వడదెబ్బతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

May 1 2025 1:16 AM | Updated on May 1 2025 1:16 AM

వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి

వెంకటాపురం(కె): మండలపరిధిలోని రాచపల్లి గ్రామంలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాచపల్లి గ్రామానికి చెందిన మాదరి వెంకన్న(55) అనే వ్యక్తి గొల్లగూడెం గ్రామంలో గేదెల కాపలదారుగా పని చేశాడు. ఈ మేరకు బుధవారం జీతం డబ్బులు తీసుకునేందుకు గొల్లగూడెం గ్రామానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మొట్లగూడెం గ్రామసమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే వెంకన్న మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్‌ కింద పడి డ్రైవర్‌ మృతి

వర్ధన్నపేట: ట్రాక్టర్‌ టైరు కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని ఇల్లంద శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన ఇటికుల రవి (40) అదే గ్రామానికి చెందిన క రీం అనే వ్యక్తి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నా డు. ఈక్రమంలో బుధవారం వ్యవసాయ పను ల నిమిత్తం ఇల్లంద శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి గుంతలో పడటంతో డ్రైవర్‌ రవి ఎగిరి వెనకటైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె అక్ష య, కుమారుడు అఖిల్‌ ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.

కేడీసీ ఇన్‌చార్జ్‌

ప్రిన్సిపాల్‌గా రజనీలత

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా ఫిజిక్స్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కె.రజనీలత బాధ్యతలను నిర్వర్తించనున్నారు. బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్‌ జి. రాజారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న రజనీలతకు చార్జీని అప్పగించారు. అధికారికంగా కళాశాల విద్యాకమిషనర్‌ త్వరలోనే కేడీసీ ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌గా రజనీలతను నియమించనున్నట్లు సమాచారం.

ఇన్‌చార్జ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం కొద్దిరోజులపాటు ఇన్‌చార్జ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కేయూ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వర్తించిన తోట రాజయ్య బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో రెగ్యులర్‌గా కేయూకు ఫైనాన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూనివర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరైన డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఉంటే ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించేవారు. ఉద్యోగ విరమణ పొందిన రాజయ్య కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రంకు ఫైనాన్స్‌ ఆఫీసర్‌ బాధ్యతల చార్జీని బుధవారం అప్పగించారు.

‘అది ఫేక్‌.. స్పందించకండి’

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి పేరు, ప్రొఫైల్‌ పిక్చర్‌తో సాయం కోరుతూ మెసేజ్‌లు వస్తే స్పందించవద్దని బుధవారం కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి రామచంద్రదం ఒక ప్రకటనలో తెలిపారు. ఈవ్యవహారంపై కేయూ పోలీస్టేషన్‌లో, సైబర్‌క్రైమ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement