వడదెబ్బతో ట్రాలీ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ట్రాలీ డ్రైవర్‌ మృతి

Apr 27 2025 1:27 AM | Updated on Apr 27 2025 1:27 AM

వడదెబ

వడదెబ్బతో ట్రాలీ డ్రైవర్‌ మృతి

కమలాపూర్‌: మండలంలోని ఉప్పల్‌కు చెందిన కొయ్యడ చంద్రమౌళి (45) అనే ట్రాలీ ఆటో యజమాని, డ్రైవర్‌ వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాలీ ఆటో నడుపుతూ జీవనం సాగించే చంద్రమౌళి శనివారం వ్యవసాయ కూలీలను తీసుకొచ్చేందుకు వెళ్తున్న క్రమంలో ఎండ తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురయ్యాడు. ఈ క్రమంలోనే దేశరాజుపల్లి చెరువు కట్టపై చెట్టు నీడన ట్రాలీ ఆటోను నిలిపి సేదదీరుతుండగా వడదెబ్బతో ట్రాలీ ఆటోలోనే మృతి చెందాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చంద్రమౌళికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

వడదెబ్బతో  ట్రాలీ డ్రైవర్‌ మృతి
1
1/1

వడదెబ్బతో ట్రాలీ డ్రైవర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement