉద్యాన పట్టుపరిశ్రమ శాఖ రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. ఇతర వాణిజ్య పంటల కన్నా మల్బరీ, పట్టుపరిశ్రమతో అధిక లాభాలు వస్తుండడంతో రైతులకు అవగాహన కల్పించి సాగును పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిల్క్ సమగ్ర పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, జనరల్ రైతులకు వేర్వేరు రాయితీలు ప్రకటించింది. మల్బరీ సాగుకు అనుకూలాంశాలు.. మల్బరీ సాగుకు నీటి అవసరం తక్కువ ఉంటుంది. ఈ మొక్కలు ఒకసారి నాటితే 10 నుంచి 15 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. నల్ల రేగడి, చౌడు భూములు మినహా మిగతా భూములన్నీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. రెండెకరాల్లో మల్బరీ సాగు చేస్తే మొదటి ఏడాది రెండు నుంచి మూడు పంటలు తీసుకుని రూ.2 లక్షల ఆదాయం పొందొచ్చు. రెండో సంవత్సరం నుంచి 6 నుండి 7 పంటలు తీసుకుని రూ.4 లక్షల ఆదాయం పొందొచ్చు. క్రిమి సంహారక మందుల వినియోగం అవసరం ఉండదు. దరఖాస్తులకు ఆహ్వానం.. మల్బరీ సాగు, పట్టుపరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి కలిగిన రైతులు ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులు బి.వెంకన్న(పట్టుపరిశ్రమ అధికారి, 8977714628), కె.సురేశ్(సహాయ పట్టుపరిశ్రమ అధికారి, 8977714605), డి.రాజయ్య(సహాయ పట్టుపరిశ్రమ అధికారి 897771468) సంప్రదించాలి.రైతులకు రాయితీలు(రూపాయల్లో)..వివరాలు జనరల్ ఎస్సీ/ఎస్టీ రెండెకరాల మల్బరీ సాగుకు 60,000 78,000 నీటి సదుపాయానికి 55,000 65,000 పట్టుపురుగుల రేలింగ్ షెడ్ నిర్మాణం 2,25,000 2,92,500 పరికరాలకు 37,500 48,750 రోగనిరోధక మందులకు 2,500 3250 కిసాన్ నర్సరీ ద్వారా మొక్కల పెంపకం కోసం 75,000 97,500 మొత్తం 4,50,000 5,85,000‘మల్బరీ’కి ప్రోత్సాహం పంట సాగుకు ‘సిల్క్ సమగ్ర పథకం’ రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం రాయితీలతో ప్రోత్సహిస్తున్నాంమల్బరీ సాగు, పట్టుపరిశ్రమ పెంపు కోసం రాయితీలతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. పత్తి, మిరప, వరి పంటలకు ప్రత్యామ్నాయ పంటగా మల్బరీ సాగు లాభదాయకంగా ఉంటుంది. సాగు కోసం రైతులు పట్టుపరిశ్రమ శాఖ అధికారులను సంప్రదించాలి. –ఏ. ముత్యాలు, పట్టుపరిశ్రమశాఖ ఉపసంచాలకుడు, మహబూబాబాద్ -
అంపైర్స్ ‘వర్క్షాప్’నకు ఆహ్వానం
వరంగల్ స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ అంపైర్స్ వర్క్షాప్, ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కొటాక్ గోపిచంద్ అకాడమీలో నిర్వహించే వర్క్షాప్, ఎగ్జామ్ అనంతరం సర్టిఫికేషన్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్న వర్క్షాప్లో పాల్గొనే వారు ఏదైనా డిగ్రీ చదవి, తెలంగాణ వారై ఉండి, 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. వర్క్షాప్లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా యూనిఫాం కలిగి ఉండాలని, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ మాత్రమే అందజేయనున్నట్లు, వసతి, ఇతర అలవెన్సులు కల్పించబడవని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శుల లెటర్హెడ్ పై దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు స్వాధీనం దామెర: అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామశివారులో చోటుచేసుకుంది. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, సీఐ శ్రీధర్, దామెర ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. పసరగొండ గ్రామ శివారులోని శ్రీ సాయి ఇన్ఫ్రా క్రషర్లో సూపర్ వైజర్గా పనిచేస్తున్న మంద నాగరాజు గ్రామం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు దాచి ఉంచాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 400 జిలెటిన్ స్టిక్స్, 150 డిటోనేటర్లు, డిటోనేటర్ ఫ్యూజు వైర్లు, 45 కిలోలు అమోనియా నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంద నాగరాజుపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. సజ్జ కూలి మేసీ్త్ర మృతి ● నాగిరెడ్డిపల్లిలో ఘటన బచ్చన్నపేట : నూతన ఇంటి సజ్జ కూలి మీదపడడంతో ఓ మేసీ్త్ర మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బల్లెకురువ మండలం పాలెం గ్రామానికి చెందిన అచ్చి వెంకటేశ్వర్లు (61) సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో నివాసముంటున్నాడు. చుట్టు పక్కల గ్రామాల్లో నూతన ఇంటి నిర్మాణ పనులకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో