
అండర్–19 జిల్లా జట్టు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల రెండో వారంలో జ రగనున్న హెచ్సీఏ టు డే లీగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తుది జాబితాను వరంగల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ మంగళవారం ప్రకటించారు. మే 19 నుంచి జూన్ 3వ తేదీ వరకు హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాల స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 19 మంది క్రీడాకారులతో జట్టు ను ఎంపిక చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో కోచ్లు మహ్మద్ అఫ్జల్, పవన్ పర్యవేక్షణలో తుది జట్టు ఎంపిక చేశారు. జట్టులో స్థానం దక్కించుకున్న వారిలో బి. వరుణ్ (కెప్టెన్), కె. రోహిత్రెడ్డి, ఎం. శివరామ్, ఎన్. రాహుల్, ఎ. లక్ష్మణ్, ఎం. దేవేందర్, పి. రిశ్వంత్, ఎం. రామ్చరణ్, ఎస్. ఆదర్శ్, ఎం. రోహిత్, వి. వైష్ణవ్, జె. పార్థిపన్, డి. మనోజ్, బి. మణిదీప్ సింగ్, ఎం. రాణాచరణ్, నితిన్పటేల్, పి. సంతోశ్, బి. సతీశ్, పూజిత్ ఉన్నారు.
ఫైనాన్స్ కంపెనీ మోసం.. వ్యక్తి హఠాన్మరణం●
పాలకుర్తి టౌన్: అధిక రాబడి ఆశ చూపి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నిండా ముంచడంతో మనోవేదనకు గురైన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన పాలకుర్తి మండలం ముత్తారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బడికే సోమన్న (39) గతేడాది అప్పు చేసి హైదరాబాద్లోని మదాపూర్కు చెందిన 12 వెల్త్ క్యాపిటల్ అనే ప్రైవేట్ కంపెనీలో రూ. 8 లక్షలు 4 శాతం వడ్డీ ఆశతో డిపాజిట్ చేశాడు. మొదట రెండు, మూడు నెలలు వడ్డీ వచ్చింది. అయితే ఏడాది మధ్యలో కంపెనీ కార్యకలాపాలు ఆగిపోవడంతో మోసపోయానని గ్రహించాడు. ఇంతలో అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఇంటిని తాకట్టు పెట్టి కొంత మందికి చెల్లించాడు. బ్యాంకు నుంచి ఈఎంఐ, వడ్డీ చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో మంగళవారం గుండెపోటుకు గురై మృతి చెందాడు.