కూడా నూతన ఇంటి నిర్మాణ పనులకు వెళ్లాడు. తొమ్మిది రోజుల క్రితం పోసిన సజ్జల సెంట్రింగ్ బాక్స్లను తొలగిస్తుండగా సజ్జ కూలి మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కే. హామీద్ తెలిపారు. కాగా, మృతుడికి కూతురు ఉంది. రాంకీ విల్లాలో చోరీ ● రూ.12 లక్షల మేర బంగారం, నగదు అపహరణ వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని రాంకీలోని 52 నంబర్ విల్లాలో చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.12 లక్షల వరకు అపహరణకు గురయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ కథనం ప్రకారం.. ఈ విల్లాలో అద్దెకుంటున్న వారు ఆదివారం మధ్యాహ్నం నగరంలో జరిగిన ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. దీంతో లోపలికివెళ్లి పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన 10తులాల బంగారంతో పాటు సుమారు రూ.లక్షన్నర నగదు, రిజిస్ట్రేషన్ పేపర్లు కనిపించలేదు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన క్లూస్టీంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ షుకూరు తెలిపారు. పిడుగుపాటుకు కూలిన పౌల్ట్రీ ఫామ్ బచ్చన్నపేట : పిడుగుపాటుకు పౌల్ట్రీ ఫామ్ కూలి కోళ్లు మృత్యువాత పడిన ఘటన మండలంలోని నక్కవానిగూడెంలో జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. శనివారం రాత్రి గాలిదుమారంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడి పౌల్ట్రీ ఫామ్ కూలింది. దీంతో 500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో రూ. 5 లక్షల నష్టం వాటిళ్లిందని బాధితుడు లబోదిబోమన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. -
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
వేలేరు: ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని సీనియర్ శాస్త్రవేత్త రాజశేఖర్ రెడ్డి,కేఎన్ బయోసైన్స్ ఎండీ సుధారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లసాగర్లో కేఎన్ బ యో సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ తో టలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశారు. వేసవిలో సరిపడ నీరు లేకపోతే మొక్కల్లో వచ్చే లోపాలు, వాటి యాజమాన్య పద్ధతులను వివరించారు. ఆయిల్పామ్ సాగులో సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలని సూచించారు. ప్రభుత్వం ఆయి ల్ పామ్ రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాకాలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ డైరక్టర్ కుషాల్ రెడ్డి, జిల్లా మేనేజర్ రంజిత్, ఫీల్డ్ ఆఫీసర్లు విక్రమ్, మహిపాల్ పాల్గొన్నారు. -
తాన్యశ్రీకి గిన్నిస్ బుక్లో చోటు
పాలకుర్తి : మండలంలోని ఎల్ల రాయని తొర్రూరుకు చెందిన చిన్నారి తాన్యశ్రీ కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు ఆదివారం నిర్మల్ పట్టణ కేంద్రంలో స్వరూపిణీ నిత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో 2025 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సక్సెట్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 18 నెలల క్రితం కూచిపూడి నాట్యంలో ప్రతిభకనబర్చిన తాన్యశ్రీకి సర్టిఫికెట్లు, మోడల్స్ పంపిణీ చేశారు. దీంతో మాజీ ఎంపీటీసీ మడిపల్లి కౌసల్య, సోమయ్య, మాజీ సర్పంచ్ నాయిని మల్లారెడ్డి, మడిపల్లి దామోదర్, గ్రామస్తులు అభినందించారు. -
అండర్–7 చెస్ విజేత దేవాన్ష్రెడ్డి
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఎంఆర్ హైస్కూల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–7 చదరంగ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఉమ్మడి జిల్లా నుంచి 14 మంది బాలబాలికలు పాల్గొన్న ఈ పోటీల్లో బైరి దేవాన్ష్రెడ్డి విజేతగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. ద్వితీయ స్థానంలో అక్షాంత్ చౌహాన్, తృతీయ స్థానంలో వింజమూరి వీయాన్స్, వేనం హితాన్స్, బాలికల విభాగంలో మనీషాగాయత్రి, రన్వికతేజ, ఎం. నిత్య, చైత్రపూర్ణిమ వరుస నాలుగు స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. విజేతలు మే 10, 11 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటా రని తెలిపారు. ఈ ముగింపు వేడుకలకు ఎస్ఎంఆ ర్ స్కూల్ కరస్పాండెంట్ వెలగందుల విముక్తీశ్వర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు ప్రేమ్సాగర్, బైరి రఘువీరారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.